English | Telugu

ఎవరు ద్వేషించినా నేను ప్రేమిస్తూనే ఉంటాను


సింగర్ శ్రీరామచంద్ర గురించి అందరికీ తెలుసు. మంచి పాటలతో అలరిస్తూ ఉంటాడు. తెలుగులో బిగ్ బాస్ సీజన్ 5 ద్వారా మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు. 2007 లో సింగర్ గా తెలుగు ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు. దాదాపు 15 ఏళ్లుగా పాటలు పాడుతూ ఉన్నాడు. పవన్ కళ్యాణ్ మూవీలో "గెలుపు తలుపులే" అంటూ పాడిన పాటకు ఎంతో మంది ఫాన్స్ కూడా ఉన్నారు. ఇక ఎన్ని పాటలు పాడినా రాని గుర్తింపు బిగ్ బాస్ షో ద్వారా మంచి హిప్ వచ్చింది. అలాంటి శ్రీరామచంద్ర ఈమధ్య ఫారెన్ వెళ్లి మంచి మంచి షోస్ , ఈవెంట్స్ చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నాడు.

ఇక శ్రీరామచంద్ర, రేవంత్ ఇద్దరూ మంచి ఫ్రెండ్స్ ..ఐతే సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉండే శ్రీరామచంద్ర ఇప్పుడు తన స్టేటస్ లో ఫోటో పెట్టాడు. చేతికి క్యాన్ లా పెట్టుకుని విక్టరీ అంటూ రెండు వేళ్ళు చూపిస్తూ ఉన్న ఫోటో అది .."ద్వేషించే వాళ్ళు ద్వేషించనీ..కానీ నేను మాత్రం అందరినీ ప్రేమిస్తూనే ఉంటాను. తిరిగి మంచిగా వస్తాను" అని ఒక హార్ట్ ఎమోజితో ఒక టాగ్ లైన్ టైపు చేసి పెట్టాడు. కానీ తనకు ఏమయ్యిందో మాత్రం ఎక్కడ చెప్పలేదు. త్వరలో ఆహా వేదిక మీద ప్రసారం కాబోతున్న నేను సూపర్ విమెన్ షోకి హోస్ట్ గా కనిపించబోతున్నాడు. 2010 కి గాను ఇండియన్ ఐడియల్ సీజన్ 5 టైటిల్ విన్నర్ గా నిలిచాడు శ్రీరామచంద్ర. ఎన్నో టీవీ ప్రోగ్రామ్స్ లో పాటలు పాడి ఎన్నో వేదికల్లో టైటిల్ విజేతగా నిలిచాడు ఈ సింగర్. తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 1 కి హోస్ట్ గా కూడా చేసాడు. మరి ఇంతకు ఏమయ్యిందో కానీ ఇలా కొంచెం డల్ గా కనిపించాడు.

Podharillu : మహా, చక్రిలని వెతకడానికి రంగంలోకి దిగిన రౌడీలు.. ప్రతాప్ పట్టుకుంటాడా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -23 లో...మహా ఇంట్లో నుండి వెళ్లిపోతున్నట్లు లెటర్ రాసి బయటకు వచ్చి వాళ్ళ నాన్నని గుర్తుచేసుకొని ఏడుస్తుంది. ఎలాగోలా బయటకు వచ్చేస్తుంది మహా. ఆ తర్వాత చక్రి తీసుకొని వచ్చిన కార్ ఎక్కుతుంది. ముందు అ ఫోన్ నుండి సిమ్ తియ్యండి సిగ్నల్స్ ద్వారా ట్రేస్ చేస్తే ఎక్కడున్నామో తెలుస్తుందని చక్రి అనగానే అవునని సిమ్ తియ్యబోతుంటే భూషణ్ ఫోన్ చేస్తాడు. వీడికి బాకీ ఉన్న మాటలు బాగా ఉన్నాయని ఫోన్ లిఫ్ట్ చేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది. రేపు పెళ్లి పెట్టుకొని ఇలా మాట్లాడుతున్నావ్ ఏంటని భూషణ్ అంటాడు.

Jayam serial : గంగని టార్గెట్ చేసిన పారు.. రుద్ర గది నుండి బయటకు రాగలడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -162 లో... రుద్ర ఇంటికి రావడంతో శకుంతల కోప్పడుతుంది. ఆ గంగ అకాడమీలో స్టే చెయ్యడంతో ఈ ఇంటి పరువుపోతుంది వెంటనే తీసుకొని రమ్మని శకుంతల చెప్తుంది. రుద్ర తన నిర్ణయాన్ని పట్టించుకోడు. అ తర్వాత రుద్ర మళ్ళీ గంగ ఉన్న అకాడమీ దగ్గరున్న టీ షాప్ కి వెళ్లి కాసేపు ఆలోచిస్తాడు. ఇక గంగకి అకాడమీ వాళ్ళు ఏదైనా ఇబ్బంది పెడుతున్నారేమో అని ఆలోచించిన రుద్ర అక్కడ టీ షాప్ లో ఒక బుక్ తీసుకొని అకాడమీ కాంపౌండ్ దగ్గరికి వెళ్తాడు. గంగకి ఒక పేపర్ లో మెసేజ్ రాసి లోపలికి విసురుతాడు.

Illu illalu pillalu : అమూల్యకి పెళ్ళిచూపులు.. కామాక్షి ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -362 లో.. పెళ్లిచూపులకి ఇంకా రావడం లేదని రామరాజు వాళ్ళు ఎదురుచూస్తుంటే వాళ్ళు రారుగా అని శ్రీవల్లి మనసులో అనుకుంటుంది. అప్పుడే అబ్బాయి వాళ్ళు పెళ్లిచూపులకు ఎంట్రీ ఇస్తారు‌. దాంతో శ్రీవల్లి షాక్ అవుతుంది. భాగ్యం, ఆనందరావు కూడా వస్తారు. వాళ్ళు ఏం జరిగిందో శ్రీవల్లికి చెప్తారు. వాళ్ళు చెప్పాల్సింది మొత్తం అబ్బాయి వాళ్ల నాన్నకి చెప్తారు కానీ అతనికి చెవులు వినిపించవు.. వాళ్ల అమ్మ కి చెప్పేలోపు అటువైపు గా ప్రేమ, ధీరజ్ వెళ్లడం చూసి మళ్ళీ చెప్పలేకపోయామని శ్రీవల్లికి భాగ్యం చెప్తుంది.