English | Telugu

గురువుకు ద్రోహం చేసి వచ్చారనే మాటలు చాలా బాధిస్తాయి


ఢీ లేటెస్ట్ ఎపిసోడ్ లో తన గురువైన రాకేష్ మాష్టర్ ని గుర్తు చేసుకుని కన్నీళ్లు పెట్టుకున్నారు శేఖర్ మాష్టర్. ఈ షో ఎండింగ్ లో బ్యాక్ డ్రాప్ లో రాకేష్ మాష్టర్ ఓల్డ్ ఢీ షో వీడియోని ప్లే చేశారు. "నాకు పెళ్లి కాకముందే ఒక కొడుకు..శేఖర్...ఆకలిగా ఉన్నా కూడా నన్ను వదిలి వెళ్ళేవాడు కాదు...నాతోనే ఉండేవాడు. వాడు ఉంటే నేను బతికినట్టే" అని రాకేష్ మాష్టర్ చెప్పిన వీడియోని చూపించారు. దీనికి శేఖర్ మాష్టర్ కన్నీళ్లు పెట్టుకున్నాడు. "నేను హైదరాబాద్ వచ్చాక మాష్టర్ తో నాది ఏడెనిమిదేళ్ళ జర్నీ...తిరుపతిలో రాకేష్ మాష్టర్ చాలామందిని రెడీ చేశారు.

ఆయన హైదరాబాద్ కి రావడమే మాష్టర్ గా వచ్చారు. కరెక్ట్ గా అదే టైంలో మేము విజయవాడలో మస్తాన్ మాష్టర్ దగ్గర నేను, సత్య డాన్స్ నేర్చుకుంటున్నాం ...మేమున్నప్పుడు మాష్టర్ కి డ్రింక్ అనేదే అలవాటు లేదు. తర్వాత్తర్వాత వేరే ఫ్రెండ్ షిప్స్, వేరే వాళ్ళ కారణంగా మందు అలవాటయ్యింది. కొంతమంది కావాలని మందు బాటిల్స్ తీసుకొచ్చి ఆయన ముందు పెట్టి ఆయనతో తాగించి, ఆయనతో మాట్లాడించి నెగటివిటీని ఎక్కువగా స్ప్రెడ్ చేశారు. ఆయన్ని కరెక్ట్ గా ఇంటర్వ్యూ చేస్తే చాలా బాగా మాట్లాడతారు. చాలామందికి తెలిసీ తెలియకుండా మాట్లాడేసరికి నా మనసు చాలా బాధపడుతోంది. ఎంత కష్టపడి వచ్చానో నాకు తెలుసు. అంత కష్టపడి వచ్చిన గురువుకే ద్రోహం చేసి వచ్చారు అని అంటున్నారు..ఈ మాటలు విన్నప్పుడల్లా చాలా బాధేస్తుంది..చెప్పాలంటే నేను ఒకరికి ద్రోహం చేయలేదు...మా గురువుగారు ఏ టైంకి పిలిచినా వెళ్ళేవాళ్ళం...పెళ్ళైనా, అర్ధరాత్రి ఐనా..మాకు మాకు చిన్న విషయాల్లో వచ్చిన మనస్పర్థల వలన చేయలేదు దానికి మీరంతా ఏదేదో రాసుకుని..ఏదేదో చేసేస్తున్నారు. మేము ఆయన దగ్గర లేనప్పుడు కూడా అదే అనుకున్నాం ఆయన ఎక్కడ ఉన్నా హ్యాపీగా ఉండాలి, బాగుండాలి అని..మా మాష్టర్ పైనుంచి మమ్మల్ని బ్లెస్స్ చేయాలని కోరుకుంటున్నా" అని కన్నీళ్లు పెట్టుకున్నారు శేఖర్ మాష్టర్.

Jayam serial : బాక్సింగ్ పోటీలో మిస్సెస్ గంగ రుద్ర ప్రతాప్.. పారు ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -160 లో..... గంగని ఎలాగైనా అకాడమీ సెలక్షన్ కి వెళ్లకుండా ఆపాలని ఇషిక, వీరు ట్రై చేస్తారు కానీ గంగ, రుద్ర ఇద్దరు కలిసి ఇంట్లో అన్ని పనులు పూర్తి చేసి అకాడమీకి వెళ్తారు. రుద్ర అకాడమీ బయటే ఉంటాడు. నాకు సంబంధించిన కేసు ఇంకా పెండింగ్ లో ఉంది అలా ఉండగా.. నేను లోపలకు రాకూడదని రుద్ర బయటే ఉండి గంగకి అంతా వివరిస్తాడు. నేను నీ పేరు మైక్ లో రావడం వినాలని రుద్ర అంటాడు. గంగ లోపలకు వెళ్తుంది. అక్కడ పారు ఇంకా తన ఫ్రెండ్స్ కలిసి గంగని చులకనగా మాట్లాడుతారు.

Brahmamudi : రుద్రాణిని రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన కనకం!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -922 లో.. ఒకతను వచ్చి రుద్రాణికి మళ్ళీ పసరు మందు ఇస్తాడు. ఆ పసరు మందు పని చేస్తుందా లేదా అని రుద్రాణి అతన్ని అడుగుతుంది. పని చేస్తుందని అతను చెప్తాడు. దాంతో రుద్రాణి పసరు మందు తీసుకొని లోపలికి వెళ్తుంటే అప్పుడే కనకం ఎదురుపడుతుంది. కనకాన్ని చూసి రుద్రాణి టెన్షన్ పడుతుంది. చేతిలో అదేంటీ అని కనకం అనగానే ఇదా.... నాకే పసరు మందు అజీర్తికి వాడమని చెప్పారని చెప్పి రుద్రాణి వెళ్ళిపోతుంది. అలా అయితే ఇంత రాత్రివేళ తీసుకొని వెళ్తుంది ఏంటని కనకంకి డౌట్ వస్తుంది.