English | Telugu

మీరు, నేను ఎప్పటినుంచో సింగిల్.. మనం పెళ్లి చేసుకుందాం!

ఈటీవీ కార్తీక మాసాన్ని పురస్కరించుకుని ఈవారం 'కమనీయం కార్తీకం'షోతో ఎంటర్టైన్ చేసింది. ఈ షోకి హోస్ట్స్ గా యాంకర్ రవి, రౌడీ రోహిణి వ్యవహరించారు. ముందుగా ఈ షోని కారుణ్య పాడిన అద్భుతమైన శివుడి భక్తిగీతంతో మొదలు పెట్టారు. ఆ పాట వినేసరికి రోహిణి పూలమాల తెచ్చి కారుణ్య మేడలో వేసేసింది. "మీరు, నేను ఎప్పటినుంచో సింగిల్ గా ఉంటున్నాం.. మనం పెళ్లి చేసుకుందాం" అని సడెన్ గా ప్రపోజల్ పెట్టేసరికి కారుణ్య షాకయ్యాడు.

"ఏమిటి ఇవ్వాళ చాలా హెవీ టాపిక్ మాట్లాడుతున్నారు" అని కారుణ్య అడిగేసరికి "మిమ్మల్ని నా నుదిటిన ఒక బొట్టు పెట్టమని అడుగుతున్నా" అంది ఫన్నీగా. "ఎందుకు రోహిణి పెళ్లి చేసుకుని మావాడిని బలి చెయ్యాలని చూస్తావ్" అని రవి అనేసరికి, "నేను బలి చేయాలని చూడడం లేదు పెళ్లి చేసుకుని ఆయనకు ఒక జీవితాన్ని ప్రసాదిద్దామని అనుకుంటున్నా" అంది రోహిణి.

"ఇంక నువ్ పెళ్లి చేసుకున్నాక ఆయనకు ఇంకేం మిగులుతుంది జీవితం" అని కౌంటర్ వేసాడు రవి.దీంతో ఈ కామెడీ కౌంటర్స్ ని, పెళ్లి ప్రొపోజల్స్ ని తప్పించుకుని కారుణ్య అక్కడి నుంచి జంపింగ్ జపాంగ్ ఇపోయారు.

Podharillu : మహా, చక్రిలని వెతకడానికి రంగంలోకి దిగిన రౌడీలు.. ప్రతాప్ పట్టుకుంటాడా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -23 లో...మహా ఇంట్లో నుండి వెళ్లిపోతున్నట్లు లెటర్ రాసి బయటకు వచ్చి వాళ్ళ నాన్నని గుర్తుచేసుకొని ఏడుస్తుంది. ఎలాగోలా బయటకు వచ్చేస్తుంది మహా. ఆ తర్వాత చక్రి తీసుకొని వచ్చిన కార్ ఎక్కుతుంది. ముందు అ ఫోన్ నుండి సిమ్ తియ్యండి సిగ్నల్స్ ద్వారా ట్రేస్ చేస్తే ఎక్కడున్నామో తెలుస్తుందని చక్రి అనగానే అవునని సిమ్ తియ్యబోతుంటే భూషణ్ ఫోన్ చేస్తాడు. వీడికి బాకీ ఉన్న మాటలు బాగా ఉన్నాయని ఫోన్ లిఫ్ట్ చేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది. రేపు పెళ్లి పెట్టుకొని ఇలా మాట్లాడుతున్నావ్ ఏంటని భూషణ్ అంటాడు.

Jayam serial : గంగని టార్గెట్ చేసిన పారు.. రుద్ర గది నుండి బయటకు రాగలడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -162 లో... రుద్ర ఇంటికి రావడంతో శకుంతల కోప్పడుతుంది. ఆ గంగ అకాడమీలో స్టే చెయ్యడంతో ఈ ఇంటి పరువుపోతుంది వెంటనే తీసుకొని రమ్మని శకుంతల చెప్తుంది. రుద్ర తన నిర్ణయాన్ని పట్టించుకోడు. అ తర్వాత రుద్ర మళ్ళీ గంగ ఉన్న అకాడమీ దగ్గరున్న టీ షాప్ కి వెళ్లి కాసేపు ఆలోచిస్తాడు. ఇక గంగకి అకాడమీ వాళ్ళు ఏదైనా ఇబ్బంది పెడుతున్నారేమో అని ఆలోచించిన రుద్ర అక్కడ టీ షాప్ లో ఒక బుక్ తీసుకొని అకాడమీ కాంపౌండ్ దగ్గరికి వెళ్తాడు. గంగకి ఒక పేపర్ లో మెసేజ్ రాసి లోపలికి విసురుతాడు.

Illu illalu pillalu : అమూల్యకి పెళ్ళిచూపులు.. కామాక్షి ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -362 లో.. పెళ్లిచూపులకి ఇంకా రావడం లేదని రామరాజు వాళ్ళు ఎదురుచూస్తుంటే వాళ్ళు రారుగా అని శ్రీవల్లి మనసులో అనుకుంటుంది. అప్పుడే అబ్బాయి వాళ్ళు పెళ్లిచూపులకు ఎంట్రీ ఇస్తారు‌. దాంతో శ్రీవల్లి షాక్ అవుతుంది. భాగ్యం, ఆనందరావు కూడా వస్తారు. వాళ్ళు ఏం జరిగిందో శ్రీవల్లికి చెప్తారు. వాళ్ళు చెప్పాల్సింది మొత్తం అబ్బాయి వాళ్ల నాన్నకి చెప్తారు కానీ అతనికి చెవులు వినిపించవు.. వాళ్ల అమ్మ కి చెప్పేలోపు అటువైపు గా ప్రేమ, ధీరజ్ వెళ్లడం చూసి మళ్ళీ చెప్పలేకపోయామని శ్రీవల్లికి భాగ్యం చెప్తుంది.