English | Telugu

చాల మంది వెంటపడుతున్నారు..కానీ ఈయన మీదే నా కళ్ళు

అలీతో ఆల్ ఇన్ వన్ నెక్స్ట్ వీక్ ఎపిసోడ్ ప్రోమో రీసెంట్ గా రిలీజ్ అయింది. ఇక ఈ షోకి రౌడీ రోహిణ, కెవ్వు కార్తీక్ ఈ షోకి వచ్చారు. రీసెంట్ గా పెళ్లి చేసుకున్న కెవ్వు కార్తీక్ తో మాట్లాడాడు ఆలీ "ఎలా ఉంది లైఫ్ " అని అడిగేసరికి " బాగుంది సర్..అని చెప్పాలి కదా..అందుకే బాగుంది" అన్నాడు కార్తీక్..తర్వాత రౌడీ రోహిణి వచ్చింది స్టేజి మీదకు. "ఏంటి కొంచెం చిక్కినట్టున్నావ్" అని ఆలీ అడిగేసరికి "తెలుస్తోందా మీకు...కొంచెం చిక్కాను " అని రోహిణి చెప్పేసరికి "నీకే తెలియట్లేదు" అని కౌంటర్ వేసాడు కెవ్వు కార్తీక్. "బయట టాక్ ఏంటో తెలుసా..రోహిణి పెళ్ళెప్పుడు చేసుకుంటుంది అని అడుగుతున్నారు..వాళ్లకు నీ సమాధానం ఏమిటి" అని అలీ అడిగేసరికి "యాక్ట్యువల్ గా చాల మంది వెంటపడుతున్నారు" అని కామెడీ చేసింది రోహిణి.

తర్వాత రాకెట్ రాఘవ ఫుల్ గా డాన్స్ చేస్తూ వచ్చి స్టేజి మీద షర్ట్ విప్పేసి మరీ డాన్స్ చేసాడు. "ఈయన వచ్చిన దగ్గర నుంచి నాకు ఈయన మీదే కళ్ళు" అని రోహిణి రాఘవ మీద కామెంట్ చేసేసరికి "సర్ నాకు చాల సిగ్గేస్తోంది" అన్నాడు రాఘవ. ఇక రోహిణి షోలో ఇచ్చిన ఇమేజెస్ మీద ఒక కథ అల్లి చెప్పింది..."చేపలతో ఆడుకుంటూ పాపను పెట్టుకుంటున్నాడు" అనేసరికి ఆలీ అసలు ఊ కొట్టకుండా..అలా సైలెంట్ గా ఉండేసరికి "మీరు సరిగా ఫాలో అవ్వడం లేదు ..నాకు కథ చెప్పే ఇంటరెస్ట్ లేదు" అని రోహిణి చెప్పేసరికి "నాకు ఇప్పుడు అర్ధమయ్యింది టీం లీడర్ గా నిన్ను" అని ఆలీ కౌంటర్ వేసేసరికి రోహిణి నవ్వేసింది. ఏ షో చూసినా జబర్దస్త్ టీమ్ దుమ్ము రేపుతోంది.. అన్ని షోస్ ని చుట్టేస్తూ ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేస్తున్నారు. ఇక లేడీ కమెడియన్స్ లో రోహిణి ఇప్పుడు ఫస్ట్ ప్లేస్ లో ఉంది.

Podharillu : మహా, చక్రిలని వెతకడానికి రంగంలోకి దిగిన రౌడీలు.. ప్రతాప్ పట్టుకుంటాడా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -23 లో...మహా ఇంట్లో నుండి వెళ్లిపోతున్నట్లు లెటర్ రాసి బయటకు వచ్చి వాళ్ళ నాన్నని గుర్తుచేసుకొని ఏడుస్తుంది. ఎలాగోలా బయటకు వచ్చేస్తుంది మహా. ఆ తర్వాత చక్రి తీసుకొని వచ్చిన కార్ ఎక్కుతుంది. ముందు అ ఫోన్ నుండి సిమ్ తియ్యండి సిగ్నల్స్ ద్వారా ట్రేస్ చేస్తే ఎక్కడున్నామో తెలుస్తుందని చక్రి అనగానే అవునని సిమ్ తియ్యబోతుంటే భూషణ్ ఫోన్ చేస్తాడు. వీడికి బాకీ ఉన్న మాటలు బాగా ఉన్నాయని ఫోన్ లిఫ్ట్ చేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది. రేపు పెళ్లి పెట్టుకొని ఇలా మాట్లాడుతున్నావ్ ఏంటని భూషణ్ అంటాడు.

Jayam serial : గంగని టార్గెట్ చేసిన పారు.. రుద్ర గది నుండి బయటకు రాగలడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -162 లో... రుద్ర ఇంటికి రావడంతో శకుంతల కోప్పడుతుంది. ఆ గంగ అకాడమీలో స్టే చెయ్యడంతో ఈ ఇంటి పరువుపోతుంది వెంటనే తీసుకొని రమ్మని శకుంతల చెప్తుంది. రుద్ర తన నిర్ణయాన్ని పట్టించుకోడు. అ తర్వాత రుద్ర మళ్ళీ గంగ ఉన్న అకాడమీ దగ్గరున్న టీ షాప్ కి వెళ్లి కాసేపు ఆలోచిస్తాడు. ఇక గంగకి అకాడమీ వాళ్ళు ఏదైనా ఇబ్బంది పెడుతున్నారేమో అని ఆలోచించిన రుద్ర అక్కడ టీ షాప్ లో ఒక బుక్ తీసుకొని అకాడమీ కాంపౌండ్ దగ్గరికి వెళ్తాడు. గంగకి ఒక పేపర్ లో మెసేజ్ రాసి లోపలికి విసురుతాడు.

Illu illalu pillalu : అమూల్యకి పెళ్ళిచూపులు.. కామాక్షి ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -362 లో.. పెళ్లిచూపులకి ఇంకా రావడం లేదని రామరాజు వాళ్ళు ఎదురుచూస్తుంటే వాళ్ళు రారుగా అని శ్రీవల్లి మనసులో అనుకుంటుంది. అప్పుడే అబ్బాయి వాళ్ళు పెళ్లిచూపులకు ఎంట్రీ ఇస్తారు‌. దాంతో శ్రీవల్లి షాక్ అవుతుంది. భాగ్యం, ఆనందరావు కూడా వస్తారు. వాళ్ళు ఏం జరిగిందో శ్రీవల్లికి చెప్తారు. వాళ్ళు చెప్పాల్సింది మొత్తం అబ్బాయి వాళ్ల నాన్నకి చెప్తారు కానీ అతనికి చెవులు వినిపించవు.. వాళ్ల అమ్మ కి చెప్పేలోపు అటువైపు గా ప్రేమ, ధీరజ్ వెళ్లడం చూసి మళ్ళీ చెప్పలేకపోయామని శ్రీవల్లికి భాగ్యం చెప్తుంది.