English | Telugu

రాజ్ ఒక్కడే సేఫ్!

ఈ వారం నామినేషన్స్ లో ఉన్న కంటెస్టెంట్స్ నుండి ఒకరు సేవ్ అవ్వడానికి బిగ్ బాస్ అవకాశం కల్పించాడు. "తమని తాము సేవ్ చేసుకోడానికి, విన్నర్ యొక్క ప్రైజ్ మనీ నుండి కోత విధించడం జరుగుతుంది. బిగ్ బాస్ మీకు చెక్ ఇస్తున్నారు. గార్డెన్ ఏరియాలో ఉన్న డ్రాప్ బాక్స్ లో చెక్ పై తమ ఇమ్యూనిటి పెంచుకోవడం కోసం ఒక ధరను ఎంచుకొని అందులో వేయాలి. ఇమ్యూనిటి ధర ఒక లక్ష నుండి మొదలు అయిదు లక్షల వరకు ఉంటుంది. మీరు ఒక యూనిక్ ధరను ఆ చెక్ పై రాయాలి. అయితే మీరు చెక్ మీద రాసిన అమౌంట్ ని ఏ విధంగా కూడా ఇంటి సభ్యులతో చర్చించకూడదు" అని బిగ్ బాస్ చెప్పాడు.

ఆ తర్వాత ఒక్కొక్కరుగా వచ్చి తమకి నచ్చిన అమౌంట్ ని రాసి, డ్రాప్ బాక్స్ లో వేసారు. అయితే శ్రీసత్య కోడ్ భాషలో తను రాసిన అమౌంట్ ని శ్రీహాన్ కి చెప్పింది. "శ్రీసత్య, అలా మాట్లాడటం తప్పు. మీరు చేసింది స్పష్టంగా తెలుస్తుంది. అలా చెప్పినందువల్ల మీరు ఈ పోటీ నుండి తొలగించబడ్డారు" అని బిగ్ బాస్ చెప్పాడు.

కాగా రేవంత్, కీర్తి భట్ ఇద్దరు ఒకే నెంబర్ రాయడం వల్ల రిజెక్ట్ అయ్యారు. ఇనయా, మెరీనా రెండవ అత్యధిక మొత్తాన్ని రాసారు. కాబట్టి వారిని కూడా రిజెక్ట్ చేయడం జరిగింది. ఆదిరెడ్డి, శ్రీహాన్ ఇద్దరు సేమ్ రాసారు కాబట్టి వీరిద్దరు కూడా తొలిగిపోయారు. చివరగా రోహిత్ రెండు లక్షలు రాయగా, రాజ్ నాలుగు లక్షలు రాసాడు. కాబట్టి రాజ్ అందరి కన్నా హై యూనిక్ వాల్యు రాసినందువల్ల, ఈ వారం ఎలిమినేషన్ నుండి సేఫ్ అయ్యాడు.

Podharillu: మహా పెళ్ళికి అంతా ఫిక్స్.. చక్రిని ఆమె అర్థం చేసుకుందా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -12 లో.....మహా తన డ్రీమ్ గురించి భూషణ్ కి చెప్తుంది. డ్రీం లేదు ఏం లేదు ఫ్యామిలీ ని చూసుకుంటే సరిపోతుంది. నాకు నచ్చింది వండి పెడుతూ వెళ్ళేటప్పుడు బై చెప్పి వచ్చేటప్పుటికీ అందంగా రెడీ అయి ఉంటే చాలని చెప్పగానే వీడితో అనవసరంగా నా డ్రీమ్ గురించి చెప్పానని మహా అనుకుంటుంది. అదంతా చక్రి వింటాడు. మరొకవైపు మాధవ దగ్గరికి గాయత్రి వచ్చి.. ఈ పెళ్లి కూడా క్యాన్సిల్ అయ్యిందంట కదా అని చెప్పగానే అందరు షాక్ అవుతారు. ఏ సైలెంట్ గా ఉండు.. ఈ విషయం కన్నాకి తెలియదని మాధవ అంటాడు.

Brahmamudi: రాజ్ తీసిన యాడ్ సక్సెస్.. ధాన్యలక్ష్మి ఇచ్చిన బిగ్ ట్విస్ట్ అదే!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi).ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -911 లో..... అప్పు ఇన్వెస్టిగేషన్ చేస్తుంటే ఒకావిడని రౌడీలు వెంబడిస్తారు. అప్పుని చూసి ఆవిడ దగ్గరికి వచ్చి.. మేడం కాపాడండి అంటుంది. రౌడీలు పోలీసులని చూసి పారిపోతారు. మేడమ్ వాళ్ళు నా నగలు దొంగతనం చెయ్యాలని వెంబడిస్తున్నారని చెప్తుంది. దాంతో వాళ్ళని పట్టుకోమని కానిస్టేబుల్ కి చెప్తుంది అప్పు. చాలా థాంక్స్ మేడమ్ అని ఆవిడ చెప్తుంది. మీరు ఎక్కడికి వెళ్ళాలి నేను డ్రాప్ చేస్తానని అప్పు అంటుంది. ఆవిడ ఇంటిముందు దింపుతుంది...

Illu illalu pillalu : ఇంగ్లీష్ టీచర్ గా సెలెక్ట్ అయిన శ్రీవల్లి బయటపడుతుందా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -349 లో..... ప్రేమ, నర్మద కలిసి డుప్లికేట్ డాక్టర్ ని తీసుకొని వచ్చి శ్రీవల్లిని భయపెడతారు. నీకు జ్వరం తగ్గింది కదా అక్క ఇక ఇంటర్వ్యూకి వెళదామని ఇద్దరు దగ్గరుండి మరి ఇంటర్వ్యూ కోసం స్కూల్ కి తీసుకొని వెళ్తారు. శ్రీవల్లి ప్రిన్సిపల్ దగ్గరికి వెళ్లి తన సర్టిఫికెట్లు ఇస్తుంది. టెల్ మీ యువర్ సెల్ఫ్ అని ప్రిన్సిపల్ అనగానే శ్రీవల్లికి ఏం చెయ్యాలో అర్థం కాదు. అసలు మీకు ఇంగ్లీష్ వచ్చా రాదా అని ప్రిన్సిపల్ అడుగుతాడు.