English | Telugu

Nuvvunte Naa Jathaga : వంద ఎపిసోడ్ లు పూర్తి చేసుకున్న  నువ్వుంటే నా జతగా!

స్టార్ మా సీరియల్స్ లు అత్యధిక టీఆర్పీ రేటింగ్ తో సాగుతుంటాయి. అందుకేనేమో భిన్నమైన కాన్సెప్ట్ తో కొత్త సీరియల్స్ వస్తుంటాయి. అయితే వీటిల్లో గుండె నిండా గుడిగంటలు, ఇంటింటి రామాయణం, ఇల్లు ఇల్లాలు పిల్లలు, కార్తీక దీపం2, బ్రహ్మముడి, చిన్ని సీరియల్స్ ప్రస్తుతం టాప్ రేటింగ్ తో దూసుకెళ్తున్నాయి.

ఇక గత సీజన్ బిగ్ బాస్-8 తర్వాత మొదలైన నువ్వుంటే నా జతగా సీరియల్ తెలుగు ప్రేక్షకులన అభిమానాన్ని పొందుతుంది. ప్రస్తుతం ఈ సీరియల్ వంద ఎపిసోడ్ లు పూర్తి చేసుకుంది. బిగ్ బాస్ ఫేమ్ అర్జున్ కళ్యాణ్ హీరోగా దేవ పాత్రలో కన్పిస్తుండగా.. మిథున పాత్రలో కొత్త అమ్మాయి నటిస్తోంది. శారద, సత్యమూర్తి ఇద్దరు దేవ వాళ్ళ అమ్మనాన్నలు. ఈ సీరియల్ ఎలా మొదలైందో ఓసారి చూద్దాం..

ఒక ఊరిలో దేవా అనే రౌడీ, మిథున గొప్పింటి అమ్మాయి ఉంటారు. ఓ రోజున మిథున తన ఫ్రెండ్ పెళ్లి గుడిలో చేపిస్తుంటుంది. ఇంతలో కొంతమంది రౌడీలని వెంబడిస్తూ దేవా ఆ గుడిలోకి వస్తాడు. ‌ఇక రౌడీలని ఛేజ్ చేసే క్రమంలో పెళ్ళికొడుకుకి దేవా తగిలి అతను పడిపోతాడు. ఇక మిథున చేస్తున్న పెళ్ళి ఆగిపోతుంది. దాంతో దేవాని మిథున లాగిపెట్టి కొడుతుంది. నీ వల్ల పెళ్లి ఆగిందంటూ దేవాని తిడుతుంది. తాళి కడితేనే పెళ్ళి జరిగినట్టా అని దేవా వాదిస్తుంటాడు. దాంతో మిథున అవునని అంటుంది. ఇక దేవా పక్కన ఉన్న తాళిని తీసుకొచ్చి మిథున మెడలో కట్టేసి.. ఇప్పుడు నీ మెడలో నేను తాళి కట్టాను.. అంతమాత్రానా మనం కలిసి ఉండాలా‌‌.. పోవే అంటు రూడ్ గా మాట్లాడి తనని వదిలేసి వెళ్ళిపోతాడు. పెళ్లికి, మన ఆచారాలకి విలువనిచ్చే మిథున మొదట షాకవుతుంది. ఆ తర్వాత ఆలోచనలో పడిపోతుంది. ఇక ఇంటికి వెళ్ళి జరిగిందంతా తన అమ్మనాన్నలకి మిథున చెప్తుంది. ఆ తాళి తీసేసి ఇంట్లోకి రమ్మని వాళ్ళు గెంటేస్తారు. దాంతో మిథున ఇల్లు వదిలి దేవా దగ్గరికి వస్తుంది. ఇక దేవా వాళ్ళ నాన్న దేవాకి కనీస మర్యాద కూడా ఇవ్వడు. ఎందుకంటే ఎప్పుడు చూసిన గొడవలు పడుతుంటాడని అతడిని తిడుతూనే ఉంటాడు. ఇక దేవాతో పాటు ఉండటానికి వచ్చిన మిథునని ఎవరు అంగీకరించరు. అయితే కొన్ని ఎపిసోడ్ ల ముందు దేవా వాళ్ళ నాన్న మీద ఎటాక్ జరుగుతుంది. అందులో మిథున తన ప్రాణాలు అడ్డుపెట్టి మరీ దేవ వాళ్ళ నాన్న సత్యమూర్తిని కాపాడుతుంది. ఈ విషయం తెలుసుకున్న దేవా వాళ్ల అమ్మ శారద తనని కోడలిగా అంగీకరిస్తుంది. మరి ఇష్టం లేని పెళ్లితో అత్తారింట్లో అడుగుపెట్టిన మిథున జీవితం ఎలా సాగనుంది? నువ్వుంటే నా జతగా అని తన భర్త దేవా ఎప్పుడంటాడో తెలియాలంటే ఈ సీరియల్ చూడాల్సిందే. ఇప్పటికే ఈ సీరియల్ వంద ఎపిసోడ్ లు పూర్తి చేసుకోగా ఈ సీరియల్ టీమ్ సంబరాలు చేసుకుంటున్నారు.

Podharillu : మహా, చక్రిలని వెతకడానికి రంగంలోకి దిగిన రౌడీలు.. ప్రతాప్ పట్టుకుంటాడా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -23 లో...మహా ఇంట్లో నుండి వెళ్లిపోతున్నట్లు లెటర్ రాసి బయటకు వచ్చి వాళ్ళ నాన్నని గుర్తుచేసుకొని ఏడుస్తుంది. ఎలాగోలా బయటకు వచ్చేస్తుంది మహా. ఆ తర్వాత చక్రి తీసుకొని వచ్చిన కార్ ఎక్కుతుంది. ముందు అ ఫోన్ నుండి సిమ్ తియ్యండి సిగ్నల్స్ ద్వారా ట్రేస్ చేస్తే ఎక్కడున్నామో తెలుస్తుందని చక్రి అనగానే అవునని సిమ్ తియ్యబోతుంటే భూషణ్ ఫోన్ చేస్తాడు. వీడికి బాకీ ఉన్న మాటలు బాగా ఉన్నాయని ఫోన్ లిఫ్ట్ చేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది. రేపు పెళ్లి పెట్టుకొని ఇలా మాట్లాడుతున్నావ్ ఏంటని భూషణ్ అంటాడు.

Jayam serial : గంగని టార్గెట్ చేసిన పారు.. రుద్ర గది నుండి బయటకు రాగలడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -162 లో... రుద్ర ఇంటికి రావడంతో శకుంతల కోప్పడుతుంది. ఆ గంగ అకాడమీలో స్టే చెయ్యడంతో ఈ ఇంటి పరువుపోతుంది వెంటనే తీసుకొని రమ్మని శకుంతల చెప్తుంది. రుద్ర తన నిర్ణయాన్ని పట్టించుకోడు. అ తర్వాత రుద్ర మళ్ళీ గంగ ఉన్న అకాడమీ దగ్గరున్న టీ షాప్ కి వెళ్లి కాసేపు ఆలోచిస్తాడు. ఇక గంగకి అకాడమీ వాళ్ళు ఏదైనా ఇబ్బంది పెడుతున్నారేమో అని ఆలోచించిన రుద్ర అక్కడ టీ షాప్ లో ఒక బుక్ తీసుకొని అకాడమీ కాంపౌండ్ దగ్గరికి వెళ్తాడు. గంగకి ఒక పేపర్ లో మెసేజ్ రాసి లోపలికి విసురుతాడు.

Illu illalu pillalu : అమూల్యకి పెళ్ళిచూపులు.. కామాక్షి ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -362 లో.. పెళ్లిచూపులకి ఇంకా రావడం లేదని రామరాజు వాళ్ళు ఎదురుచూస్తుంటే వాళ్ళు రారుగా అని శ్రీవల్లి మనసులో అనుకుంటుంది. అప్పుడే అబ్బాయి వాళ్ళు పెళ్లిచూపులకు ఎంట్రీ ఇస్తారు‌. దాంతో శ్రీవల్లి షాక్ అవుతుంది. భాగ్యం, ఆనందరావు కూడా వస్తారు. వాళ్ళు ఏం జరిగిందో శ్రీవల్లికి చెప్తారు. వాళ్ళు చెప్పాల్సింది మొత్తం అబ్బాయి వాళ్ల నాన్నకి చెప్తారు కానీ అతనికి చెవులు వినిపించవు.. వాళ్ల అమ్మ కి చెప్పేలోపు అటువైపు గా ప్రేమ, ధీరజ్ వెళ్లడం చూసి మళ్ళీ చెప్పలేకపోయామని శ్రీవల్లికి భాగ్యం చెప్తుంది.