English | Telugu

కంప్యూటర్లు దొంగతనం చేసి అమ్ముతూ ఉంటాడు..ఇంటికో గర్ల్ ఫ్రెండ్ ఉంది అతనికి

డ్రామా జూనియర్స్ సీజన్ 8 ఎంత ఫన్నీగా ఉందంటే మాములుగా లేదు. ఇందులో ఇద్దరు పిల్లలు హైపర్ ఆంటీస్ పేరుతో వేసిన స్కిట్ తో స్టేజిని దుమ్ము దులిపేసారు. అందులోనూ సుధీర్ ని ఒక రేంజ్ లో ఆడేసుకున్నారు. ఆ ఆడపిల్లలిద్దరికీ పెళ్లి చేసిన పెళ్లిళ్ల పేరయ్య వచ్చి "సుధీర్ అనే అబ్బాయి ఉన్నాడట కదా పెళ్లి సంబంధాలు చూడడానికి వచ్చా" అనేసరికి అందులో ఒక అమ్మాయి నిష్ఠూరంగా "స్వీట్ పడదు..మొన్ననే సుధీర్ కి టెస్ట్ చేయిస్తే షుగర్ అని తేలింది.."అని ఒక ఆంటీ అంటే పెళ్లిళ్ల పేరయ్యా "కంప్యూటర్ జాబ్ అంట కదా" అన్నాడు. దానికి ఆంటీ మళ్ళీ " కంప్యూటర్ లు దొంగతనం చేసి అమ్ముతా ఉంటాడు" అని చెప్పింది సుధీర్ పరువు తీసేసింది.

తరువాత ఈ షోలో "బతుకు జట్కా బండి వెర్సెస్ సంక్రాంతికి వస్తున్నాం" అనే స్కిట్ వేశారు. అందులో ఇద్దరు చిన్నారులు భార్యాభర్తలుగా నటించారు. ఐతే పెళ్ళాం మీద భర్త చెయ్యి ఎత్తేసరికి రోజా వచ్చి "ఏయ్ ఏంటి నా ముందే పెళ్ళాం మీద చెయ్యెత్తుతున్నావ్" అని రోజా అనేసరికి వెంటనే ఆ భర్త బుంగమూతితో బుల్లిరాజు అని పిలుస్తాడు. వెంటనే తుపాకీని చేత్తో పట్టుకుని సంక్రాంతికి వస్తున్నాం మూవీలోని కుర్రాడు వచ్చేసాడు. రోజాని కోపంగా చూస్తూ ఆమె మీద అరిచాడు. ఆ తర్వాత రెండు జంటల మధ్య బతుకు జట్కా బండి రోజా కూర్చుని ఆ సమస్య మీద మాట్లాడింది. తర్వాత రోజాని చూసి కొరికెత్త కొరికెత్త అంటూ కాసేపు అరిచాడు ..ఇక అక్కడి నుంచి సుధీర్ వైపు వెళ్లి "మా నాన్న మీ మేడెక్కి డాన్స్ చేశాడా " అని అడిగాడు. "అవును బుల్లిరాజు గారు" అని సుధీర్ ఆన్సర్ చెప్పేసరికి "మా అమ్మతోనే కదరా డాన్స్ చేసింది. ఏదో నీ పెళ్లాంతో డాన్స్ చేసినట్టు" అని బూతులు తిట్టాడు. ఆ తర్వాత రోజా దగ్గరకు వచ్చి "మా నాన్నకు ఒక్క గర్ల్ ఫ్రెండ్ ఉందని గొడవ చేస్తున్నావ్..కానీ ఆ సుధీర్ గాడికి ఇంటింటికి గర్ల్ ఫ్రెండ్ ఉంది" అనేసరికి అందరూ నవ్వేశారు.

Podharillu : మహా, చక్రిలని వెతకడానికి రంగంలోకి దిగిన రౌడీలు.. ప్రతాప్ పట్టుకుంటాడా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -23 లో...మహా ఇంట్లో నుండి వెళ్లిపోతున్నట్లు లెటర్ రాసి బయటకు వచ్చి వాళ్ళ నాన్నని గుర్తుచేసుకొని ఏడుస్తుంది. ఎలాగోలా బయటకు వచ్చేస్తుంది మహా. ఆ తర్వాత చక్రి తీసుకొని వచ్చిన కార్ ఎక్కుతుంది. ముందు అ ఫోన్ నుండి సిమ్ తియ్యండి సిగ్నల్స్ ద్వారా ట్రేస్ చేస్తే ఎక్కడున్నామో తెలుస్తుందని చక్రి అనగానే అవునని సిమ్ తియ్యబోతుంటే భూషణ్ ఫోన్ చేస్తాడు. వీడికి బాకీ ఉన్న మాటలు బాగా ఉన్నాయని ఫోన్ లిఫ్ట్ చేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది. రేపు పెళ్లి పెట్టుకొని ఇలా మాట్లాడుతున్నావ్ ఏంటని భూషణ్ అంటాడు.

Jayam serial : గంగని టార్గెట్ చేసిన పారు.. రుద్ర గది నుండి బయటకు రాగలడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -162 లో... రుద్ర ఇంటికి రావడంతో శకుంతల కోప్పడుతుంది. ఆ గంగ అకాడమీలో స్టే చెయ్యడంతో ఈ ఇంటి పరువుపోతుంది వెంటనే తీసుకొని రమ్మని శకుంతల చెప్తుంది. రుద్ర తన నిర్ణయాన్ని పట్టించుకోడు. అ తర్వాత రుద్ర మళ్ళీ గంగ ఉన్న అకాడమీ దగ్గరున్న టీ షాప్ కి వెళ్లి కాసేపు ఆలోచిస్తాడు. ఇక గంగకి అకాడమీ వాళ్ళు ఏదైనా ఇబ్బంది పెడుతున్నారేమో అని ఆలోచించిన రుద్ర అక్కడ టీ షాప్ లో ఒక బుక్ తీసుకొని అకాడమీ కాంపౌండ్ దగ్గరికి వెళ్తాడు. గంగకి ఒక పేపర్ లో మెసేజ్ రాసి లోపలికి విసురుతాడు.

Illu illalu pillalu : అమూల్యకి పెళ్ళిచూపులు.. కామాక్షి ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -362 లో.. పెళ్లిచూపులకి ఇంకా రావడం లేదని రామరాజు వాళ్ళు ఎదురుచూస్తుంటే వాళ్ళు రారుగా అని శ్రీవల్లి మనసులో అనుకుంటుంది. అప్పుడే అబ్బాయి వాళ్ళు పెళ్లిచూపులకు ఎంట్రీ ఇస్తారు‌. దాంతో శ్రీవల్లి షాక్ అవుతుంది. భాగ్యం, ఆనందరావు కూడా వస్తారు. వాళ్ళు ఏం జరిగిందో శ్రీవల్లికి చెప్తారు. వాళ్ళు చెప్పాల్సింది మొత్తం అబ్బాయి వాళ్ల నాన్నకి చెప్తారు కానీ అతనికి చెవులు వినిపించవు.. వాళ్ల అమ్మ కి చెప్పేలోపు అటువైపు గా ప్రేమ, ధీరజ్ వెళ్లడం చూసి మళ్ళీ చెప్పలేకపోయామని శ్రీవల్లికి భాగ్యం చెప్తుంది.