English | Telugu

కొత్త కార్ తో బిగ్ బాస్ నైనికా

బిగ్ బాస్ 8 కంటెస్టెంట్ నైనికా కొత్త కార్ కి ఓనర్ అయ్యింది. ఢీ డాన్స్ షో ద్వారా ఆమె ఆడియన్స్ కి బాగా దగ్గరయ్యింది. ఆమె తన ఇన్స్టాగ్రామ్ పేజీలో ఒక పిక్ పోస్ట్ చేసింది. ఆమె చాలా కాస్ట్లీ కార్ ని కొనుక్కుంది. "నేను ఒక విషయాన్ని చెప్పదలచుకున్నాను.. నా కుటుంబం ఇప్పుడు నన్ను చూసి గర్వపడుతోంది" అని పెట్టింది. ఢీ డాన్సర్ గా గుర్తింపు తెచ్చుకున్న నైనికా ఎక్కువ కాలం అందులో కొనసాగలేదు. ఆ తర్వాత ఆమె కొన్ని కవర్ సాంగ్స్ చేసింది, యుట్యూబర్ గా మంచి పేరు తెచ్చుకుంది.

ఆ పేరుతో ఆమె బిగ్ బాస్ కి వెళ్ళింది. ఐతే బిగ్ బాస్ కి వెళ్లి వచ్చాక మాత్రం ఆమెకు పెద్దగా అవకాశాలు ఏమీ రావడం లేదు. ఐతే బుల్లితెర మీద వచ్చే షోస్ లో ఆమె కనిపిస్తోంది. ఇక ఈమె కార్ కొని షో రూమ్ లో ఆ కార్ మీద కూర్చుని అలాగే షో రూమ్ లో డాన్స్ చేసిన పిక్స్ ని వీడియోస్ ని పోస్ట్ చేసింది. ఇక బిగ్ బాస్ లో తన ఫ్రెండ్ కిర్రాక్ సీత ఆమె పోస్ట్ కి కామెంట్ చేసింది. "కంగ్రాట్యులేషన్స్ చుట్కి. నీ కార్ లో రైడ్ కి వెళ్ళాలి." అని చెప్పింది. అలాగే బెజవాడ బేబక్క, సంకేత్ అలాగే ఫ్రెండ్స్ మిగతా సెలబ్రిటీస్ అంతా ఆమెకు కంగ్రాట్యులేషన్స్ చెప్తున్నారు. నైనికా టాటా వారి కర్వ్ కార్ ని కొనుక్కుంది. ఈ కార్ స్టార్టింగ్ పరిచే వచ్చి 9 లక్షల నుంచి 19 లక్షల మధ్యలో ఉంది. బిగ్ బాస్ 8 లో నైనికా టాస్కులు బాగా ఆడింది. లేడీ కెప్టెన్ కూడా అయ్యింది. ఆ తర్వాత అంతగా ఆడలేకపోయింది. హౌస్ లో ఆమెకు కిర్రాక్ సీత, విష్ణు ప్రియా మంచి ఫ్రెండ్స్ అయ్యారు.

Jayam serial : బాక్సింగ్ పోటీలో మిస్సెస్ గంగ రుద్ర ప్రతాప్.. పారు ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -160 లో..... గంగని ఎలాగైనా అకాడమీ సెలక్షన్ కి వెళ్లకుండా ఆపాలని ఇషిక, వీరు ట్రై చేస్తారు కానీ గంగ, రుద్ర ఇద్దరు కలిసి ఇంట్లో అన్ని పనులు పూర్తి చేసి అకాడమీకి వెళ్తారు. రుద్ర అకాడమీ బయటే ఉంటాడు. నాకు సంబంధించిన కేసు ఇంకా పెండింగ్ లో ఉంది అలా ఉండగా.. నేను లోపలకు రాకూడదని రుద్ర బయటే ఉండి గంగకి అంతా వివరిస్తాడు. నేను నీ పేరు మైక్ లో రావడం వినాలని రుద్ర అంటాడు. గంగ లోపలకు వెళ్తుంది. అక్కడ పారు ఇంకా తన ఫ్రెండ్స్ కలిసి గంగని చులకనగా మాట్లాడుతారు.

Brahmamudi : రుద్రాణిని రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన కనకం!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -922 లో.. ఒకతను వచ్చి రుద్రాణికి మళ్ళీ పసరు మందు ఇస్తాడు. ఆ పసరు మందు పని చేస్తుందా లేదా అని రుద్రాణి అతన్ని అడుగుతుంది. పని చేస్తుందని అతను చెప్తాడు. దాంతో రుద్రాణి పసరు మందు తీసుకొని లోపలికి వెళ్తుంటే అప్పుడే కనకం ఎదురుపడుతుంది. కనకాన్ని చూసి రుద్రాణి టెన్షన్ పడుతుంది. చేతిలో అదేంటీ అని కనకం అనగానే ఇదా.... నాకే పసరు మందు అజీర్తికి వాడమని చెప్పారని చెప్పి రుద్రాణి వెళ్ళిపోతుంది. అలా అయితే ఇంత రాత్రివేళ తీసుకొని వెళ్తుంది ఏంటని కనకంకి డౌట్ వస్తుంది.