English | Telugu

ముకుంద‌ ప్లాన్ సక్సెస్.. కృష్ణ ఏం చేయనుంది?

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి'. ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -279 లో.. ఆదర్శ్ గురించి భవానిని అడుగుతాడు ప్రభాకర్. కానీ భవాని దానికి సమాధానం చెప్పకుండా.. టాపిక్ డైవర్ట్ చేస్తుంది.. కాసేపటికి గుడ్ నైట్ అంటూ అక్కడ నుండి వెళ్ళిపోతుంది భవాని. ఇంట్లో అంత బాగానే ఉంది కానీ ముకుంద విషయమే కొంచెం డౌట్ గా ఉందని ప్రభాకర్ అనుకుంటాడు. మరొక వైపు ఎప్పుడు తాగుతూనే ఉంటావా అని మధుని అలేఖ్య తిడుతుంది.

మరొకవైపు వాళ్ళ పిన్ని, బాబాయ్ ల కోసం కృష్ణ వెతుకుతుంటుంది‌. ఇక అది గమనించి కృష్ణ దగ్గరికి ముకుంద వచ్చి.. ఎవరికోసం వెతుకుతున్నావ్? మీ తొట్టి గ్యాంగ్ కోసమా అని అంటుంది. ఎందుకు అలా అంటావ్. మీ నాన్నని నేను బాబాయ్ అంటూ ఎలా పిలుస్తానని కృష్ణ అంటుంది. ఆ తర్వాత కృష్ణ వాళ్ళ బాబాయ్ ని తక్కువ చేసి మాట్లాడుతుంది ముకుంద. దాంతో కృష్ణ కోపంగా అక్కడ నుండి వెళ్ళిపోతుంది. గదిలోకి వెళ్లిన కృష్ణ.. కోపంగా ముకుంద గురించి మురారికి చెప్తుంది. సంస్కారం లేని వాళ్ళతో నీకేంటి వదిలేయ్ అని మురారి చెప్తాడు. అయిన ముకుంద మాటలనే కృష్ణ గుర్తు చేసుకుంటుంది‌. తింగరి పిల్ల లాగా ప్రవర్తిస్తుంటే, అది చూసిన మురారి.. రోజు రోజుకి నీ చేష్టలతో తెగ నచ్చేస్తున్నావ్, కృష్ణ ఐ లవ్ యు అని తన మనసులో అనుకుంటాడు మురారి. మరొక వైపు ఎలాగైన ప్రొద్దున కృష్ణ , మురారి కలిసి వెళ్లకుండా ఆపాలని ముకుంద అనుకుంటుంది. కాసేపటికి ముకుంద దగ్గరికి శకుంతల వచ్చి ఆదర్శ్ గురించి అడుగుతుంది. తను అడిగే ప్రశ్నలకు ముకుంద చిరాకు పడుతు కోప్పడుతుంది. అప్పుడే కృష్ణ, మురారి ఇద్దరు వస్తారు. దూరంగా వుండి ప్రభాకర్ కూడా చూస్తుంటాడు. మా పిన్నికి సారి చెప్పు అని ముకుందని కృష్ణ అడుగుతుంది. నేను చెప్పనని ముకుంద అంటుంది. గొడవ వద్దు. తన తరుపున నేను సారీ చెప్తున్నాని మురారి అంటాడు. ఆ తర్వాత కృష్ణని గదిలోకి తీసుకొని వెళ్తాడు మురారి.

మరొక వైపు ముకుంద చేసిన గొడవ గురించి అలేఖ్యతో మధు చెప్తాడు. మరుసటి రోజు ఉదయం కృష్ణ, మురారీ ఇద్దరు బయటకు వెళ్తుంటే భవాని వారిద్దరిని ఆపుతుంది. వేరే దగ్గరికి వెళ్లి ఆదర్శ్ గురించి తెలుసుకొని రా అని‌ మురారిని బయటకు పంపిస్తుంది భవాని. దాంతో కృష్ణ కూడ ఆగిపోతుంది. కాసేపటికి కృష్ణ బాగా ఆలోచిస్తుంటుంది. మమ్మల్ని వెళ్లకుండా చెయ్యడానికి ముకుంద ప్లాన్ చేసిందా అని కృష్ణ అనుకుంటుంది.. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Podharillu : మహా, చక్రిలని వెతకడానికి రంగంలోకి దిగిన రౌడీలు.. ప్రతాప్ పట్టుకుంటాడా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -23 లో...మహా ఇంట్లో నుండి వెళ్లిపోతున్నట్లు లెటర్ రాసి బయటకు వచ్చి వాళ్ళ నాన్నని గుర్తుచేసుకొని ఏడుస్తుంది. ఎలాగోలా బయటకు వచ్చేస్తుంది మహా. ఆ తర్వాత చక్రి తీసుకొని వచ్చిన కార్ ఎక్కుతుంది. ముందు అ ఫోన్ నుండి సిమ్ తియ్యండి సిగ్నల్స్ ద్వారా ట్రేస్ చేస్తే ఎక్కడున్నామో తెలుస్తుందని చక్రి అనగానే అవునని సిమ్ తియ్యబోతుంటే భూషణ్ ఫోన్ చేస్తాడు. వీడికి బాకీ ఉన్న మాటలు బాగా ఉన్నాయని ఫోన్ లిఫ్ట్ చేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది. రేపు పెళ్లి పెట్టుకొని ఇలా మాట్లాడుతున్నావ్ ఏంటని భూషణ్ అంటాడు.

Jayam serial : గంగని టార్గెట్ చేసిన పారు.. రుద్ర గది నుండి బయటకు రాగలడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -162 లో... రుద్ర ఇంటికి రావడంతో శకుంతల కోప్పడుతుంది. ఆ గంగ అకాడమీలో స్టే చెయ్యడంతో ఈ ఇంటి పరువుపోతుంది వెంటనే తీసుకొని రమ్మని శకుంతల చెప్తుంది. రుద్ర తన నిర్ణయాన్ని పట్టించుకోడు. అ తర్వాత రుద్ర మళ్ళీ గంగ ఉన్న అకాడమీ దగ్గరున్న టీ షాప్ కి వెళ్లి కాసేపు ఆలోచిస్తాడు. ఇక గంగకి అకాడమీ వాళ్ళు ఏదైనా ఇబ్బంది పెడుతున్నారేమో అని ఆలోచించిన రుద్ర అక్కడ టీ షాప్ లో ఒక బుక్ తీసుకొని అకాడమీ కాంపౌండ్ దగ్గరికి వెళ్తాడు. గంగకి ఒక పేపర్ లో మెసేజ్ రాసి లోపలికి విసురుతాడు.

Illu illalu pillalu : అమూల్యకి పెళ్ళిచూపులు.. కామాక్షి ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -362 లో.. పెళ్లిచూపులకి ఇంకా రావడం లేదని రామరాజు వాళ్ళు ఎదురుచూస్తుంటే వాళ్ళు రారుగా అని శ్రీవల్లి మనసులో అనుకుంటుంది. అప్పుడే అబ్బాయి వాళ్ళు పెళ్లిచూపులకు ఎంట్రీ ఇస్తారు‌. దాంతో శ్రీవల్లి షాక్ అవుతుంది. భాగ్యం, ఆనందరావు కూడా వస్తారు. వాళ్ళు ఏం జరిగిందో శ్రీవల్లికి చెప్తారు. వాళ్ళు చెప్పాల్సింది మొత్తం అబ్బాయి వాళ్ల నాన్నకి చెప్తారు కానీ అతనికి చెవులు వినిపించవు.. వాళ్ల అమ్మ కి చెప్పేలోపు అటువైపు గా ప్రేమ, ధీరజ్ వెళ్లడం చూసి మళ్ళీ చెప్పలేకపోయామని శ్రీవల్లికి భాగ్యం చెప్తుంది.