English | Telugu

చూద్దామని వెళ్ళా.. మిస్టర్ మెస్మరైజ్ అవార్డు వచ్చేసింది

గుప్పెడంత మనసు సీరియల్ బుల్లితెర మీద దూసుకుపోతోంది. అందులో రిషి, వసుధారా పాత్రలు ఇప్పుడు హైలైట్. సీరియల్ ఐనా కూడా నిజమైన ప్రేమికులేమో అన్నంత బాగా ఆ పాత్రల్లో లీనమై నటించేశారు. ఇక ఇప్పుడు రిషి అలియాస్ ముకేష్ గౌడ తన లైఫ్ లో జరిగిన కొన్ని విషయాలను ఒక ఇంటర్వ్యూలో షేర్ చేసుకున్నాడు.

"మైసూర్ లో ఉన్నప్పుడు అక్కడ లోకల్ గా జరిగే అందాల పోటీల్లో ఫ్రెండ్స్ తో సరదాగా చూడడానికి వెళ్లి ఫ్రెండ్స్ ఫోర్స్ మీద పార్టిసిపేట్ చేయాల్సి వచ్చింది . ఐతే ఆ పోటీకి డ్రెస్ కోడ్ ఉంది. దానికి బ్లాక్ కలర్ టీ షర్ట్ వేసుకోవాలి. ఐతే అప్పటికి నా దగ్గర ఆ కలర్ లేకపోయేసరికి నా ఫ్రెండ్ అప్పటికే బయటికి వచ్చిన ఒక కంటెస్టెంట్ దగ్గర నుంచి అడిగి తీసుకుని నా పేరు రిజిస్టర్ చేయించేశారు. అప్పుడు ఆ టీ షర్ట్ తీసుకుని రెస్ట్ రూమ్ కి వెళ్ళాను డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి. నేను రెడీ అవుతున్న టైంకే నా పేరు పిలిచేసారు. ఒక్కసారిగా నాకు కొంచెం టెన్షన్ అనిపించింది. వెంటనే రెస్ట్ రూమ్ నుంచి నా స్టైల్ లో నార్మల్ గా నడుచుకుంటూ వెళ్ళిపోయాను. ఫైనల్ గా టాప్ 10 లో నా పేరు వచ్చింది. ఆ తర్వాత జరిగిన ఫైనల్స్ లో నాకు మిస్టర్ మెస్మరైజ్ అవార్డు ఇచ్చారు. ఆ తర్వాత జరిగిన మరో కాంపిటీషన్ కి వెళ్తే బెస్ట్ స్మైల్ అవార్డు ఇచ్చారు.." అంటూ చెప్పాడు రిషి.

ఇంకా "నాకు యానిమల్స్ అంటే చాలా ఇష్టం. అన్నిటిలోకి ఆవు అంటే నాకు ఇంకా ఇష్టం. ఎందుకంటే ఏ జంతువైనా సీరియస్ గా కనిపిస్తుంది ఒక్కసారైనా..కానీ ఆవులో ఆ సీరియస్ నెస్ అస్సలు కనిపించదు.. ఎప్పుడూ చాలా సాఫ్ట్ గా ఉంటుంది. అందుకే గోమాతను పూజిస్తే పుణ్యం అంటారు" అంటూ రిషి ఆవు గురించి తన మనసులో మాట చెప్పాడు.

Jayam serial: వీరూ ప్లాన్ ని కనిపెట్టిన గంగ.. రుద్ర తెలుసుకుంటాడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -146 లో.... రుద్రకి ఎదురుగా గంగ వెళ్తుంది కానీ రుద్ర ఫోన్ మాట్లాడుతూ వెళ్ళిపోతాడు. కొంచెం దూరం వెళ్ళగానే రుద్రకి రింగ్ కనిపిస్తుంది. అది తీసుకొని చూస్తాడు. అప్పుడే ప్రమీల, ప్రీతీ వస్తారు. అన్నయ్య ఆ రింగ్ గంగ వదినది అని ప్రీతీ అంటుంది. ఈ రింగ్ ప్రపంచంలో ఆవిడకి ఒక్కదానికే ఉందా ఏంటని రుద్ర అంటాడు. ఆ తర్వాత అటుగా వెళ్తున్న గంగని రుద్ర పిలుస్తాడు. గంగ ముసుగులో ఉంటుంది. రుద్ర పిల్వగానే వస్తుంది. ఈ రింగ్ మీదేనా అని అడుగుతాడు. గంగ నాదేనని తీసుకుంటుంది..

Brahamamudi: మోడల్ ఫోటోషూట్ కోసం కావ్య ఒప్పుకుంటుందా.. రాజ్ ఏం చేయనున్నాడు!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -908 లో.... రాజ్ గుర్రంపై కూర్చొని ఊరేగుతున్నట్లు తన ఫోటోని రాజ్ కి చూపిస్తుంది కావ్య. అది చూసి నన్ను అలా చేస్తావా అని కావ్య ఫోటోని మోడల్ గా పెట్టి చూపిస్తాడు. చీ బాలేదు తీసెయ్యండి అని కావ్య అంటుంది. కావ్య ఎప్పుడు సంప్రదాయంగా ఉంటుందని ఫోటో మర్చి చూపిస్తుంది. అది చూసి రాజ్ ఫ్లాట్ అవుతాడు. ఇంట్లోనే మోడల్ ని పెట్టుకొని బయట వెతుకుతున్నానని రాజ్ అనుకుంటాడు. ఎలాగైనా యాడ్ లో చెయ్యడానికి కావ్యని ఒప్పించాలని అనుకుంటాడు.

Karthika Deepam2: వైరా ఇచ్చిన డీల్ కి ఒకే చెప్పిన కాశీ.. పోలీస్ స్టేషన్ కి శ్రీధర్!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -545 లో....వైరా దగ్గరికి కాశీ వస్తాడు. కాశీ రాగానే రండి సర్ అని కాశీకీ వైరా మర్యాద ఇస్తుంటే నాకు మర్యాద ఇస్తున్నారేంటని కాశీ అడుగుతాడు. మీ రెజ్యుమె చూసాను.‌ చాలా బాగుంది. మనకంటే టాలెంట్ ఎక్కువ ఉన్నవాళ్లు మనకన్నా చిన్న ఏజ్ అయిన రెస్పెక్ట్ ఇవ్వాలని వైరా అంటాడు.. నాకు జ్యోత్స్న ఫోన్ చేసి చెప్పింది మీరు ప్రెజెంట్ ఏం చేస్తున్నారని వైరా అడుగగా జ్యోత్స్న రెస్టారెంట్ సీఈఓ దగ్గర పిఏగా చేస్తున్నానని కాశీ చెప్తాడు. ఏంటి అంత చిన్న జాబ్ చేస్తున్నారా అని వైరా అంటాడు.