English | Telugu

డేంజర్ జోన్ లో మెరీనా-రోహిత్ !


బిగ్ బాస్ హౌస్ లో గందరగోళం జరుగుతుంది. కారణం కంటెస్టెంట్స్ చేసే పనులకి, స్ట్రాటజీలకు బిగ్ బాస్ వీక్షించే ప్రేక్షకులు..ఎవరు నటిస్తున్నారు? ఎవరు ఫేక్ ? అని తెలుసుకోలేకపోతున్నారు.

అయితే నిన్న మొన్నటి దాకా అందరూ కలసి ఇనయాను టార్గెట్ చేసారు అని అనిపించింది. కానీ నిన్న జరిగిన కెప్టెన్సీ టాస్క్ లో తనను సపోర్ట్ చేసేవారు ఎక్కువ అయ్యారు. అయితే కీర్తి భట్, శ్రీహాన్ ల మధ్య ఒక ఇగోతో కూడిన కోల్డ్ వార్ జరుగుతోంది అని చెప్పాలి.

అయితే టాప్ త్రీ లో ఉండాల్సిన ఆదిరెడ్డి , ఓటింగ్ పర్సెంటేజ్ పూర్తిగా పడిపోయింది. ఆదిరెడ్డి టాస్క్ లో సరిగ్గా పర్ఫామెన్స్ ఇవ్వకపోవడం ఒక కారణం అయితే, హౌస్ మేట్స్ తో తన ప్రవర్తన మారిపోవడం మరొక కారణం. కాగా మెరీనా, రోహిత్ ఇప్పుడు డేంజర్ జోన్ లో ఉన్నారు. కీర్తి భట్ గేమ్ లో బాగా పర్ఫామెన్స్ ఇవ్వడంతో, ఓటింగ్ శాతాన్ని పెంచుకుంది. దీంతో ఆదిరెడ్డిని దాటి తన టాప్ ఫై లో స్థానం సంపాదించింది. ఇక వీరిలో ఎవరు బయటకు వెళ్తారు అని ఉత్కంఠ అందరిలోను ఉంది.

Podharillu: మహా పెళ్ళికి అంతా ఫిక్స్.. చక్రిని ఆమె అర్థం చేసుకుందా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -12 లో.....మహా తన డ్రీమ్ గురించి భూషణ్ కి చెప్తుంది. డ్రీం లేదు ఏం లేదు ఫ్యామిలీ ని చూసుకుంటే సరిపోతుంది. నాకు నచ్చింది వండి పెడుతూ వెళ్ళేటప్పుడు బై చెప్పి వచ్చేటప్పుటికీ అందంగా రెడీ అయి ఉంటే చాలని చెప్పగానే వీడితో అనవసరంగా నా డ్రీమ్ గురించి చెప్పానని మహా అనుకుంటుంది. అదంతా చక్రి వింటాడు. మరొకవైపు మాధవ దగ్గరికి గాయత్రి వచ్చి.. ఈ పెళ్లి కూడా క్యాన్సిల్ అయ్యిందంట కదా అని చెప్పగానే అందరు షాక్ అవుతారు. ఏ సైలెంట్ గా ఉండు.. ఈ విషయం కన్నాకి తెలియదని మాధవ అంటాడు.