English | Telugu

Krishna Mukunda Murari: దీపావళి సెలబ్రేషన్స్ లో ప్రమాదం పొంచి ఉందా?

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి'. ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -315 లో.. మురారి ఎవరికి తెలియకుండా కృష్ణని బయటకు తీసుకొని వచ్చి రింగ్ గిఫ్ట్ ఇస్తాడు. మురారి స్వయంగా కృష్ణ వేలికి తొడుగుతాడు. అదంతా చాటుగా చూసిన ముకుంద.. నేను ఇలా చూస్తూ ఉంటే సరిపోదు. ఏదో ఒకటి చెయ్యాలని అనుకుంటుంది‌. ఈ విషయం పెద్ద అత్తయ్యకి చెప్పకుండా ఒకటే సారి బ్లాస్ట్ చెయ్యాలని ముకుంద అనుకుంటుంది.

ఆ తర్వాత ముకుంద భవాని దగ్గరకు వచ్చి.. కృష్ణపై ఇంకా కోపం కలిగేలా మాట్లాడుతుంది. షాపింగ్ మాల్ లో జరిగిన విషయలు మొత్తం భవానికి ముకుంద చెప్పి.. తనని మొత్తం నెగెటివ్ గా చేస్తుంది. ఆ తర్వాత నేను చూసుకుంటాను. నువ్వు వెళ్ళు అని ముకుందకి భవాని చెప్తుంది. మరుసటి రోజు ఉదయం దీపావళి సందర్భంగా ఇంట్లో పూజకి అన్ని ఏర్పాట్లు చేస్తుంటారు. ఆ తర్వాత ముకుంద మురారిలు పై నుండి కలిసి వస్తుంటే వాళ్లని చూసి భవాని చాలా హ్యాపీగా ఫీల్ అవుతు.. వాళ్ళని అలా చూస్తుంటే నేను తీసుకున్న నిర్ణయం కరెక్ట్ అనిపిస్తుంది. ఆ తర్వాత నందుతో ముకుంద, మురారి లను ఫోటో తీయమని భవాని చెప్తుంది. కృష్ణ ఇంకా రాలేదు అని మురారి బయటకు వెళ్లి చూస్తుంటాడు. కాసేపటికి కృష్ణ వస్తుంది మురారికి చెరొక పక్క కృష్ణ ముకుంద కూర్చొని ఉంటారు. కృష్ణ వేలికి ఉన్నా రింగ్ ని చూస్తూ మురిసిపోతుంది. అది చూసి ఓర్వలేకపోతుంది ముకుంద.

ఆ తర్వాత ముకుంద తన కన్నింగ్ ప్లాన్ తో.. నిన్న నేను ఒక రింగ్ తీసుకున్నాను. అది కన్పించడం లేదని భవానితో చెప్తుంది. కృష్ణ పెట్టుకున్న రింగ్ నాదే అని ముకుంద అనగానే అందరు షాక్ అవుతారు. మురారి నిజం చెప్పబోయి ఆగిపోతాడు. నేనే కొని ఇచ్చానని చెప్తే ఇంట్లో అందరూ ఎందుకు కొని ఇచ్చావని తిట్టాలని ముకుంద ప్లాన్ అనుకుంటా అని మురారి అనుకుంటాడు. అలాగే కృష్ణ కూడా అలాగే అలోచించి నిజం చెప్పకుండా ఆగిపోతుంది.

ఆ తర్వాత అవును ఈ రింగ్ నేను దొంగతనం చెయ్యలేదు. నాకు బయట దొరికింది అని కృష్ణ అనగానే.. ఇవ్వమని ముకుంద అంటుంది. కృష్ణ రింగ్ తియ్యడానికి ప్రయత్నం చేస్తుంటే అది రాదు. అప్పుడే మురారి తియ్యబోతుంటే భవాని వద్దని చెప్తుంది. తరువాయి భాగంలో.. భవాని ఇంట్లో అందరూ దీపావళి జరుపుకుంటు ఉంటారు. అప్పుడే కృష్ణ కొంగుకి నిప్పు అంటుంకుంటుంది. దాంతో మురారి కాపాడతాడు. అసలు భవాని తీసుకున్న నిర్ణయం ఏంటి? మురారి తను గిఫ్ట్ ఇచ్చిన విషయం చెప్పనున్నాడా.. తెలియాలంటే పూర్తి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Podharillu : మహా, చక్రిలని వెతకడానికి రంగంలోకి దిగిన రౌడీలు.. ప్రతాప్ పట్టుకుంటాడా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -23 లో...మహా ఇంట్లో నుండి వెళ్లిపోతున్నట్లు లెటర్ రాసి బయటకు వచ్చి వాళ్ళ నాన్నని గుర్తుచేసుకొని ఏడుస్తుంది. ఎలాగోలా బయటకు వచ్చేస్తుంది మహా. ఆ తర్వాత చక్రి తీసుకొని వచ్చిన కార్ ఎక్కుతుంది. ముందు అ ఫోన్ నుండి సిమ్ తియ్యండి సిగ్నల్స్ ద్వారా ట్రేస్ చేస్తే ఎక్కడున్నామో తెలుస్తుందని చక్రి అనగానే అవునని సిమ్ తియ్యబోతుంటే భూషణ్ ఫోన్ చేస్తాడు. వీడికి బాకీ ఉన్న మాటలు బాగా ఉన్నాయని ఫోన్ లిఫ్ట్ చేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది. రేపు పెళ్లి పెట్టుకొని ఇలా మాట్లాడుతున్నావ్ ఏంటని భూషణ్ అంటాడు.

Jayam serial : గంగని టార్గెట్ చేసిన పారు.. రుద్ర గది నుండి బయటకు రాగలడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -162 లో... రుద్ర ఇంటికి రావడంతో శకుంతల కోప్పడుతుంది. ఆ గంగ అకాడమీలో స్టే చెయ్యడంతో ఈ ఇంటి పరువుపోతుంది వెంటనే తీసుకొని రమ్మని శకుంతల చెప్తుంది. రుద్ర తన నిర్ణయాన్ని పట్టించుకోడు. అ తర్వాత రుద్ర మళ్ళీ గంగ ఉన్న అకాడమీ దగ్గరున్న టీ షాప్ కి వెళ్లి కాసేపు ఆలోచిస్తాడు. ఇక గంగకి అకాడమీ వాళ్ళు ఏదైనా ఇబ్బంది పెడుతున్నారేమో అని ఆలోచించిన రుద్ర అక్కడ టీ షాప్ లో ఒక బుక్ తీసుకొని అకాడమీ కాంపౌండ్ దగ్గరికి వెళ్తాడు. గంగకి ఒక పేపర్ లో మెసేజ్ రాసి లోపలికి విసురుతాడు.