English | Telugu

కృష్ణ ముకుంద మురారి సీరియల్ లో ఊహించని మలుపు.. అసలేం జరిగిందంటే!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి'. ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -292 లో.. ముకుంద వాళ్ళ అన్నయ్య ఎంట్రీ ఇస్తాడు. కార్ కి ఆక్సిడెంట్ అయిన దగ్గరికి వెళ్లి చూస్తాడు.. పడిపోయి ఉన్న మురారి దగ్గరికి వెళ్లి బ్రతికి ఉన్నాడో లేదో చూస్తాడు. బ్రతికి ఉన్నాడని అనుకొని తను ఆక్సిడెంట్ చేపించిన రౌడీల దగ్గరికి వెళ్లి.‌. నేను చెప్పినట్టు చేశారని చెప్తాడు. ఆ తర్వాత మురారిని హాస్పిటల్ కీ తీసుకొని వెళ్తారు.

మరొక వైపు రేవతి అన్న మాటలు గుర్తుకు చేసుకుంటూ ప్రభాకర్ వెళ్తుంటాడు. ఇంతలో దారి పక్కన కొంతమంది ఉండడం చూసి ప్రభాకర్ బండి ఆపి అక్కడకీ వెళ్లి చూస్తాడు. అక్కడ దెబ్బలు తగిలి పడిపోయి ఉన్న కృష్ణని చూసి ఏడుస్తు కొంతమంది మంది సహాయంతో హాస్పిటల్ కి తీసుకొని వెళ్తాడు. మరొక వైపు మురారి గురించి డాక్టర్ లు మాట్లాడుకుంటారు. ట్రీట్ మెంట్ బాగా చెయ్యండని ముకుంద వాళ్ళ అన్నయ్య డాక్టర్స్ కి చెప్తాడు. మరొక వైపు అన్నయ్య మురారి గురించి మాట్లాడాలని హాస్పిటల్ ఎందుకు రమ్మన్నాడని హాస్పిటల్ కి వచ్చిన ముకుంద ఆలోచిస్తుంది. అప్పుడే తన అన్నయ్య వచ్చి మురారికి దెబ్బలు తగినట్టు చెప్తాడు. తనే అదంతా చేసినట్టు ముకుందకి చెప్పడు. మురారి బాగయ్యాక పెళ్లి చేస్కోమని తన ముకుందకి వాళ్ళ అన్నయ్య చెప్తాడు. మరొక వైపు డాక్టర్స్ కృష్ణకి ట్రీట్ మెంట్ చేస్తుంటారు. ప్రభాకర్ దగ్గరికి శకుంతల వస్తుంది. తనకి ప్రభాకర్ జరిగిందంత చెప్తాడు.

మరొక వైపు ముకుంద వాళ్ళ అన్నయ్య మురారికీ ట్రీట్ మెంట్ చేస్తున్న డాక్టర్ కేబిన్ దగ్గరికి వస్తాడు. నేను చెప్పినట్లు చెయ్యండంటు బ్లాక్ మెయిల్ చేస్తాడు. ఆ తర్వాత డాక్టర్స్ చేసేదేమీ లేక ఒప్పుకుంటాడు. మరొక వైపు కృష్ణ బాగయ్యాక మనతో తీసుకొని వెళదామని ప్రభాకర్ తో శకుంతల అంటుంది. ఆ తర్వాత కృష్ణ స్పృహలోకి వస్తుంది‌. దాంతో ప్రభాకర్, శకుంతల ఇద్దరు కృష్ణ దగ్గరికి వెళ్తారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Podharillu : మహా, చక్రిలని వెతకడానికి రంగంలోకి దిగిన రౌడీలు.. ప్రతాప్ పట్టుకుంటాడా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -23 లో...మహా ఇంట్లో నుండి వెళ్లిపోతున్నట్లు లెటర్ రాసి బయటకు వచ్చి వాళ్ళ నాన్నని గుర్తుచేసుకొని ఏడుస్తుంది. ఎలాగోలా బయటకు వచ్చేస్తుంది మహా. ఆ తర్వాత చక్రి తీసుకొని వచ్చిన కార్ ఎక్కుతుంది. ముందు అ ఫోన్ నుండి సిమ్ తియ్యండి సిగ్నల్స్ ద్వారా ట్రేస్ చేస్తే ఎక్కడున్నామో తెలుస్తుందని చక్రి అనగానే అవునని సిమ్ తియ్యబోతుంటే భూషణ్ ఫోన్ చేస్తాడు. వీడికి బాకీ ఉన్న మాటలు బాగా ఉన్నాయని ఫోన్ లిఫ్ట్ చేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది. రేపు పెళ్లి పెట్టుకొని ఇలా మాట్లాడుతున్నావ్ ఏంటని భూషణ్ అంటాడు.

Jayam serial : గంగని టార్గెట్ చేసిన పారు.. రుద్ర గది నుండి బయటకు రాగలడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -162 లో... రుద్ర ఇంటికి రావడంతో శకుంతల కోప్పడుతుంది. ఆ గంగ అకాడమీలో స్టే చెయ్యడంతో ఈ ఇంటి పరువుపోతుంది వెంటనే తీసుకొని రమ్మని శకుంతల చెప్తుంది. రుద్ర తన నిర్ణయాన్ని పట్టించుకోడు. అ తర్వాత రుద్ర మళ్ళీ గంగ ఉన్న అకాడమీ దగ్గరున్న టీ షాప్ కి వెళ్లి కాసేపు ఆలోచిస్తాడు. ఇక గంగకి అకాడమీ వాళ్ళు ఏదైనా ఇబ్బంది పెడుతున్నారేమో అని ఆలోచించిన రుద్ర అక్కడ టీ షాప్ లో ఒక బుక్ తీసుకొని అకాడమీ కాంపౌండ్ దగ్గరికి వెళ్తాడు. గంగకి ఒక పేపర్ లో మెసేజ్ రాసి లోపలికి విసురుతాడు.

Illu illalu pillalu : అమూల్యకి పెళ్ళిచూపులు.. కామాక్షి ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -362 లో.. పెళ్లిచూపులకి ఇంకా రావడం లేదని రామరాజు వాళ్ళు ఎదురుచూస్తుంటే వాళ్ళు రారుగా అని శ్రీవల్లి మనసులో అనుకుంటుంది. అప్పుడే అబ్బాయి వాళ్ళు పెళ్లిచూపులకు ఎంట్రీ ఇస్తారు‌. దాంతో శ్రీవల్లి షాక్ అవుతుంది. భాగ్యం, ఆనందరావు కూడా వస్తారు. వాళ్ళు ఏం జరిగిందో శ్రీవల్లికి చెప్తారు. వాళ్ళు చెప్పాల్సింది మొత్తం అబ్బాయి వాళ్ల నాన్నకి చెప్తారు కానీ అతనికి చెవులు వినిపించవు.. వాళ్ల అమ్మ కి చెప్పేలోపు అటువైపు గా ప్రేమ, ధీరజ్ వెళ్లడం చూసి మళ్ళీ చెప్పలేకపోయామని శ్రీవల్లికి భాగ్యం చెప్తుంది.