English | Telugu

ప్రేక్షకుల మనసు గెలుచుకున్న కీర్తి భట్!

బిగ్ బాస్ సీజన్-6 లో ఈ సారి కూడా అమ్మాయిలకు నిరాశే మిగిలింది. టాప్-3 లో ఉన్న కీర్తి భట్.. టైటిల్ గెలవకపోయినా ప్రేక్షకుల మనసు గెలుచుకుంది.

హౌస్ లోకి మొదటి కంటెస్టెంట్ గా అడుగుపెట్టింది కీర్తి భట్. 'కార్తీక దీపం' సీరియల్ తో బుల్లితెరపై కనిపించి, తెలుగు ప్రేక్షకులకు దగ్గర అయ్యింది. ఒక యాక్సిడెంట్ లో తన ఫ్యామిలీ మొత్తాన్ని కోల్పోయి.. ఆ తర్వాత ఒంటరిగా మిగిలిన తను ఒక పాపని అడాప్ట్ చేసుకుంది. అనారోగ్యంతో ఆ పాప కూడా చనిపోయింది. దీంతో తను ఇష్టపడిన ప్రతీది తనకు దూరం అవుతున్నా కూడా ఎక్కడ కూడా కృంగిపోకుండా, పైకి లేచి నిలబడింది. ఇక్కడ దాకా వచ్చింది. హౌస్ లోకి వచ్చాక కూడా తనని ఎవరూ పట్టించుకోకుండా ఉండేవారు హౌస్ మేట్స్. అయినప్పటికీ తను కాన్ఫిడెన్స్ కోల్పోలేదు. చివరి వరకూ పోరాడుతూ వచ్చి.. టాప్-3 లో నిలిచింది.

అయితే రవితేజ హౌస్ లోకి వచ్చి 30 లక్షల మనీ ఆఫర్ ఇచ్చినప్పుడు, కీర్తి తీసుకొని వచ్చేయొచ్చు. కానీ తను అలా చేయలేదు. ప్రేక్షకుల ఓటింగ్ ని గౌరవిస్తూ వారికి కట్టుబడి ఉండి, నిజాయితీగా ఎలిమినేట్ అయ్యి బయటకొచ్చింది. ఎలిమినేట్ అయ్యి స్టేజ్ మీదకి వచ్చాక ఆదిరెడ్డి కూడా కీర్తి గురించి చెప్పాడు. ఆదిరెడ్డి మాట్లాడుతూ "కీర్తీ.. నువ్వు చాలా టఫ్ అమ్మ. చాలా స్ట్రాంగ్. వేలికి గాయం అయినా సరే టాస్క్ లు ఆడి గెలిచావ్. నీలా ధైర్యంగా ఉంటే ఎవరూ కూడా సూసైడ్ చేసుకోరమ్మా.. హ్యాట్సాఫ్ టు యూ" అని చెప్పాడు. దీంతో నాగార్జునతో పాటుగా కంటెస్టెంట్స్ అందరూ చప్పట్లతో తమ అభినందనలు తెలిపారు. బిగ్ బాస్ హౌస్ లో కీర్తి భట్ ప్రస్థానం.. ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచింది.

Jayam serial : బాక్సింగ్ పోటీలో మిస్సెస్ గంగ రుద్ర ప్రతాప్.. పారు ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -160 లో..... గంగని ఎలాగైనా అకాడమీ సెలక్షన్ కి వెళ్లకుండా ఆపాలని ఇషిక, వీరు ట్రై చేస్తారు కానీ గంగ, రుద్ర ఇద్దరు కలిసి ఇంట్లో అన్ని పనులు పూర్తి చేసి అకాడమీకి వెళ్తారు. రుద్ర అకాడమీ బయటే ఉంటాడు. నాకు సంబంధించిన కేసు ఇంకా పెండింగ్ లో ఉంది అలా ఉండగా.. నేను లోపలకు రాకూడదని రుద్ర బయటే ఉండి గంగకి అంతా వివరిస్తాడు. నేను నీ పేరు మైక్ లో రావడం వినాలని రుద్ర అంటాడు. గంగ లోపలకు వెళ్తుంది. అక్కడ పారు ఇంకా తన ఫ్రెండ్స్ కలిసి గంగని చులకనగా మాట్లాడుతారు.

Brahmamudi : రుద్రాణిని రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన కనకం!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -922 లో.. ఒకతను వచ్చి రుద్రాణికి మళ్ళీ పసరు మందు ఇస్తాడు. ఆ పసరు మందు పని చేస్తుందా లేదా అని రుద్రాణి అతన్ని అడుగుతుంది. పని చేస్తుందని అతను చెప్తాడు. దాంతో రుద్రాణి పసరు మందు తీసుకొని లోపలికి వెళ్తుంటే అప్పుడే కనకం ఎదురుపడుతుంది. కనకాన్ని చూసి రుద్రాణి టెన్షన్ పడుతుంది. చేతిలో అదేంటీ అని కనకం అనగానే ఇదా.... నాకే పసరు మందు అజీర్తికి వాడమని చెప్పారని చెప్పి రుద్రాణి వెళ్ళిపోతుంది. అలా అయితే ఇంత రాత్రివేళ తీసుకొని వెళ్తుంది ఏంటని కనకంకి డౌట్ వస్తుంది.