English | Telugu

నన్ను అత్తయ్య అని పిలిచే హక్కు నీకు లేదు!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్-53 లో.. కావ్య గురించి స్వప్నకి చెడు అభిప్రాయం ఏర్పడేటట్లు చేస్తాడు రాహుల్. నీ అక్క వల్లనే ఇప్పుడు నిన్ను పెళ్లి చేసుకుంటే నన్ను బయటకు గెంటేస్తారు అంటూ రాహుల్ అంటాడు. ఇప్పుడే వద్దు పెళ్లి, నాకు గౌరవం దక్కినప్పుడే దుగ్గిరాల ఇంటి కోడలుగా వెళ్తానని రాహుల్ తో అంటుంది స్వప్న. అక్కచెల్లెళ్ళలకి గొడవ పెట్టాను.. ఇప్పట్లో స్వప్న నన్ను డిస్టర్బ్ చెయ్యదని అనుకుంటాడు రాహుల్.

మరోవైపు కనకం ఇంటికి రాగానే కృష్ణమూర్తి తిడతాడేమోనని అనుకుంటుంది. కానీ అతను కనకంని తిట్టడు. "ఒక తల్లిగా నీ కూతురుని చూడాలి అనుకునే నీ ప్రేమను నేనెలా కాదంటాను. నేను ఎందుకు తిడుతాను.. కావ్య ఎలా ఉంది" అని కృష్ణమూర్తి అడుగగా.. బాగుందని చెప్తుంది కనకం. కావ్య ఎలా ఉందో నీ కళ్ళలో సంతోషం చూస్తే కన్పిస్తుందని కృష్ణమూర్తి అంటాడు. నీ ముఖానికి వేసుకున్న జోకర్ రంగులు ఎప్పుడు చెరిపేశావని కృష్ణమూర్తి అడుగగా.. ఎలా తెలిసిందంటూ ఎమోషనల్ అవుతుంది కనకం. నాకు మీనాక్షి అక్కడ జరిగిందంతా చెప్పిందని కృష్ణమూర్తి అంటాడు.

మరోవైపు కావ్య దగ్గరికి అపర్ణ వచ్చి.. "నేను ఈ పనికిరాని సామాన్లు పడేసే గదికి ఎప్పుడు రాలేదు. ఇప్పుడు నా నగల కోసం వచ్చాను" అని అంటుంది. నాకు ఈ నగలు పెట్టుకోవాలనే అశేమీ లేదని కావ్య అనగానే.. మరి ఈ నగలు అన్ని ఎందుకు దిగేసుకున్నావ్ అని అపర్ణ అడుగుగా.. "ఈ నగలు సొసైటీలో నన్ను రిచ్ గా చూపించేందుకు.. మీ అబ్బాయి వేసుకోమన్నాడు.. అమ్మమ్మ గారు కూడా బలవంతం చేస్తే వేసుకున్నాను అత్తయ్య" అని నగలు ఇస్తుంది. నన్ను అత్తయ్య అని పిలిచే హక్కు నీకు లేదని అపర్ణ అంటుంది. నన్ను క్షమించండి.. మీరు నన్ను కోడలిగా ఒప్పుకునే వరకు మేడం అని పిలుస్తానని నగలు అపర్ణకి ఇస్తుండగా.. పనిమనిషి శాంతని పిలిచి.. ఆ నగలు తీసుకొని శుభ్రంగా కడిగి నా గదిలో పెట్టమని అపర్ణ అంటుంది. అలా అపర్ణ అనేసరికి కావ్య బాధపడుతుంది.

మరోవైపు కనకంని వెతుక్కుంటూ అప్పు దుగ్గిరాల ఇంటికి వస్తుంది. సెక్యూరిటీ పంపించకపోవడంతో చాటుగా లోపలికి వెళ్తుంది. అప్పుని చూసిన కళ్యాణ్ తనని వెన్నక్కి లాగి.. "బ్రో నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావ్" అని అడుగుతాడు. నేను ఎవరో తెలిసి కూడా బ్రో అంటున్నావ్ అని అప్పు అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Podharillu : మహా, చక్రిలని వెతకడానికి రంగంలోకి దిగిన రౌడీలు.. ప్రతాప్ పట్టుకుంటాడా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -23 లో...మహా ఇంట్లో నుండి వెళ్లిపోతున్నట్లు లెటర్ రాసి బయటకు వచ్చి వాళ్ళ నాన్నని గుర్తుచేసుకొని ఏడుస్తుంది. ఎలాగోలా బయటకు వచ్చేస్తుంది మహా. ఆ తర్వాత చక్రి తీసుకొని వచ్చిన కార్ ఎక్కుతుంది. ముందు అ ఫోన్ నుండి సిమ్ తియ్యండి సిగ్నల్స్ ద్వారా ట్రేస్ చేస్తే ఎక్కడున్నామో తెలుస్తుందని చక్రి అనగానే అవునని సిమ్ తియ్యబోతుంటే భూషణ్ ఫోన్ చేస్తాడు. వీడికి బాకీ ఉన్న మాటలు బాగా ఉన్నాయని ఫోన్ లిఫ్ట్ చేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది. రేపు పెళ్లి పెట్టుకొని ఇలా మాట్లాడుతున్నావ్ ఏంటని భూషణ్ అంటాడు.

Jayam serial : గంగని టార్గెట్ చేసిన పారు.. రుద్ర గది నుండి బయటకు రాగలడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -162 లో... రుద్ర ఇంటికి రావడంతో శకుంతల కోప్పడుతుంది. ఆ గంగ అకాడమీలో స్టే చెయ్యడంతో ఈ ఇంటి పరువుపోతుంది వెంటనే తీసుకొని రమ్మని శకుంతల చెప్తుంది. రుద్ర తన నిర్ణయాన్ని పట్టించుకోడు. అ తర్వాత రుద్ర మళ్ళీ గంగ ఉన్న అకాడమీ దగ్గరున్న టీ షాప్ కి వెళ్లి కాసేపు ఆలోచిస్తాడు. ఇక గంగకి అకాడమీ వాళ్ళు ఏదైనా ఇబ్బంది పెడుతున్నారేమో అని ఆలోచించిన రుద్ర అక్కడ టీ షాప్ లో ఒక బుక్ తీసుకొని అకాడమీ కాంపౌండ్ దగ్గరికి వెళ్తాడు. గంగకి ఒక పేపర్ లో మెసేజ్ రాసి లోపలికి విసురుతాడు.

Illu illalu pillalu : అమూల్యకి పెళ్ళిచూపులు.. కామాక్షి ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -362 లో.. పెళ్లిచూపులకి ఇంకా రావడం లేదని రామరాజు వాళ్ళు ఎదురుచూస్తుంటే వాళ్ళు రారుగా అని శ్రీవల్లి మనసులో అనుకుంటుంది. అప్పుడే అబ్బాయి వాళ్ళు పెళ్లిచూపులకు ఎంట్రీ ఇస్తారు‌. దాంతో శ్రీవల్లి షాక్ అవుతుంది. భాగ్యం, ఆనందరావు కూడా వస్తారు. వాళ్ళు ఏం జరిగిందో శ్రీవల్లికి చెప్తారు. వాళ్ళు చెప్పాల్సింది మొత్తం అబ్బాయి వాళ్ల నాన్నకి చెప్తారు కానీ అతనికి చెవులు వినిపించవు.. వాళ్ల అమ్మ కి చెప్పేలోపు అటువైపు గా ప్రేమ, ధీరజ్ వెళ్లడం చూసి మళ్ళీ చెప్పలేకపోయామని శ్రీవల్లికి భాగ్యం చెప్తుంది.