English | Telugu

వాళ్ళ ట్రోలింగ్ మాములుగా ఉండదు మరి!

కార్తీకదీపం షోలోకి దీప తిరిగి రావడంతో అభిమానులు ఆశ్చర్యానికి గురౌతున్నారు. దాదాపు పదేళ్ల తర్వాత ఈ షోలోకి దీప కోమా స్టేజి నుంచి కోలుకుంటున్నట్టుగా ఎంట్రీ ఇచ్చింది. ఇక ఇప్పుడు దీప కార్తీక్ కోసం ఆరా తీస్తూ, మార్చురీలో ఉన్నట్లు చూపించారు. "మార్చురీలో మిగిలిన జ్ఞాపకంతో కుమిలిపోతున్న దీపఅనే టాగ్ లైన్ తో దీప బాధను స్టార్ మా తన ఇన్స్టాగ్రామ్ పేజీ లో పోస్ట్ చేసింది. చాలా ఏళ్ల తర్వాత దీప కోమాలోంచి బయటికి వస్తుంది. పిల్లలు పెద్దవాళ్ళైపోయినప్పటికీ దీప మాత్రం చాలా యంగ్ గా కనిపించింది. ఇక ఈ వీడియోను నెటిజన్స్ విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. మృతదేహాన్ని ఇన్నాళ్లుగా మార్చురీలో ఉంచడం ఏంటని పలువురు నెటిజన్లు కూడా ప్రశ్నిస్తున్నారు. దీప, కార్తీక్ సజీవంగా ఉన్నారని మేకర్స్ గత ఎపిసోడ్ లో చెప్పారు.

ఆటో డ్రైవర్ వారణాసి కనిపించి దీప, కార్తీక్ చనిపోలేదని సౌందర్య వాళ్ళ ఫామిలీకి చెప్తాడు. తర్వాత కొన్నాళ్ళకు దీప హాస్పిటల్ నుంచి లేచినట్టు కనిపిస్తుంది. లీడ్ రోల్స్ ఐన కార్తీక్, దీప కూర్గ్ ట్రిప్‌ కి వెళ్ళేటప్పుడు యాక్సిడెంట్‌కు గురైనట్లు చూపించారు. తర్వాత షోలో కార్తీక్ , దీప చనిపోయారని విషయం పిల్లలతో చెప్పించారు. అలాగే డాక్టర్ బాబు ని పెళ్లి చేసుకోవాలని కుట్రలు పన్నిన మోనిత తన పిల్లాడిని విడిచిపెట్టి, మతిమరుపు స్టేజి లోకి వెళ్ళిపోతుంది.

హిమ తమ తల్లిదండ్రులను చంపిందని తోబుట్టువు హిమపై ద్వేషంతో సౌర్య ఇంటి నుంచి పారిపోతుంది. నిరుపమ్‌ను ఆమె నుంచి లాక్కున్నందుకు సౌర్య హిమను మరింత ద్వేషిస్తూ ఉంటుంది. దీప కోమా స్టేజి నుంచి బయటికి రావడంపై నెటిజన్స్ గమ్మత్తైన కామెంట్స్ చేస్తున్నారు.

Jayam serial: వీరూ ప్లాన్ ని కనిపెట్టిన గంగ.. రుద్ర తెలుసుకుంటాడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -146 లో.... రుద్రకి ఎదురుగా గంగ వెళ్తుంది కానీ రుద్ర ఫోన్ మాట్లాడుతూ వెళ్ళిపోతాడు. కొంచెం దూరం వెళ్ళగానే రుద్రకి రింగ్ కనిపిస్తుంది. అది తీసుకొని చూస్తాడు. అప్పుడే ప్రమీల, ప్రీతీ వస్తారు. అన్నయ్య ఆ రింగ్ గంగ వదినది అని ప్రీతీ అంటుంది. ఈ రింగ్ ప్రపంచంలో ఆవిడకి ఒక్కదానికే ఉందా ఏంటని రుద్ర అంటాడు. ఆ తర్వాత అటుగా వెళ్తున్న గంగని రుద్ర పిలుస్తాడు. గంగ ముసుగులో ఉంటుంది. రుద్ర పిల్వగానే వస్తుంది. ఈ రింగ్ మీదేనా అని అడుగుతాడు. గంగ నాదేనని తీసుకుంటుంది..