English | Telugu

Karthika Deepam2 : అల్లుడికి అంత సీన్ లేదని పారిజాతం...కావేరి గురించి తెలుసుకోగలడా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం2'. ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -58 లో.....శ్రీధర్ వెళ్తుంటే దీప భర్త నర్సింహ రెండో పెళ్లి విషయం గురించి కూడా లాయర్ కి చెప్పమని పారిజాతం అంటుంది. మన టెన్షన్స్ మనకి ఉండగా.. ఎందుకు వాళ్ళ గురించి అని శ్రీధర్ అంటాడు. అలా అంటావేంటి? అలా భార్య ఉండగా రెండో పెళ్లి చేసుకోవచ్చా అని పారిజాతం అనగానే.. ఈవిడ మళ్ళీ మొదలు పెట్టిందని శ్రీధర్ కంగారుగా వెళ్తాడు. ఎంటి అల్లుడు రెండో పెళ్లి అనగానే టెన్షన్ పడుతున్నాడు.. డౌట్ పడదామన్న కూడా అల్లుడికి అంత సీన్ లేదని పారిజాతం అనుకుంటుంది.

ఆ తర్వాత నరసింహ అన్న మాటలు దీప గుర్తుకుచేసుకుంటుంది. మరొకవైపు నిన్ను డిస్టర్బ్ చేస్తూనే ఉంటానని నర్సింహ హోటల్ కి వస్తాడు. వీడిని త్వరగా ఇక్కడ నుండి పంపించాలని కడియం అనుకుంటాడు. నాకు ఒక టీ తీసుకొని రా అని నరసింహ కడియానికి చెప్తాడు. మరొకవైపు శౌర్య స్కూల్ నుండి.‌. " స్కూల్ లో ప్రోగ్రామ్ ఉంది " అని కార్తిక్ కి మెసేజ్ వస్తుంది. అది చూసి ఈ విషయం దీపకి చెప్పలని కార్తీక్ హోటల్ కి వెళ్తాడు. కార్తీక్ కి వెళ్లేసరికి నరసింహ హోటల్ లో గొడవ చేస్తుంటాడు. పోలీస్ స్టేషన్ లో పెట్టినా వీడికి బుద్ది రాలేదా అని కార్తీక్ అనుకుంటాడు. ఆ తర్వాత శౌర్యాస్కూల్ లో చదవడం.. నువ్వు ఇక్కడ పని చెయ్యడం నాకు ఇష్టం లేదని నర్సింహ అంటాడు. ఆ తర్వాత కార్తీక్ కడియానికి ఫోన్ చేసి.. నేను నీ ఎదురుగా ఉన్నాను.. నేను చెప్పినట్టు చెయ్ అని చెప్తాడు. ఆ తర్వాత నువ్వు ఇక్కడ నుండి వెళ్ళిపోమని నర్సింహతో కడియం అంటాడు. ఏంటి రా అని కడియం పై నరసింహ చెయ్ ఎత్తుతాడు కానీ నర్సింహ కొట్టకముందే కడియం కిందపడిపోతాడు. అందరు వస్తారు.. దీపమ్మని ఏడిపిస్తున్నాడు నన్ను కొట్టాడని కడియం అనగానే.. అందరూ నర్సింహని తిడతారు. నువ్వు ఇలా ఆడపిల్లని ఏడిపిస్తున్నావని షీ టీమ్ కి కాల్ చేస్తామని వాళ్ళంతా అనగానే నర్సింహ అక్కడ నుండి వెళ్లిపోతాడు.

ఆ తర్వాత కార్తీక్ దీప దగ్గరికి వస్తాడు. శౌర్యా గురించి చెప్పి వెళ్ళిపోతాడు. నీకు అంత ధైర్యం లేదు కదా .. ఎలా నర్సింహకు ఎదరు తిరిగావని దీప అడుగగా.. కార్తీక్ పేరు చెప్పకుండా కడియం కవర్ చేస్తాడు. కానీ నాకు తెలుసు బాబు ప్లాన్ అని దీప అనుకుంటుంది. ఆ తర్వాత వంట చేస్తున్న దీప దగ్గరికి శౌర్య వచ్చి.. రేపు స్కూల్ కి వెళ్ళనని.. బూచోడు వస్తాడని అంటుంది. దాంతో రాడని దీప చెప్తుంది. ఈ విషయం కార్తీక్ వాళ్ళకి చెప్తానని అనగానే.. వద్దని దీప కోప్పడడంతో శౌర్య కోపంగా వెళ్తుంది. మరొకవైపు కావేరితో శ్రీధర్ ఫోన్ మాట్లాడతాడు. అప్పుడే కార్తీక్ వస్తున్నాడని ఫోన్ కట్ చేస్తాడు. శ్రీధర్ కంగారుపడడం చూసి.. ఎవరితో మాట్లాడుతున్నావని ఫోన్ తీసుకుంటాడు. నీకు ఏ రహస్యం లేదు కదా.. లాస్ట్ కాల్ కి నేను చేసి మాట్లాడతానని కార్తీక్ అనగానే.. శ్రీధర్ టెన్షన్ పడతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Jayam serial : గంగ, రుద్ర పూజలో కూర్చుంటారా.. పారు ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -164 లో..... రుద్ర ఏ విధంగా గంగకి హెల్ప్ చేసాడో అందరికి చెప్తాడు. పాపం పెద్దమ్మ హర్ట్ అయినట్లు ఉందని వంశీ అనగానే అయితే అవనివ్వులే గంగ సేఫ్ అయిందని పెద్దసారు అంటాడు. మరొకవైపు పారు ఫ్రెండ్స్ ని అకాడమీ మేడమ్ సస్పెండ్ చేస్తుంది. దాంతో నువ్వు సస్పెండ్ ఆపకపోతే నువ్వే ఇదంతా చేసావని మేడమ్ కి చెప్తానని పారు ఫ్రెండ్ పారుతో అంటుంది. దాంతో మేడమ్ ని సస్పెండ్ క్యాన్సిల్ చెయ్యమని రిక్వెస్ట్ చేస్తుంది పారు. తప్పు ఒప్పుకుంటున్నారు కదా ఈ ఒక్కసారి క్షమించండి అని మేడమ్ తో గంగ అనగానే తను సరే అని సస్పెన్షన్ క్యాన్సిల్ చేస్తుంది.

ఆ మీమ్ నన్ను చాలా డిస్టర్బ్ చేసింది...సావండి అంటున్న నైనికా అనసుర

నైనికా అనసురు బుల్లితెర మీద అందరికీ పరిచయమే. బిగ్ బాస్ సీజన్ 8 ద్వారా బాగా ఫేమస్ అయ్యింది. అలాగే ఢీ డాన్స్ షోలో డాన్స్ ద్వారా బాగా పాపులర్ అయ్యింది. ఇక ఇప్పుడు బిబి జోడి సీజన్ 2 లో అమరదీప్ కి జోడిగా చేస్తోంది. అలాంటి నైనికా రీసెంట్ గా తన ఇన్స్టాగ్రామ్ స్టేటస్ లో ఘాటుగా ఒక పోస్ట్ పెట్టింది. "ఎలాంటి పని లేకుండా జస్ట్ కూర్చుని అమ్మాయిల చిత్రాలను ఘోరంగా ఎడిట్ చేస్తూ వాళ్ళను హరాస్ చేసే ఒక స్టుపిడ్ మీమ్ పేజీలో పోస్ట్ చేసిన నా చిత్రాలు నన్ను చాలా డిస్టర్బ్ చేశాయి. మీకు పని లేదు బ్రో, మాకు మిమ్మల్ని పట్టించుకునేంత టైం లేదు. నువ్వు మా మీద పోస్ట్లు పెడుతున్నావ్ అంటే నువ్వు నీలోనే తోపు ఐనట్టే..మీ పేరెంట్స్ నిన్ను బాగా పెంచారు. మీలాంటి వాళ్ళే రేపు రేపిస్టుల్లా తయారవుతారు.