English | Telugu

Karthika Deepam2 : జ్యోత్స్నని పెళ్లి చేసుకోమన్న దీప.. షాకైన కార్తీక్!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం2'(karthika Deepam2).ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -230 లో......కార్తీక్ తన పోస్ట్ కి రాజీనామా చేస్తాడు. దాంతో వద్దని దీప రిక్వెస్ట్ చేస్తుంది. శివన్నారాయణ, జ్యోత్స్నలు దీపని తిడతారు. నా భార్యని ఏం అనొద్దంటూ కోప్పడుతాడు. అయిన దీప వద్దని అనడంతో ఇంకా ఇలా మాట్లాడిన కూడా నువ్వెందుకు ఇలా అంటున్నావని కార్తీక్ అంటాడు. రాజీనామా లెటర్ ని శివన్నారాయణకి ఇచ్చి.. దీపని తీసుకొని కోపంగా వెళ్లిపోతాడు. బావ వెళ్తుంటే నువ్వు సైలెంట్ గా ఉన్నావ్ తాతయ్య అని జ్యోత్స్న అనగానే.. వాడు ఎక్కడికి వెళ్లినా మళ్ళీ తిరిగిరావల్సిందే అని శివన్నారాయణ అంటాడు.

ఆ తర్వాత పారిజాతం స్వీట్స్ తీసుకొని దాస్ ఇంటికి వస్తుంది. మీకోక గుడ్ న్యూస్.. ఆ కార్తీక్ జాబ్ మానేసాడని స్వప్నకి చెప్పి స్వీట్స్ ఇస్తుంది పారిజాతం. అవునా మా అన్నయ్యకి ఫ్రీడం దొరికిందంటు పారిజాతానికి కౌంటర్ వేస్తుంది స్వప్న. బావ తలుచుకుంటే వాళ్ళ కంటే గొప్ప పొజిషన్ కి వెళ్తాడని కాశీ అంటాడు. ఆ తర్వాత దీప గురించి పారిజాతం తప్పుగా మాట్లాడుతుంటే.. వద్దని దాస్ అంటాడు. మరొకవైపు కార్తీక్, దీప లు ఒక దగ్గర ఆగి మాట్లాడుకుంటారు. ఎందుకు దీప ఏడుస్తున్నావని కార్తీక్ అడుగుతాడు. నా వల్ల మీ కుటుంబం నుండి విడిపోయారని దీప అంటుంది. నాకు కుటుంబం ఉందని కార్తీక్ అంటాడు.

మీరు జ్యోత్స్నని పెళ్లి చేసుకోండి కార్తీక్ బాబు అని దీప అనగానే.. పద ఆ పెద్దాయన దగ్గరికి వెళ్లి నీ మనవరాలిని నా భర్తకిచ్చి పెళ్లి చెయ్ అని అడుగు ఒప్పుకుంటే నీ తాళి ఇచ్చి తన మెడలో కట్టించు.. ఆ తర్వాత నువ్వు వెళ్ళిపో అప్పుడు చరిత్రలో మిగిలిపోతావని కార్తీక్ కోప్పడతాడు. నేను ఎప్పుడైనా జ్యోత్స్నతో మాట్లాడడం చూసావా.. ఇష్టమని ఎప్పుడైనా చెప్పానా.. నిన్ను ఇస్టపడి చేసుకున్నాను.. నువ్వేం చేసినా ఇష్టమని దీపతో కార్తీక్ అంటాడు. ఆ తర్వాత కార్తీక్, దీప లు ఇంటికి వెళ్తారు. ఇప్పుడే వచ్చావ్ మళ్ళీ వెళ్తావా అని కాంచన అడుగుతుంది. మళ్ళీ వెళ్ళే అవసరం లేదని కార్తీక్ అనగానే.. ఏమైందని దీపని కాంచన అడుగుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Karthika Deepam2: వైరాతో జ్యోత్స్న డీలింగ్.. కార్తీక్ కి డౌట్!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -544 లో.....శౌర్యకి దీప భోజనం తినిపిస్తుంది. అది చూసి కొడుకు కోడలితో చెల్లి మాట్లాడుతలేనట్లు ఉందని అనసూయ అంటుంది. వాళ్లే దాక్కొని తిరుగుతున్నారని కాంచన అంటుంది. శౌర్య వెంట భోజనం తినమని దీప పరుగెడుతుంది. శౌర్య అలా అమ్మని పరిగెత్తించవచ్చా.. ఇప్పుడు అమ్మ కడుపులో బేబీ ఉంది కదా తనకి ఆయాసం వస్తుంది ఇకనుండి నువ్వే భోజనం చెయ్యాలని కాంచన అనగానే.. నువ్వు మంచి నానమ్మవి కాదు నిన్ను తాతయ్య దగ్గరికి పంపించాలి.. మా అమ్మ నాకు తినిపించకుండా చేస్తున్నావని శౌర్య అంటుంది.

Illu illalu pillalu: ఇంగ్లీష్ టీచర్ గా శ్రీవల్లి.. ప్రేమ, నర్మద ప్లాన్ సూపర్!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu ). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -345 లో... భాగ్యం, ఆనందరావు ఇద్దరు రామరాజు ఇంటికి శ్రీవల్లి డూప్లికేట్ సర్టిఫికేట్లు తీసుకొని వస్తారు. అవి ప్రేమ చూసి డూప్లికేట్ సర్టిఫికేట్లు అని చెప్పదు. ఇంకేంటి మావయ్య మీరు మీకు తెలిసిన కాలేజీ ప్రిన్సిపల్ కి ఫోన్ చెయ్యండి.. అక్క  ఇంగ్లీష్ టీచర్ గా జాయిన్ చెయ్యండి అని ప్రేమ అంటుంది. రామరాజు ఫోన్ చేస్తుంటే కావాలనే శ్రీవల్లి తుమ్ముతుంది. ఇప్పుడే వద్దు మావయ్య అంటుంది. అయినా రామరాజు వినకుండా ఫోన్ చేసి ప్రిన్సిపల్ తో మాట్లాడతాడు.