English | Telugu

Eto Vellipoyindhi Manasu : భర్త మాజీ ప్రేమికురాలు అని తెలుసుకున్న భార్య...

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్లిపోయింది మనసు'(Eto Vellipoyindhi Manasu ). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -281 లో.....సీతాకాంత్, రామలక్ష్మి లు వేరొక కంపెనీ హెడ్ రావడం కోసం వెయిట్ చేస్తుంటారు. అప్పుడే నందిని కూడా వస్తుంది. ఆ తర్వాత అతను రాగానే అందరు వెల్ కమ్ చెప్తారు. చెప్పాగానే మాతో కలిసి పని చెయ్యడానికి వచ్చినందుకు థాంక్స్ అని నందిని అనగానే.. సీతాకాంత్ లాంటి వరితో కలిసి వర్క్ చెయ్యడం హ్యాపీగా ఉంది.. అందుకు మీకే థాంక్స్ చెప్పాలని అతను అంటాడు. నందిని నీకు థాంక్స్ అని సీతాకాంత్ అనగానే.. నువ్వెప్పుడు ఉన్నతంగా ఉండాలనిదే నా కోరిక అనగానే నందిని వంక రామలక్ష్మి అదోలా చూస్తుంది.

ఆ తర్వాత అందరు మీటింగ్ కి వెళ్తుంటే.. నందిని స్లిప్ అవుతుంది. దాంతో నందిని అంటు సీతాకాంత్ కంగారు పడుతుంటాడు. అప్పుడే రామలక్ష్మి వచ్చి మీరు వెళ్ళండి నేను చూసుకుంటానని చెప్పగానే.. సీతాకాంత్ వెళ్ళిపోతాడు. ఆ తర్వాత పెయిన్ కిల్లర్ టాబ్లెట్ తీసుకొని వచ్చి రామలక్ష్మి ఇస్తుంది. మరొకవైపు మీరు చెప్పిన విషయం నందినికి రామలక్ష్మి చెప్తుందా అని శ్రీవల్లి అనగానే.. చెప్తే మనకేం ప్రాబ్లమ్ లేదని శ్రీలత అంటుంది. ఆ తర్వాత మీటింగ్ జరుగుతుంటే సీతాకాంత్ వంక నందిని చూడడం రామలక్ష్మి చూస్తుంది.ఆ తర్వాత రామలక్ష్మి మాట్లాడుతుంటే పోలమారుతుంది. దాంతో వాటర్ తాగు అని సీతకంత్ అంటాడు. దాంతో కావాలనే నందిని పొలమారినట్లు చెయ్యగానే సీతాకాంత్ తనకి వాటర్ ఇవ్వడంతో నా కంటే తనే ఎక్కువనా అన్నట్లు ఫీల్ అవుతుంది రామలక్ష్మి. ఆ తర్వాత మీటింగ్ ఒకే అయ్యాక ఇప్పుడు చాలా హ్యాపీగా ఉంది.. నాకు ఇష్టమైంది తినాలని ఉందన సీతాకాంత్ అంటాడు. మష్రూమ్ బిర్యానీ ఆర్డర్ చెయ్యాలా.. చేస్తానని నందిని అనగానే.. సరేనని సీతాకాంత్ అంటాడు. ఆ తర్వాత మా ఆయనకి ఇష్టమైంది మీకెలా తెలుసని నందినిని రామలక్ష్మి అడుగగా తను డైవర్ట్ చేస్తుంది..

ఆ తర్వాత రామలక్ష్మి అసలు విషయం తెలుసుకోవాలని సీతాకాంత్ ని నందిని గురించి అడుగుతుంది. మొదట తెలియదన్న తన పైన ఒట్టేసి చెప్పమనగా సీతాకాంత్ నందిని గురించి చెప్తాడు. కానీ ఇప్పుడు ఫ్రెండ్ అంతే అని చెప్తాడు. కానీ ఈ విషయం ఇంతవరకు చెప్పనందుకు రామలక్ష్మి ఫీల్ అవుతుంది. ఆ తర్వాత ధన ఫోన్ చూస్తూ.. సిరిని పట్టించుకోకుంటే రామలక్ష్మి వచ్చి కోప్పడుతుంది. ఆ తర్వాత రామలక్ష్మి గదిలోకి వెళ్లగానే సీతాకాంత్ వెనకాల నుండి వచ్చి బయపెడుతాడు. దాంతో రామలక్ష్మి చిరాకు పడుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Karthika Deepam2: వైరాతో జ్యోత్స్న డీలింగ్.. కార్తీక్ కి డౌట్!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -544 లో.....శౌర్యకి దీప భోజనం తినిపిస్తుంది. అది చూసి కొడుకు కోడలితో చెల్లి మాట్లాడుతలేనట్లు ఉందని అనసూయ అంటుంది. వాళ్లే దాక్కొని తిరుగుతున్నారని కాంచన అంటుంది. శౌర్య వెంట భోజనం తినమని దీప పరుగెడుతుంది. శౌర్య అలా అమ్మని పరిగెత్తించవచ్చా.. ఇప్పుడు అమ్మ కడుపులో బేబీ ఉంది కదా తనకి ఆయాసం వస్తుంది ఇకనుండి నువ్వే భోజనం చెయ్యాలని కాంచన అనగానే.. నువ్వు మంచి నానమ్మవి కాదు నిన్ను తాతయ్య దగ్గరికి పంపించాలి.. మా అమ్మ నాకు తినిపించకుండా చేస్తున్నావని శౌర్య అంటుంది.

Illu illalu pillalu: ఇంగ్లీష్ టీచర్ గా శ్రీవల్లి.. ప్రేమ, నర్మద ప్లాన్ సూపర్!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu ). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -345 లో... భాగ్యం, ఆనందరావు ఇద్దరు రామరాజు ఇంటికి శ్రీవల్లి డూప్లికేట్ సర్టిఫికేట్లు తీసుకొని వస్తారు. అవి ప్రేమ చూసి డూప్లికేట్ సర్టిఫికేట్లు అని చెప్పదు. ఇంకేంటి మావయ్య మీరు మీకు తెలిసిన కాలేజీ ప్రిన్సిపల్ కి ఫోన్ చెయ్యండి.. అక్క  ఇంగ్లీష్ టీచర్ గా జాయిన్ చెయ్యండి అని ప్రేమ అంటుంది. రామరాజు ఫోన్ చేస్తుంటే కావాలనే శ్రీవల్లి తుమ్ముతుంది. ఇప్పుడే వద్దు మావయ్య అంటుంది. అయినా రామరాజు వినకుండా ఫోన్ చేసి ప్రిన్సిపల్ తో మాట్లాడతాడు.