English | Telugu

Karthika Deepam 2: జ్యోత్స్నకి పారిజాతం వార్నింగ్.. కాంచన రిపోర్ట్స్ లో ఏం ఉందంటే..?

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam 2). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -556 లో... జ్యోత్స్న వల్లే కాశీ స్టేషన్ కి వెళ్ళాడని పారిజాతానికి కోపం వస్తుంది. దాంతో జ్యోత్స్న చెంప చెల్లుమనిపిస్తుంది పారిజాతం. గర్వం తలకి ఎక్కితే పర్వాలేదు కానీ ఒళ్ళంతా విషంలాగా మారిందని తనపై కోప్పడుతుంది పారిజాతం‌. అసలు ఇందులో కాశీని కావాలనే ఇరికించింది బావ. కాశీని పోలీసులు అరెస్ట్ చేయకుండా బావ చేయొచ్చు.. వాళ్లని ఆపొచ్చు కానీ బావ అలా చెయ్యలేదని పారిజాతాన్ని జ్యోత్స్న డైవర్ట్ చేస్తుంది.

ఆ తర్వాత శ్రీధర్ భోజనానికి వస్తున్నాడని అనసూయ అన్ని రెడీ చేస్తుంది. శ్రీధర్ గారు రావడం ఒక్కటే లేటు అని కాంచనతో అనసూయ అంటుంది. నాతో మీ నాన్నగారు అంటావ్.. దీపతో మావయ్యగారు అంటావ్.. మా అమ్మతో మాత్రం శ్రీధర్ గారు అని ఎందుకు అంటావని కార్తీక్ అంటాడు‌. ఏం అంటార్ దీప అని కార్తీక్ అనగానే.. మీ ఆయన అనాలని దీప చెప్తుంది. పిల్లల కోసం పారుని పెళ్లి చేసుకున్నాడు తాత. నా కోసం నువ్వు నాన్నతో భార్యగా ఉండలేవా అని కార్తీక్ అంటాడు.

అప్పుడే శ్రీధర్, కావేరి, స్వప్న ఎంట్రీ ఇస్తారు. సారీ పెద్దమ్మ ఇన్ని ప్రాబ్లెమ్స్ కి కారణం నేనే అని స్వప్న అనగానే నువ్వు ఏం చేసావని కాంచన అడుగుతుంది. కాశీని పెళ్లి చేసుకున్నాను కదా.. ముఖ్యంగా నా వల్ల దీప వదిన ఎక్కువ బాధపడిందని స్వప్న అంటుంది.

మరొకవైపు సుమిత్రకి కాళ్ళునొప్పులు ఉన్నాయని దశరథ్ కాళ్ళు మసాజ్ చేస్తాడు. అప్పుడే డాక్టర్ ఫోన్ చేస్తాడు. దాంతో దశరథ్ పక్కకి వెళ్లి మాట్లాడుతాడు. రేపు వచ్చి రిపోర్ట్స్ తీసుకోండి అలాగే డాక్టర్ మీతో మాట్లాడతారని చెప్పగానే ఏమైందో ఏమోనని దశరథ్ కి ఇంకా టెన్షన్ అవుతుంది.

మరొకవైపు అందరు భోజనం చేస్తుంటారు. అసలు కాశీ అలా అవ్వడానికి కారణం మీరేనని శ్రీధర్ తో కాంచన అంటుంది. మీరు మావయ్యగా వాడి మీద అధికారం చెలాయించాలనుకున్నారు.. వాడికి ఎలా ఉంటుందని కాంచన కోప్పడుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Podharillu : మహా, చక్రిలని వెతకడానికి రంగంలోకి దిగిన రౌడీలు.. ప్రతాప్ పట్టుకుంటాడా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -23 లో...మహా ఇంట్లో నుండి వెళ్లిపోతున్నట్లు లెటర్ రాసి బయటకు వచ్చి వాళ్ళ నాన్నని గుర్తుచేసుకొని ఏడుస్తుంది. ఎలాగోలా బయటకు వచ్చేస్తుంది మహా. ఆ తర్వాత చక్రి తీసుకొని వచ్చిన కార్ ఎక్కుతుంది. ముందు అ ఫోన్ నుండి సిమ్ తియ్యండి సిగ్నల్స్ ద్వారా ట్రేస్ చేస్తే ఎక్కడున్నామో తెలుస్తుందని చక్రి అనగానే అవునని సిమ్ తియ్యబోతుంటే భూషణ్ ఫోన్ చేస్తాడు. వీడికి బాకీ ఉన్న మాటలు బాగా ఉన్నాయని ఫోన్ లిఫ్ట్ చేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది. రేపు పెళ్లి పెట్టుకొని ఇలా మాట్లాడుతున్నావ్ ఏంటని భూషణ్ అంటాడు.

Jayam serial : గంగని టార్గెట్ చేసిన పారు.. రుద్ర గది నుండి బయటకు రాగలడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -162 లో... రుద్ర ఇంటికి రావడంతో శకుంతల కోప్పడుతుంది. ఆ గంగ అకాడమీలో స్టే చెయ్యడంతో ఈ ఇంటి పరువుపోతుంది వెంటనే తీసుకొని రమ్మని శకుంతల చెప్తుంది. రుద్ర తన నిర్ణయాన్ని పట్టించుకోడు. అ తర్వాత రుద్ర మళ్ళీ గంగ ఉన్న అకాడమీ దగ్గరున్న టీ షాప్ కి వెళ్లి కాసేపు ఆలోచిస్తాడు. ఇక గంగకి అకాడమీ వాళ్ళు ఏదైనా ఇబ్బంది పెడుతున్నారేమో అని ఆలోచించిన రుద్ర అక్కడ టీ షాప్ లో ఒక బుక్ తీసుకొని అకాడమీ కాంపౌండ్ దగ్గరికి వెళ్తాడు. గంగకి ఒక పేపర్ లో మెసేజ్ రాసి లోపలికి విసురుతాడు.

Illu illalu pillalu : అమూల్యకి పెళ్ళిచూపులు.. కామాక్షి ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -362 లో.. పెళ్లిచూపులకి ఇంకా రావడం లేదని రామరాజు వాళ్ళు ఎదురుచూస్తుంటే వాళ్ళు రారుగా అని శ్రీవల్లి మనసులో అనుకుంటుంది. అప్పుడే అబ్బాయి వాళ్ళు పెళ్లిచూపులకు ఎంట్రీ ఇస్తారు‌. దాంతో శ్రీవల్లి షాక్ అవుతుంది. భాగ్యం, ఆనందరావు కూడా వస్తారు. వాళ్ళు ఏం జరిగిందో శ్రీవల్లికి చెప్తారు. వాళ్ళు చెప్పాల్సింది మొత్తం అబ్బాయి వాళ్ల నాన్నకి చెప్తారు కానీ అతనికి చెవులు వినిపించవు.. వాళ్ల అమ్మ కి చెప్పేలోపు అటువైపు గా ప్రేమ, ధీరజ్ వెళ్లడం చూసి మళ్ళీ చెప్పలేకపోయామని శ్రీవల్లికి భాగ్యం చెప్తుంది.