English | Telugu

కప్పల పెళ్లి కోసం వైజాగ్ సముద్రాన్ని రాసిచ్చిన రాంప్రసాద్!

శ్రీదేవి డ్రామా కంపెనీ ప్రతీ వారంలాగే ఈ వారం కూడా అలరించింది. ఇక ఈ ఎపిసోడ్ లో కప్పల పెళ్లి అనే కాన్సెప్ట్ తో కడుపుబ్బా నవ్వించారు. ఆగష్టు వచ్చినా వర్షాలు లేక జనాలు ఎండలతో అవస్థలు పడుతున్నారు. ఇలాంటి వాతావరణం ఉన్నప్పుడు పల్లెటూళ్లలో కప్పలకు పెళ్లి చేస్తే వర్షాలు పడతాయని ఒక గట్టి నమ్మకం పూర్వ కాలం నుంచి ఉన్నదే. అదే కాన్సెప్ట్ తీసుకుని మగ కప్పగా నరేష్ ని, ఆడ కప్పగా పవిత్రను పెట్టి ఇద్దరికీ పెళ్లి చేశారు శ్రీదేవి డ్రామా కంపెనీ టీం.

ఇక ఈ కప్పల పెళ్లి మనషుల పెళ్లిలా గ్రాండ్ గా మంచి ఆటాపాటతో చేశారు. అంత్యాక్షరితో పాటు మంచి ఫోక్ సాంగ్స్ కూడా వినిపించారు. రమణ పాడిన ఫోక్ సాంగ్స్ కి స్టేజి అదిరిపోయింది. తర్వాత కండక్టర్ పాప ఝాన్సీ వచ్చి డాన్స్ ఇరగదీసేసింది. అలా కప్పల పెళ్ళికి వచ్చిన ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేసాక చదివింపుల కార్యక్రమం ఏర్పాటు చేసి ఫుల్ మస్తీ చేశారు.

ఆడ కప్పుకు రెండు లోతు బావులు, ఒక చెరువు, ఒక నీళ్ల తొట్టెను చదివించాడు హైపర్ ఆది. వైజాగ్ సముద్రాన్ని చదివించేసాడు ఆటో రాంప్రసాద్. వెంకీ మంకీస్ వాళ్ళ ఇంటి వెనక ఉన్న రెండు మురుక్కాలవలు, ఇమ్ము వాళ్ళ తొట్టెలో ఉండే నీళ్లు, ఇంటెనక కాల్వను చదివించాడు రాఘవ. ఇక చదివింపుల కార్యక్రమం పూర్తయ్యాక ఇద్దరి చేతా దండాలు మార్పించి పెళ్లి చేసేసారు. ఇలా ఈ వారం కప్పల పెళ్లి బాగా ఫన్ క్రియేట్ చేసింది.