English | Telugu

బిగ్‌బాస్‌ హౌస్‌లోనే కంటెస్టెంట్‌ అరెస్ట్‌... షాక్‌ అయిన నిర్వాహకులు!


ఈమధ్యకాలంలో ఎక్కువ ఆదరణ పొందిన రియాలిటీ షో బిగ్‌బాస్‌. ఈ షోకి సంబంధించి ఏ చిన్న అప్‌డేట్‌ వచ్చినా నెటిజన్లు ఎంతో ఆసక్తిగా దాన్ని ఫాలో అవుతారు. మొదట హిందీలో ఎక్కువ ప్రాచుర్యం పొందిన ఈ షోను ఇప్పుడు వివిధ భాషల్లో విస్తరించారు. ఇప్పుడు పలు భాషల్లో ఈ షో సందడి చేస్తోంది. ఇప్పుడు ఈ షోలో జరిగిన ఒక పరిణామం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. బిగ్‌బాస్‌ మొదలైనప్పటి నుంచి ఇప్పటివరకు జరగని ఓ ఘటన ఈ షోలో చోటు చేసుకుంది. అటవీ శాఖకు చెందిన కొందరు అధికారులు బిగ్‌ బాస్‌ హౌస్‌లోకి వెళ్ళి ఒక కంటెస్టెంట్‌ను అరెస్ట్‌ చేశారు. కన్నడ భాషలో నిర్వహిస్తున్న బిగ్‌బాస్‌లో ఈ ఉదంతం చోటు చేసుకుంది. పులిగోరు గొలుసును ధరించిన కంటెస్టెంట్‌ వర్తుర్‌ సంతోష్‌పై పలువురు ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన అటవీ శాఖ అధికారులు సంతోష్‌ను అదుపులోకి తీసుకున్నారు.

వన్యప్రాణి సంరక్షణ చట్టాన్ని ఉల్లంఘించినందుకు సంతోష్‌పై కేసు నమోదు చేశారు. అయితే డైరెక్ట్‌గా బిగ్‌బాస్‌ హౌస్‌కి అధికారులు వెళ్ళడం వెనుక ఓ కారణం ఉంది. సంతోష్‌పై ఫిర్యాదు అందిన వెంటనే అధికారులు అతన్ని తమకు అప్పగించాలని కోరారు. అయితే దీన్ని బిగ్‌బాస్‌ నిర్వాహకులు ఒప్పుకోలేదు. దీనిపై స్పందించిన అధికారులు వారికి సీరియస్‌గా వార్నింగ్‌ ఇవ్వడంతో నిర్వాహకులు వెనక్కి తగ్గారు. అప్పుడు బిగ్‌బాస్‌ హౌస్‌లోకి ఎంటర్‌ అయిన అధికారులు సంతోష్‌ను అదుపులోకి తీసుకున్నారు. అసలు పులిగోరు అతనికి ఎలా అందింది అనే విషయంపై ఆరా తీస్తున్నారు అధికారులు. త్వరలోనే కోర్టులో సంతోష్‌ను హాజరుపరిచే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇప్పటివరకు బిగ్‌బాస్‌ చరిత్రలోనే ఇలాంటి అరెస్ట్‌ ఘటన జరిగింది లేదు. దీనిపై నెటిజన్లు రకరకాల కామెంట్స్‌ పెడుతున్నారు.

Podharillu : మహా, చక్రిలని వెతకడానికి రంగంలోకి దిగిన రౌడీలు.. ప్రతాప్ పట్టుకుంటాడా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -23 లో...మహా ఇంట్లో నుండి వెళ్లిపోతున్నట్లు లెటర్ రాసి బయటకు వచ్చి వాళ్ళ నాన్నని గుర్తుచేసుకొని ఏడుస్తుంది. ఎలాగోలా బయటకు వచ్చేస్తుంది మహా. ఆ తర్వాత చక్రి తీసుకొని వచ్చిన కార్ ఎక్కుతుంది. ముందు అ ఫోన్ నుండి సిమ్ తియ్యండి సిగ్నల్స్ ద్వారా ట్రేస్ చేస్తే ఎక్కడున్నామో తెలుస్తుందని చక్రి అనగానే అవునని సిమ్ తియ్యబోతుంటే భూషణ్ ఫోన్ చేస్తాడు. వీడికి బాకీ ఉన్న మాటలు బాగా ఉన్నాయని ఫోన్ లిఫ్ట్ చేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది. రేపు పెళ్లి పెట్టుకొని ఇలా మాట్లాడుతున్నావ్ ఏంటని భూషణ్ అంటాడు.

Jayam serial : గంగని టార్గెట్ చేసిన పారు.. రుద్ర గది నుండి బయటకు రాగలడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -162 లో... రుద్ర ఇంటికి రావడంతో శకుంతల కోప్పడుతుంది. ఆ గంగ అకాడమీలో స్టే చెయ్యడంతో ఈ ఇంటి పరువుపోతుంది వెంటనే తీసుకొని రమ్మని శకుంతల చెప్తుంది. రుద్ర తన నిర్ణయాన్ని పట్టించుకోడు. అ తర్వాత రుద్ర మళ్ళీ గంగ ఉన్న అకాడమీ దగ్గరున్న టీ షాప్ కి వెళ్లి కాసేపు ఆలోచిస్తాడు. ఇక గంగకి అకాడమీ వాళ్ళు ఏదైనా ఇబ్బంది పెడుతున్నారేమో అని ఆలోచించిన రుద్ర అక్కడ టీ షాప్ లో ఒక బుక్ తీసుకొని అకాడమీ కాంపౌండ్ దగ్గరికి వెళ్తాడు. గంగకి ఒక పేపర్ లో మెసేజ్ రాసి లోపలికి విసురుతాడు.

Illu illalu pillalu : అమూల్యకి పెళ్ళిచూపులు.. కామాక్షి ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -362 లో.. పెళ్లిచూపులకి ఇంకా రావడం లేదని రామరాజు వాళ్ళు ఎదురుచూస్తుంటే వాళ్ళు రారుగా అని శ్రీవల్లి మనసులో అనుకుంటుంది. అప్పుడే అబ్బాయి వాళ్ళు పెళ్లిచూపులకు ఎంట్రీ ఇస్తారు‌. దాంతో శ్రీవల్లి షాక్ అవుతుంది. భాగ్యం, ఆనందరావు కూడా వస్తారు. వాళ్ళు ఏం జరిగిందో శ్రీవల్లికి చెప్తారు. వాళ్ళు చెప్పాల్సింది మొత్తం అబ్బాయి వాళ్ల నాన్నకి చెప్తారు కానీ అతనికి చెవులు వినిపించవు.. వాళ్ల అమ్మ కి చెప్పేలోపు అటువైపు గా ప్రేమ, ధీరజ్ వెళ్లడం చూసి మళ్ళీ చెప్పలేకపోయామని శ్రీవల్లికి భాగ్యం చెప్తుంది.