English | Telugu

Jayam serial: తనపై పడ్డ నిందని అబద్ధమని గంగ నిరూపించుకుంటుందా?

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -154 లో... గంగ బస్తీలో ఉండే శేఖర్, శకుంతల వాళ్ళ ఇంట్లోకి వస్తాడు. గంగకి ట్రైప్యాడ్ ఇచ్చింది నేనే అని చెప్పగానే అందరు షాక్ అవుతారు. ఏంటి అన్న అలా నా గురించి అబద్ధం చెప్తున్నావ్.. నన్ను నీ సొంత చెల్లిగా చూసావ్, ఇలా ఎలా అబద్ధం చెప్తున్నావని గంగ అడుగుతుంది. అతను నిజమే చెప్పాడు కదా మరి ఎందుకు అతన్ని భయపెడుతున్నావని ఇషిక అంటుంది.

ఆ తర్వాత శేఖర్ అక్కడ నుండి వెళ్ళిపోయాక గంగ అతని వెనకాలే వెళ్లి ఎందుకన్నా అబద్ధం చెప్పావని అడుగుతుంది. గంగ అతన్ని అబద్ధం చెప్పమని రిక్వెస్ట్ చేస్తూ ఉండొచ్చు ఒకసారి వెళ్తే బెటర్ అని ఇషిక బయటకు వెళ్తుంది. ఎందుకు అతన్ని బ్లాక్ మెయిల్ చేస్తున్నావని గంగని ఇషిక అడుగుతుంది.

సూర్య, స్నేహ, వంశీ వచ్చి ఎవరో ఒకతను వచ్చి వదిన గురించి ఏదో చెప్తే నమ్మేస్తారా అంటారు. నేను చెప్పింది నిజమేనని చెప్పి శేఖర్ అక్కడ నుండి వెళ్ళిపోతాడు. గంగ లోపలికి వచ్చి.. నేను ఏ తప్పు చెయ్యలేదు.. అతను ఎందుకు అలా చెప్పాడో ఇప్పటికి అర్థం అవ్వడం లేదని గంగ ఇంట్లో వాళ్ళతో అంటుంది.

సర్ నేను తప్పు చేసానంటే మీరు నమ్ముతున్నారా అని రుద్రతో గంగ అంటుంది. నోరు ముయ్ ముందు ఆ ఏడుపు ఆపు.. తప్పు చెయ్యనప్పుడు ఎందుకు అలా ఏడవడమని రుద్ర అనగానే అంటే తను ఏం తప్పు చెయ్యలేదని నమ్ముతున్నావా అని వీరు అనగానే అవును నమ్ముతున్నాను.. ఎందుకు అంటే షీ ఈజ్ మై వైఫ్ అని రుద్ర అంటాడు. మొదటి నుండి అన్ని చూస్తే గంగని ఎవరో టార్గెట్ చేసారని అర్థం అవుతుందని గంగ కి సపోర్ట్ గా రుద్ర మాట్లాడుతాడు.

తప్పు చేసినట్లు క్లియర్ గా కనిపిస్తుంది అయినా నీ మాటలు ఎందుకు నమ్మాలి. నీకు ఇరవై నాలుగు గంటలు టైమ్ ఇస్తున్న ఆలోపు నీపై పడ్డ నింద.. నిజం కాదని నిరూపించాలి లేదంటే ఇంట్లో ఉండవని శకుంతల అనగానే దానికి గంగ ఒప్పుకుంటుంది.

ఆ తర్వాత గంగ వచ్చి బాధపడుతుంటే రుద్ర వచ్చి మంచిగా థింక్ చెయ్ ఏదో ఒక దారి దొరుకుతుందని అంటాడు. గంగకి ఏం చేయాలో అర్థం కాదు. రుద్ర దగ్గరుండి గంగకి సలహా ఇస్తాడు. ఆ తర్వాత ఇషిక, వీరు, పారు ముగ్గురు మాట్లాడుకుంటారు. శేఖర్ ని ఎలా బ్లాక్ మెయిల్ చేసి రప్పించారో ఇషిక, వీరు కలిసి పారుకి చెప్తారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Jayam serial : గంగ, రుద్ర పూజలో కూర్చుంటారా.. పారు ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -164 లో..... రుద్ర ఏ విధంగా గంగకి హెల్ప్ చేసాడో అందరికి చెప్తాడు. పాపం పెద్దమ్మ హర్ట్ అయినట్లు ఉందని వంశీ అనగానే అయితే అవనివ్వులే గంగ సేఫ్ అయిందని పెద్దసారు అంటాడు. మరొకవైపు పారు ఫ్రెండ్స్ ని అకాడమీ మేడమ్ సస్పెండ్ చేస్తుంది. దాంతో నువ్వు సస్పెండ్ ఆపకపోతే నువ్వే ఇదంతా చేసావని మేడమ్ కి చెప్తానని పారు ఫ్రెండ్ పారుతో అంటుంది. దాంతో మేడమ్ ని సస్పెండ్ క్యాన్సిల్ చెయ్యమని రిక్వెస్ట్ చేస్తుంది పారు. తప్పు ఒప్పుకుంటున్నారు కదా ఈ ఒక్కసారి క్షమించండి అని మేడమ్ తో గంగ అనగానే తను సరే అని సస్పెన్షన్ క్యాన్సిల్ చేస్తుంది.

ఆ మీమ్ నన్ను చాలా డిస్టర్బ్ చేసింది...సావండి అంటున్న నైనికా అనసుర

నైనికా అనసురు బుల్లితెర మీద అందరికీ పరిచయమే. బిగ్ బాస్ సీజన్ 8 ద్వారా బాగా ఫేమస్ అయ్యింది. అలాగే ఢీ డాన్స్ షోలో డాన్స్ ద్వారా బాగా పాపులర్ అయ్యింది. ఇక ఇప్పుడు బిబి జోడి సీజన్ 2 లో అమరదీప్ కి జోడిగా చేస్తోంది. అలాంటి నైనికా రీసెంట్ గా తన ఇన్స్టాగ్రామ్ స్టేటస్ లో ఘాటుగా ఒక పోస్ట్ పెట్టింది. "ఎలాంటి పని లేకుండా జస్ట్ కూర్చుని అమ్మాయిల చిత్రాలను ఘోరంగా ఎడిట్ చేస్తూ వాళ్ళను హరాస్ చేసే ఒక స్టుపిడ్ మీమ్ పేజీలో పోస్ట్ చేసిన నా చిత్రాలు నన్ను చాలా డిస్టర్బ్ చేశాయి. మీకు పని లేదు బ్రో, మాకు మిమ్మల్ని పట్టించుకునేంత టైం లేదు. నువ్వు మా మీద పోస్ట్లు పెడుతున్నావ్ అంటే నువ్వు నీలోనే తోపు ఐనట్టే..మీ పేరెంట్స్ నిన్ను బాగా పెంచారు. మీలాంటి వాళ్ళే రేపు రేపిస్టుల్లా తయారవుతారు.