English | Telugu

ఆర్పీ మీద కౌంటర్ ఎటాక్ తో జాతిరత్నాలు!

జబర్దస్త్ నుంచి వెళ్ళిపోయినా కిర్రాక్ ఆర్పీ చాలా రోజుల తర్వాత ఆ మల్లెమాల సంస్థ గురించి అక్కడి ప్రొడక్షన్ ఫుడ్ గురించి చేసిన కామెంట్స్ అన్నీ సోషల్ మీడియాలో వైరల్ గా మారిన విషయం తెలిసిందే. కొంతమంది ఆర్పీ కామెంట్స్ ని సపోర్ట్ చేస్తే ఇంకొంతమంది మాత్రం ఆర్పీ కి కౌంటర్ ఎటాక్స్ కూడా ఇచ్చారు. ఇలా ఈ కాంట్రవర్సీ ఎలా గోలా కాస్త సద్దుమణిగినట్లు కనిపించింది. ఐతే ఇప్పుడు ఇదే థీమ్ తో జాతిరత్నాలు షోలో ఒక స్పూఫ్ చేశారు. ఈ స్పూఫ్ లో పంచ్ ప్రసాద్, నూకరాజు, ఇమ్మానుయేల్, శ్రీముఖి పార్టిసిపేట్ చేశారు. ఈ నలుగురు రౌండ్ టేబుల్ లా కూర్చుని డిబేట్ కార్యక్రమం నడిపిస్తారు.

"మీకు ఆరోగ్యం బాగోనప్పుడు మీరు ఏదైతే సంస్థలో పని చేస్తున్నారో ఆ సంస్థ మీకు నిజంగానే అన్యాయం చేసిందా అంటూ ఇమ్మానుయేల్ ప్రసాద్ ని అడుగుతాడు" మీకనే కాదు అందరికీ ఈ విషయం గురించి చెప్పాలి అంటూ ప్రసాద్ తన ఎక్స్పీరియన్స్ ని చెప్పబోతాడు . ఐతే అతను మాట్లాడిన మాటల్ని కట్ చేసేస్తారు. తర్వాత నూకరాజు వచ్చి "మీరు చేసే సంస్థలో ఫుడ్ బాగోదని టాక్ నడుస్తోంది..దీని గురించి మీరేం చెప్తారు అని ప్రసాద్ ని అడుగుతాడు. ఇలా ఈ డిబేట్ చాలా ఘాటుగా జరిగినట్టు ప్రోమో చూస్తే అర్థమైపోతుంది. ఆర్పీ మీద ఎలాంటి కౌంటర్లు వేశారు ? అనే విషయం తెలియాలంటే ఈరోజు ప్రసారమయ్యే ఎపిసోడ్ చూస్తే అర్థమైపోతుంది. ఐతే మల్లెమాల ఇలా ఆర్పీకి మళ్ళీ గట్టిగా కౌంటర్లు ఇవ్వడానికి స్కిట్స్ వేయిస్తోందనే విషయం అర్థమౌతోంది. మరి ఆర్పీ ఈ స్కిట్ చూసి ఎలా రియాక్ట్ అవుతాడో ? అసలు రియాక్ట్ అవుతాడో లేదో చూడాలి.

Karthika Deepam2: వైరాతో జ్యోత్స్న డీలింగ్.. కార్తీక్ కి డౌట్!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -544 లో.....శౌర్యకి దీప భోజనం తినిపిస్తుంది. అది చూసి కొడుకు కోడలితో చెల్లి మాట్లాడుతలేనట్లు ఉందని అనసూయ అంటుంది. వాళ్లే దాక్కొని తిరుగుతున్నారని కాంచన అంటుంది. శౌర్య వెంట భోజనం తినమని దీప పరుగెడుతుంది. శౌర్య అలా అమ్మని పరిగెత్తించవచ్చా.. ఇప్పుడు అమ్మ కడుపులో బేబీ ఉంది కదా తనకి ఆయాసం వస్తుంది ఇకనుండి నువ్వే భోజనం చెయ్యాలని కాంచన అనగానే.. నువ్వు మంచి నానమ్మవి కాదు నిన్ను తాతయ్య దగ్గరికి పంపించాలి.. మా అమ్మ నాకు తినిపించకుండా చేస్తున్నావని శౌర్య అంటుంది.

Illu illalu pillalu: ఇంగ్లీష్ టీచర్ గా శ్రీవల్లి.. ప్రేమ, నర్మద ప్లాన్ సూపర్!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu ). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -345 లో... భాగ్యం, ఆనందరావు ఇద్దరు రామరాజు ఇంటికి శ్రీవల్లి డూప్లికేట్ సర్టిఫికేట్లు తీసుకొని వస్తారు. అవి ప్రేమ చూసి డూప్లికేట్ సర్టిఫికేట్లు అని చెప్పదు. ఇంకేంటి మావయ్య మీరు మీకు తెలిసిన కాలేజీ ప్రిన్సిపల్ కి ఫోన్ చెయ్యండి.. అక్క  ఇంగ్లీష్ టీచర్ గా జాయిన్ చెయ్యండి అని ప్రేమ అంటుంది. రామరాజు ఫోన్ చేస్తుంటే కావాలనే శ్రీవల్లి తుమ్ముతుంది. ఇప్పుడే వద్దు మావయ్య అంటుంది. అయినా రామరాజు వినకుండా ఫోన్ చేసి ప్రిన్సిపల్ తో మాట్లాడతాడు.