Read more!

English | Telugu

వాళ్ళిద్దరి ప్లాన్ సక్సెస్.. కలిసి భోజనం చేసిన రిషి, వసుధార!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ ఎంతో మంది ప్రేక్షకుల మనసు గెలుచుకుంది. కాగా ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్‌-717 లో.. రిషి కాలేజీకి వచ్చి వసుధార క్యాబిన్ లోని పోస్టర్ చూస్తాడు. అప్పుడే వసుధార తన క్యాబిన్ దగ్గరికి వచ్చి.‌ "మే ఐ కమిన్ సర్" అని అడుగగా..

ఇది నీ క్యాబినే కదా అడిగి రావాలా అని రిషి అంటాడు.  మీరు ఎండీ కదా అని వసుధార అంటుంది. ఆ తర్వాత రిషి వెళ్ళిపోతుంటే.. ఈ క్యాబిన్ లోకి ఎందుకు వచ్చారో తెలుసుకోవచ్చా సర్ అని వసుధార అడుగగా.. మెసెజ్ చేస్తానని చెప్పి రిషి అక్కడ నుండి వెళ్ళిపోతాడు.

ఆ తర్వాత దేవయాని ఇంట్లోని డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని..  ధరణిని వడ్డించమని పిలుస్తుంది. ధరణి వచ్చి చాలా రకాల కూరలు డైనింగ్ టేబుల్ దగ్గరికి తీసుకొస్తుంది.  అవన్నీ చూసిన దేవయాని ఇన్ని ఎందుకు చేసావని ధరణిని అడిగితే.. వసుధార చకచకా అన్ని పనులు చేసి, వంట చేసిందని ధరణి చెప్తుంది. మరి నువ్వేం చేస్తున్నావని దేవయాని అడుగగా.. అదేంటి అత్తయ్య దానికి వంట చేయడానికి హక్కు ఉంది కదా అని ధరణి అంటుంది. ఏంటి ధరణి కొత్తగా హక్కల గురించి మాట్లాడుతున్నావ్.. ఒక్కరాత్రిలోనే ఇంత నేర్చుకున్నావా అని దేవయాని అంటుంది.

కాలేజీలో జగతి, మహేంద్రలు మాట్లాడుకుంటారు. మిషన్ ఎడ్యుకేషన్ గురించి వసుధారతో మాట్లాడాలని జగతి చెప్పగా.. ఎప్పుడు కాలేజీ, మిషన్ ఎడ్యుకేషనేనా వేరే ఏవైనా ప్లాన్ ఉంటే చెప్పమని మహేంద్ర అంటాడు. వేరే ప్లాన్ అంటే అని జగతి అడుగగా.. రిషి, వసుధారలని ఎలా కలపాలో మనం ప్లాన్ చేయాలని చెప్తాడు. ఇద్దరు కలిసి భోజనం చేసేలా చేద్దామని చెప్పి జగతి వసుధారకి కాల్ చేసి.. "నేను మహేంద్ర కలిసి బయటకు వెళ్తున్నాం మా కోసం చూడొద్దు మీరు తినేయండి" అని చెప్తుంది. ఆ తర్వాత మహేంద్ర కూడా అలాగే రిషికి చెప్తాడు. వాళ్ళిద్దరు ప్లాన్ చేసిన్నట్టుగానే.. రిషి వసుధారకి కాల్ చేసి భోజనం చేద్దామని పిలుస్తాడు. ఆ తర్వాత రిషి, వసుధార కలిసి భోజనం చేస్తారు. భోజనం‌ చేస్తుండగా ఈ రోజు వంట అదిరిపోయిందని రిషి చెప్తాడు.  వసుధార తన మనసులో "ధట్ ఈజ్ వసుధార " అని అనుకుంటుంది. తన వంట బాగుందని రిషి మెచ్చుకోలేదని ఫీల్ అవుతుంది వసుధార. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.