English | Telugu

పేషెంట్ కి దిష్టి తీసి పంపించిన డాక్టర్! 

జబర్దస్త్ షో ఆడియన్స్ ని తెగ అలరిస్తోంది. మధ్యలో కొన్ని ఇష్యూస్ వచ్చినా అన్ని సర్దుకుని ఇప్పుడు మళ్ళీ పాత అందం సంతరించుకుంది అని చెప్పొచ్చు. ఇక ఇప్పుడు వినాయక చవితి సందర్భంగా రాబోయే వారం స్కిట్స్ అన్నీ కూడా చక్కగా అలరించబోతున్నాయి. ఈ షో లేటెస్ట్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఖుష్బూ, ఇంద్రజ, రష్మీ కలిసి గణేశుడి విగ్రహాన్ని స్టేజి మీదకు తెచ్చి పూజ చేసి ప్రసాదాలు పంచేశారు. ఇక తరువాత స్కిట్ లోకి రాఘవ టీం ఎంట్రీ ఇచ్చేసాడు. రాఘవ ఒక చిన్న క్లినిక్ పెట్టి నడుకుంటున్నాడు. "కడుపు నొప్పి వస్తే రండి తీసి పంపించేస్తాను, తలనొప్పి వస్తే రండి తీసి పంపిస్తాను అంటూ అనౌన్స్ చేస్తాడు.

ఇంతలో మోకాళ్ళ నొప్పులతో ఒక పేషెంట్ వస్తాడు. గబగబా వెళ్లి ఎండుమిరపకాయలు ఉప్పు తెచ్చి ఆ పేషెంట్ కి దిష్టి తీస్తాడు. ఇంతలో లోపలి నుంచి రాఘవ భార్య వస్తుంది. ట్రీట్మెంట్ టైంలో ఇక్కడికి రావద్దు అన్నా కదా అని భార్య మీద అరుస్తారు. ఇంట్లో నిమ్మకాయలు, ఎండుమిరపకాయలు, ఉప్పు ఇక్కడ క్లినిక్ లో పెట్టుకుంటే ఇంట్లో వంటెలా చేసేదంటూ అరుస్తుంది.

ఇంతలో ఆ తిట్లను కవర్ చేసుకోవడానికి జడ్జెస్ ఏంటి అంత డల్ గా ఐపోయారని అనేసరికి దృష్టి అంటూ ఖుష్బూ అంటారు . వెంటనే రాఘవ సాంబ్రాణి పట్టుకెళ్లి ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి ఎక్స్ట్రా దిష్టి పోవాలి" అంటూ మంచి ఫన్ క్రియేట్ చేస్తాడు.

Brahmamudi Serial : దుగ్గిరాల కుటుంబం హ్యాపీ.. రుద్రాణి కన్నింగ్ ప్లాన్ అదేనా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ బ్రహ్మముడి (Brahmamudi). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్-931 లో.. మినిస్టర్ కి పాప పుడుతుంది. ఆపరేషన్ తర్వత డాక్టర్ బయటకు వస్తాడు. మీకు పాప పుట్టింది అని డాక్టర్ అనగానే.. మినిస్టర్ ఫుల్ హ్యాపీగా ఉంటాడు. కానీ పాపకి ఒక ప్రాబ్లమ్ ఉందని డాక్టర్ చెప్తాడు. ఏ ప్రాబ్లమ్ ఉన్నా ఆపరేషన్ చేయించండి.. ఎంతమంది డాక్టర్ లు ఐనా , ఎక్కడి నుంచి అయినా తీసుకొచ్చి అయినా ఆపరేషన్ చేపించండి అని మినిస్టర్ అనగానే.. ఇప్పుడు చేయకూడదు.. పాప వెయిట్ తక్కువ ఉంది.. పాప పెరిగాక ఆపరేషన్ చేయాలని డాక్టర్ చెప్తాడు. వాళ్ళిద్దరూ మాట్లాడుకునేదంతా రుద్రాణి చూస్తుంది.

Illu illalu pillalu Serial:  అమూల్య ఎంగేజ్ మెంట్ ఆపడానికి భద్రవతి ప్లాన్.. భాగ్యం ఏం చేయనుంది!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు (Illu illalu pillalu). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్-370 లో.. దేవుడా ఏ ఆటంకం లేకుండా ఈ నిశ్చితార్థం సవ్యంగా జరిగేలా చూడు అని దేవుడికి మొక్కుకుంటుంది వేదవతి. అప్పుడే దేవుడి దగ్గరున్న దీపాలు ఆరిపోతాయి. అయ్యో ఇదేంటి దీపాలు ఆరిపోయాయేంటని వేదవతి టెన్షన్ పడుతుంది. మరోవైపు కామాక్షి భర్త కోసం గుమ్మం దగ్గర ఎదురుచూస్తుంటుంది. అప్పుడే తిరుపతి చూస్తాడు. ఏంటమ్మా అని అడుగుతాడు. మా ఆయన కోసం ఎదురుచూస్తున్నానని కామాక్షి చెప్తుంది. అప్పుడే కామాక్షి భర్త ఆటోలో ఎంట్రీ ఇస్తాడు.