English | Telugu

జబర్దస్త్ కమెడియన్ రీతూ చౌదరి ఇంట్లో విషాదం!

జబర్దస్త్ లేడీ కమెడియన్ రీతూ చౌదరి గురించి అందరికీ తెలుసు..టిక్ టాక్ స్టార్ గా అందరికీ పరిచయమే. ఆమెకు సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది. ప్రస్తుతం ఈమె ఇంట్లో విషాదం నెలకొంది.

గుండెపోటుతో ఆమె తండ్రి తుదిశ్వాస విడిచారు. విషయం తెలుసుకున్న ఆడియన్స్, జబర్దస్త్ కమెడియన్స్ అంతా దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. తండ్రి మృతిపై రీతూ చౌదరి భావోద్వేగానికి గురయ్యింది. తన తండ్రిని తలుచుకుంటూ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చేసింది. తండ్రితో కలిసున్న ఫొటోని ఇన్ స్టాగ్రామ్ స్టేటస్ లో పెట్టి.. “నాన్న నిన్ను చాలా మిస్ అవుతున్నాను. ఈ ఫొటో తీసుకునే సమయంలో ఇలా పోస్ట్ చేయాల్సి వస్తుందని నేను అనుకోలేదు. నీతో తీసుకున్న లాస్ట్ ఫొటో ఇదే నాన్న. నన్ను ఎలా వదిలి వెళ్ళిపోయావు నాన్నా? నువ్వు లేకుండా నేను ఉండలేను. డాడీ ప్లీజ్ తిరిగిరా నీ కూతురు దగ్గరికి” అంటూ రీతూ చౌదరీ పెట్టిన ఎమోషనల్ పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

రీతూ చౌదరికి తన నాన్న అంటే చాలా ఇష్టం అని తమ మధ్య ఎంతో మంచి బాండింగ్ ఉందని ఎన్నో సందర్భాల్లో చెప్పింది. ఇంట్లో అందరి కంటే నాన్న అంటేనే చాలా ఇష్టం. ఏ విషయమైనా సరే ఆయనతోనే పంచుకుంటుంది. అలాంటిది రీతూ ఇప్పుడు తన తండ్రి లేరనే విషయాన్ని తట్టుకోలేకపోతోంది. జబర్దస్త్ కమెడియన్స్, రీతూ ఫాన్స్ , నెటిజన్స్ అంతా కూడా ఆమె తండ్రి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నారు.

Karthika Deepam2 : కాశీ అకౌంట్ లో అయిదు లక్షలు.. స్వప్న చూసి షాక్!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -551 లో..... కాంచన అన్న మాటలకి శ్రీధర్ బాధపడుతాడు. తినడం మానేస్తాడు. కార్తీక్ వచ్చి నాన్న భోజనం చెయ్యమని తినిపిస్తుంటే ముద్ద దిగడం లేదురా అని ఏడుస్తాడు. ఎందుకు అమ్మ ఇవన్నీ ఇప్పుడు.. ఎప్పటిలాగే మాట్లాడుకోవచ్చు కదా అని కార్తీక్ అంటాడు. నేను కావేరి తరుపున వచ్చాను.. తను ఫోన్ చేసి భయపడుతుంటే చూడలేక వచ్చానని చెప్తుంది. దాంతో శ్రీధర్ బాధపడుతూ అక్కడ నుండి వెళ్ళిపోతాడు. ఇక కాంచనని కార్తీక్ తీసుకొని అక్కడ నుండి వెళ్ళిపోతాడు.