English | Telugu

Illu illalu pillalu : భాగ్యం ప్లాన్ ని శ్రీవల్లి అమలుచేసేనా.. వేదవతితో సహా అందరు షాక్!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు' (Illu illalu pillalu). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్-143 లో... చందు, శ్రీవల్లీలకి శోభనం జరిపించాలని రామరాజుకి వేదవతి చెప్తుంది. అలాగే ఏర్పాటు చేయించు, మన పెద్దోడికి మంచి భార్య దొరికిందని రామరాజు ఎమోషనల్ అవుతాడు. పనిలో పని నర్మద, సాగర్ లకి కూడ శోభనం ఏర్పాట్లు చేద్దామని వేదవతి అడుగగా.. సరేనని రామరాజు అంటాడు. వేదవతి హ్యాపీగా ఫీల్ అవుతుంది.

ఆ తర్వాత తిరుపతి, ధీరజ్ ఇద్దరు శోభనం ఏర్పాట్లు చేస్తుంటారు. గదిని డెకరేషన్ చేస్తారు. ఒకవైపు చందు, సాగర్ రెడీ అవుతారు. ఇన్ని రోజులు మీరెందుకు దూరం గా ఉన్నారని సాగర్ ని చందు అడుగుతాడు. మేం నీకంటే ముందు పెళ్లి చేసుకొని తప్పు చేసాం.. ఇక పిల్లల్ని కంటే ఇంకా తప్పవుతుంది. అందుకే నీకు పెళ్లి అయ్యేవరకు దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నామని సాగర్ అంటాడు. కామాక్షి, అమూల్య ఇద్దరు శ్రీవల్లి నర్మదలని రెడీ చేస్తారు. శ్రీవల్లి కంటే నర్మద బాగుందని కామాక్షి అంటుంది. దాంతో శ్రీవల్లి బాధపడుతూ వెళ్లి భాగ్యంకి ఫోన్ చేసి జరిగిందంతా చెప్తుంది. అయిన వాళ్ళకి ఇప్పుడు శోభనం ఏంటి ఆపేయ్ వాళ్ళ కంటే ముందు నువ్వు పిల్లలని కను అని ఏదో భాగ్యం ప్లాన్ చెప్తుంది. దానికి శ్రీవల్లి సరే అంటుంది.

ఆ తర్వాత రామరాజు, వేదవతి దగ్గరికి శ్రీవల్లి వచ్చి.. మా శోభనం కాన్సిల్ చెయ్యండి సాగర్, నర్మదలకి జరిపించండి అని శ్రీవల్లి అంటుంది. ఎందుకు అలా అంటున్నవ్ అని వేదవతి అడుగుతుంది. ఒకే ఇంట్లో రెండు జంటలకి శోభనం ఒకే రోజు జరగొద్దు అంట అని శ్రీవల్లి అంటుంది. దాంతో అందరు ఆశ్చర్యంగా చూస్తారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Jayam serial : బాక్సింగ్ పోటీలో మిస్సెస్ గంగ రుద్ర ప్రతాప్.. పారు ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -160 లో..... గంగని ఎలాగైనా అకాడమీ సెలక్షన్ కి వెళ్లకుండా ఆపాలని ఇషిక, వీరు ట్రై చేస్తారు కానీ గంగ, రుద్ర ఇద్దరు కలిసి ఇంట్లో అన్ని పనులు పూర్తి చేసి అకాడమీకి వెళ్తారు. రుద్ర అకాడమీ బయటే ఉంటాడు. నాకు సంబంధించిన కేసు ఇంకా పెండింగ్ లో ఉంది అలా ఉండగా.. నేను లోపలకు రాకూడదని రుద్ర బయటే ఉండి గంగకి అంతా వివరిస్తాడు. నేను నీ పేరు మైక్ లో రావడం వినాలని రుద్ర అంటాడు. గంగ లోపలకు వెళ్తుంది. అక్కడ పారు ఇంకా తన ఫ్రెండ్స్ కలిసి గంగని చులకనగా మాట్లాడుతారు.

Brahmamudi : రుద్రాణిని రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన కనకం!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -922 లో.. ఒకతను వచ్చి రుద్రాణికి మళ్ళీ పసరు మందు ఇస్తాడు. ఆ పసరు మందు పని చేస్తుందా లేదా అని రుద్రాణి అతన్ని అడుగుతుంది. పని చేస్తుందని అతను చెప్తాడు. దాంతో రుద్రాణి పసరు మందు తీసుకొని లోపలికి వెళ్తుంటే అప్పుడే కనకం ఎదురుపడుతుంది. కనకాన్ని చూసి రుద్రాణి టెన్షన్ పడుతుంది. చేతిలో అదేంటీ అని కనకం అనగానే ఇదా.... నాకే పసరు మందు అజీర్తికి వాడమని చెప్పారని చెప్పి రుద్రాణి వెళ్ళిపోతుంది. అలా అయితే ఇంత రాత్రివేళ తీసుకొని వెళ్తుంది ఏంటని కనకంకి డౌట్ వస్తుంది.