English | Telugu

Illu illalu pillalu : ఇడ్లీలు అమ్ముతూ కన్పించిన శ్రీవల్లి నాన్న.. మరి ఆ పది లక్షలు?

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -201 లో... ధీరజ్ ని తీసుకొని ప్రేమ గుడికి వస్తుంది. అక్కడ పంతులు మంచిమాటలు చెప్తుంటే.. ప్రేమ వింటూ ఉంటుంది. నేను ఎలాగైనా.. ఎవరు ఏమన్నా కూడా ధీరజ్ కి సాయంగా ఉండాలని ప్రేమ అనుకుంటుంది. ధీరజ్ దగ్గరికి వెళ్లి రెండు వేల్లు చూపించి ఒక వేలిని పట్టుకోమంటుంది. ధీరజ్ పట్టుకుంటుంటాడు.. థాంక్స్ రా అని ప్రేమ అనగానే ఇదివరకు ఇలాగే చేసి ఇంట్లో గొడవకి కారణం అయ్యావ్.. ఇప్పుడు ఏం చేస్తున్నావని ధీరజ్ అనగానే ఏం లేదని ప్రేమ అంటుంది.

ఆ తర్వాత మీ అమ్మ వాళ్ళింటికి వెళదాం పదా.. పది లక్షల గురించి అడగాలని శ్రీవల్లితో చందు అంటాడు. మా వాళ్ళు ఊళ్ళో లేరని శ్రీవల్లి అనగానే చందు కోపంగా వెళ్లిపోతాడు. అదంతా నర్మద విని శ్రీవల్లి దగ్గరికి వచ్చి అడుగుతుంది. ఏంటి మ్యాటర్ పది లక్షలు ఏంటని అడుగుతుంది. మొగుడు పెళ్ళాం మాట్లాడుకుంటే వింటున్నావా.. బుద్ది లేదా అంటూ శ్రీవల్లి కోప్పడుతుంది. మరొకవైపు ప్రేమ డాన్స్ క్లాస్ చెప్పాలని నిర్ణయం తీసుకొని వెళ్తుంది. పిల్లలకి డాన్స్ నేర్పిస్తుంటుంది.

అప్పుడే నర్మద ఫోన్ చేసి అర్జెంట్ గా మాట్లాడాలని రమ్మని చెప్తుంది. కాసేపటికి నర్మదని ప్రేమ కలుస్తుంది చందు, శ్రీవల్లి మాట్లాడుకున్నది మొత్తం చెప్తుంది. అసలు వాళ్ళ ఫ్యామిలీ గురించి కనుక్కోవాలని ప్రేమ, నర్మద అనుకుంటారు. అలా వెళ్తుంటే దారిలో శ్రీవల్లి వాళ్ళ నాన్న ఆనందరావు రోడ్డుపై ఇడ్లీ అమ్ముతూ కనిపిస్తాడు. ప్రేమ, నర్మదని ఆనందరావు చూసి షాక్ అవుతాడు. తరువాయి భాగంలో ప్రేమ, నర్మద ఇంటికి వచ్చి.. శ్రీవల్లి అక్క మీ నాన్న ఇడ్లీ అమ్ముతు కన్పించాడని చెప్పగానే అందరు షాక్ అవుతారు. శ్రీవల్లి టెన్షన్ పడుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Jayam serial : బాక్సింగ్ పోటీలో మిస్సెస్ గంగ రుద్ర ప్రతాప్.. పారు ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -160 లో..... గంగని ఎలాగైనా అకాడమీ సెలక్షన్ కి వెళ్లకుండా ఆపాలని ఇషిక, వీరు ట్రై చేస్తారు కానీ గంగ, రుద్ర ఇద్దరు కలిసి ఇంట్లో అన్ని పనులు పూర్తి చేసి అకాడమీకి వెళ్తారు. రుద్ర అకాడమీ బయటే ఉంటాడు. నాకు సంబంధించిన కేసు ఇంకా పెండింగ్ లో ఉంది అలా ఉండగా.. నేను లోపలకు రాకూడదని రుద్ర బయటే ఉండి గంగకి అంతా వివరిస్తాడు. నేను నీ పేరు మైక్ లో రావడం వినాలని రుద్ర అంటాడు. గంగ లోపలకు వెళ్తుంది. అక్కడ పారు ఇంకా తన ఫ్రెండ్స్ కలిసి గంగని చులకనగా మాట్లాడుతారు.

Brahmamudi : రుద్రాణిని రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన కనకం!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -922 లో.. ఒకతను వచ్చి రుద్రాణికి మళ్ళీ పసరు మందు ఇస్తాడు. ఆ పసరు మందు పని చేస్తుందా లేదా అని రుద్రాణి అతన్ని అడుగుతుంది. పని చేస్తుందని అతను చెప్తాడు. దాంతో రుద్రాణి పసరు మందు తీసుకొని లోపలికి వెళ్తుంటే అప్పుడే కనకం ఎదురుపడుతుంది. కనకాన్ని చూసి రుద్రాణి టెన్షన్ పడుతుంది. చేతిలో అదేంటీ అని కనకం అనగానే ఇదా.... నాకే పసరు మందు అజీర్తికి వాడమని చెప్పారని చెప్పి రుద్రాణి వెళ్ళిపోతుంది. అలా అయితే ఇంత రాత్రివేళ తీసుకొని వెళ్తుంది ఏంటని కనకంకి డౌట్ వస్తుంది.