English | Telugu

అరె ఛీ.. ఏంట్రా ఈ డబుల్ మీనింగ్ డైలాగులు!

డబుల్ మీనింగ్ డైలాగ్స్ కి అంతూ పొంతూ లేకుండా పోయింది. బుల్లితెర షోస్ లో ఇలాంటి డైలాగ్స్ ఉంటేనే షోకి రేటింగ్ పెరుగుతుంది అని వాటినే ఎక్కువగా పెడుతున్నారు. ఈ వారం 'శ్రీదేవి డ్రామా కంపెనీ' టూ మచ్ డైలాగ్స్ తో ఆడవాళ్లు తల దించుకునే స్థాయికి తీసుకెళ్లారు. రీసెంట్ గా ప్రసారమైన శ్రీదేవి డ్రామా కంపెనీలో "నా కొడుకు" టైటిల్ తో ఒక ఈవెంట్ చేశారు. ఈ ఎపిసోడ్‌కు గెస్టుగా సీనియ‌ర్ క‌మెడియ‌న్‌ కృష్ణభగవాన్ వచ్చాడు. 'ఎఫ్‌3' మూవీ కాన్సెప్ట్ ప్రకారం తప్పిపోయిన కొడుకుని తిరిగి పట్టుకునే థీమ్ అంటూ నానా హంగామా చేశారు. తర్వాత ఒక రూపాయిని పది రూపాయలు చేసే బిజినెస్ తెలివితేటలు ఉన్నాయని కృష్ణ భగవాన్ చెప్పడంతో మరో స్కిట్ వేశారు హైపర్ ఆది, ఆటో రాంప్రసాద్, నాటీ నరేష్.

ఇందులో ఒక్కొక్కొరు ఒక్కో వ్యాపారం చేస్తుంటారు. ఆది మూలికల వ్యాపారం చేస్తుంటాడు, ఇమాన్యుయేల్ పీచు మీఠాయిలు అమ్ముతూ ఉంటాడు. రాంప్రసాద్ కూరగాయల బిజినెస్ చేస్తుంటాడు. వీళ్ళ బిజినెస్ ని చూసి కొనడానికి నాటీ నరేష్ వచ్చి తన పరువు తానే తీసేసుకుని అందరినీ తలదించుకునేలా చేస్తాడు. రాంప్రసాద్ కూరగాయల దగ్గరకు వచ్చి "దొండకాయను చూపించిఏంటి ఇది ఇంతే ఉంది?" అంటూ డబుల్ మీనింగ్‌లో అంటాడు. "ఎక్కడో చూసినట్టుగా ఉంది కదా?" అని నరేష్ ని ఇంకా రెచ్చగొడతాడు రాం ప్రసాద్. వీళ్ళ డైలాగ్స్ వినలేక ఇంద్రజ సిగ్గుతో తలదించుకుంటుంది. చివరికి పంచ్ ప్రసాద్ వచ్చి అందరినీ తిడతాడు.

ఏదో చేద్దామని అనుకుని కానీ ఏమీ చేయలేక తెల్ల ముఖాలు వేసుకుని నిలబడ్డారు. నరేష్ స్పాంటేనిటీగా ఏదో చేద్దామని వచ్చి ఏది చేయలేక ఉన్న పరువు, లేని పరువు, అప్పు చేసిన పరువు కూడా పోగొట్టుకున్నాడు. ఇలా ఈ స్కిట్ అయ్యిందనిపించారు.

Jayam serial: వీరూ ప్లాన్ ని కనిపెట్టిన గంగ.. రుద్ర తెలుసుకుంటాడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -146 లో.... రుద్రకి ఎదురుగా గంగ వెళ్తుంది కానీ రుద్ర ఫోన్ మాట్లాడుతూ వెళ్ళిపోతాడు. కొంచెం దూరం వెళ్ళగానే రుద్రకి రింగ్ కనిపిస్తుంది. అది తీసుకొని చూస్తాడు. అప్పుడే ప్రమీల, ప్రీతీ వస్తారు. అన్నయ్య ఆ రింగ్ గంగ వదినది అని ప్రీతీ అంటుంది. ఈ రింగ్ ప్రపంచంలో ఆవిడకి ఒక్కదానికే ఉందా ఏంటని రుద్ర అంటాడు. ఆ తర్వాత అటుగా వెళ్తున్న గంగని రుద్ర పిలుస్తాడు. గంగ ముసుగులో ఉంటుంది. రుద్ర పిల్వగానే వస్తుంది. ఈ రింగ్ మీదేనా అని అడుగుతాడు. గంగ నాదేనని తీసుకుంటుంది..

Brahamamudi: మోడల్ ఫోటోషూట్ కోసం కావ్య ఒప్పుకుంటుందా.. రాజ్ ఏం చేయనున్నాడు!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -908 లో.... రాజ్ గుర్రంపై కూర్చొని ఊరేగుతున్నట్లు తన ఫోటోని రాజ్ కి చూపిస్తుంది కావ్య. అది చూసి నన్ను అలా చేస్తావా అని కావ్య ఫోటోని మోడల్ గా పెట్టి చూపిస్తాడు. చీ బాలేదు తీసెయ్యండి అని కావ్య అంటుంది. కావ్య ఎప్పుడు సంప్రదాయంగా ఉంటుందని ఫోటో మర్చి చూపిస్తుంది. అది చూసి రాజ్ ఫ్లాట్ అవుతాడు. ఇంట్లోనే మోడల్ ని పెట్టుకొని బయట వెతుకుతున్నానని రాజ్ అనుకుంటాడు. ఎలాగైనా యాడ్ లో చెయ్యడానికి కావ్యని ఒప్పించాలని అనుకుంటాడు.

Karthika Deepam2: వైరా ఇచ్చిన డీల్ కి ఒకే చెప్పిన కాశీ.. పోలీస్ స్టేషన్ కి శ్రీధర్!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -545 లో....వైరా దగ్గరికి కాశీ వస్తాడు. కాశీ రాగానే రండి సర్ అని కాశీకీ వైరా మర్యాద ఇస్తుంటే నాకు మర్యాద ఇస్తున్నారేంటని కాశీ అడుగుతాడు. మీ రెజ్యుమె చూసాను.‌ చాలా బాగుంది. మనకంటే టాలెంట్ ఎక్కువ ఉన్నవాళ్లు మనకన్నా చిన్న ఏజ్ అయిన రెస్పెక్ట్ ఇవ్వాలని వైరా అంటాడు.. నాకు జ్యోత్స్న ఫోన్ చేసి చెప్పింది మీరు ప్రెజెంట్ ఏం చేస్తున్నారని వైరా అడుగగా జ్యోత్స్న రెస్టారెంట్ సీఈఓ దగ్గర పిఏగా చేస్తున్నానని కాశీ చెప్తాడు. ఏంటి అంత చిన్న జాబ్ చేస్తున్నారా అని వైరా అంటాడు.