English | Telugu

Guppedantha Manasu : మను తండ్రి మహేంద్రే అని చెప్పేసిన పెద్దావిడ.. షాక్ లో వసుధార!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -1057 లో.. అనుపమతో వసుధార మాట్లాడుతుంటుంది. కావాలనే అనుపమని వసుధార రెచ్చగొడుతుంది. మను తండ్రి లేడంటే చెప్పేవారు కదా అని వసుధార పదేపదే అంటుంది. అప్పుడే అనుపమ వాళ్ళ పెద్దమ్మ వచ్చి.. మను తండ్రి బ్రతికే ఉన్నాడని అంటుంది. దాంతో అనుపమ, వసుధార ఇద్దరు షాక్ అవుతారు. మరి మనుకి తండ్రి ఉంటే మావయ్య దత్తత తీసుకోవడానికి అనుపమ ఎందుకు ఒప్పకుంది. అసలు నిజం ఎందుకు చెప్పడం లేదని వసుధార అడుగుతుంది.

నిజం చెప్పకపోవడానికే తన కారణాలు తనకి ఉంటాయి కదా అని పెద్దావిడ అంటుంది. మరి దత్తతకి ఎందుకు ఒప్పుకుందని వసుధార అనగానే.. ఎందుకు అంటే దత్తత తీసుకునేది మను తండ్రే కాబట్టి అని ఆ పెద్దావిడ అనగానే అందరు షాక్ అవుతారు. అవును మను తండ్రి మహేంద్రనే అని ఆ అనుపమ వాళ్ళ పెద్దమ్మ అనగానే.. వసుధార షాక్ అవుతుంది. మీరేం అంటున్నారో అర్థం కావడం లేదని వసుధార అంటుంది. ఇందులో అనుపమ తప్పేం లేదని, ఇదే నిజమని ఆమె అంటుంది. అప్పుడే మహేంద్ర వస్తాడు‌. ఏదో నిజం అంటున్నారు? ఏంటని అడుగుతాడు. వసుధార తడబడుతు మను తండ్రి మీరే అని అంటున్నారని వసుధార అనగానే.. అదే విషయం ఆ రోజు నేనే చెప్పాను కదా అని మహేంద్ర అంటాడు. ఆ విషయం నిజం చెయ్యడానికే దత్తత తీసుకుంటున్నానని మహేంద్ర అంటాడు. వసు నిజం చెప్పడానికి ట్రై చేస్తుంటే.. అనుపమ వద్దని సైగ చేస్తుంది.

ఆ తర్వాత దేవయాని దత్తత గురించి మహేంద్రని తిడుతుంటుంది. మహేంద్ర గురించి నెగెటివ్ గా ఎందుకు మాట్లాడుతున్నావని దేవయానిపై ఫణీంద్ర కోప్పడతాడు. ఆ తర్వాత మహేంద్రకి శైలేంద్ర ఫోన్ చేస్తాడు. మీతో ఒక విషయం మాట్లాడాలని నేను చెప్పిన చోటుకి రండి అని శైలేంద్ర చెప్పగా.. మహేంద్ర రానని అంటాడు... ఆ తర్వాత శైలేంద్ర ఇబ్బంది పెడుతుంటే మహేంద్ర వస్తానంటాడు. మరొకవైపు మావయ్య మను తండ్రి ఏంటని వసుధార ఆలోచిస్తూ‌.. అనుపమ గారి పెద్దమ్మని అడిగి తెలుసుకోవాలనక అనుకుంటుంది. అపుడే వసుధారకి ఏంజిల్ ఫోన్ చేసి.. మహేంద్ర గారు మను ని దత్తత తీసుకుంటున్నారంటగా అని అడుగుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Jayam serial : గంగ, రుద్ర పూజలో కూర్చుంటారా.. పారు ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -164 లో..... రుద్ర ఏ విధంగా గంగకి హెల్ప్ చేసాడో అందరికి చెప్తాడు. పాపం పెద్దమ్మ హర్ట్ అయినట్లు ఉందని వంశీ అనగానే అయితే అవనివ్వులే గంగ సేఫ్ అయిందని పెద్దసారు అంటాడు. మరొకవైపు పారు ఫ్రెండ్స్ ని అకాడమీ మేడమ్ సస్పెండ్ చేస్తుంది. దాంతో నువ్వు సస్పెండ్ ఆపకపోతే నువ్వే ఇదంతా చేసావని మేడమ్ కి చెప్తానని పారు ఫ్రెండ్ పారుతో అంటుంది. దాంతో మేడమ్ ని సస్పెండ్ క్యాన్సిల్ చెయ్యమని రిక్వెస్ట్ చేస్తుంది పారు. తప్పు ఒప్పుకుంటున్నారు కదా ఈ ఒక్కసారి క్షమించండి అని మేడమ్ తో గంగ అనగానే తను సరే అని సస్పెన్షన్ క్యాన్సిల్ చేస్తుంది.

ఆ మీమ్ నన్ను చాలా డిస్టర్బ్ చేసింది...సావండి అంటున్న నైనికా అనసుర

నైనికా అనసురు బుల్లితెర మీద అందరికీ పరిచయమే. బిగ్ బాస్ సీజన్ 8 ద్వారా బాగా ఫేమస్ అయ్యింది. అలాగే ఢీ డాన్స్ షోలో డాన్స్ ద్వారా బాగా పాపులర్ అయ్యింది. ఇక ఇప్పుడు బిబి జోడి సీజన్ 2 లో అమరదీప్ కి జోడిగా చేస్తోంది. అలాంటి నైనికా రీసెంట్ గా తన ఇన్స్టాగ్రామ్ స్టేటస్ లో ఘాటుగా ఒక పోస్ట్ పెట్టింది. "ఎలాంటి పని లేకుండా జస్ట్ కూర్చుని అమ్మాయిల చిత్రాలను ఘోరంగా ఎడిట్ చేస్తూ వాళ్ళను హరాస్ చేసే ఒక స్టుపిడ్ మీమ్ పేజీలో పోస్ట్ చేసిన నా చిత్రాలు నన్ను చాలా డిస్టర్బ్ చేశాయి. మీకు పని లేదు బ్రో, మాకు మిమ్మల్ని పట్టించుకునేంత టైం లేదు. నువ్వు మా మీద పోస్ట్లు పెడుతున్నావ్ అంటే నువ్వు నీలోనే తోపు ఐనట్టే..మీ పేరెంట్స్ నిన్ను బాగా పెంచారు. మీలాంటి వాళ్ళే రేపు రేపిస్టుల్లా తయారవుతారు.