English | Telugu

Guppedantha Manasu:రిషికి చేస్తున్న కర్మకాండలో తన ఫోటో కూడా పెట్టిన వసుధార!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -1011 లో... ఫణీంద్రకి ధరణి నిజం చెప్పబోతుంటే దేవయానక అడ్డుపడి డైవర్ట్ చేస్తుంది. నువ్వు ఏం చెప్పాలని అనుకుంటున్నావో నాకు తెలుసు. నేను రిషి గురించి పడే బాధ గురించి చెప్పాలని అనుకుంటున్నావు కదా అని అంటుంది. ఆ తర్వాత రిషిపై దేవయాని ప్రేమ ఉన్నట్లు నటిస్తుంటే ధరణికి చాలా కోపం వస్తుంది. శైలేంద్ర అయితే మా అమ్మ ఏం నటిస్తుంది మహానటి అనుకుంటాడు.

ఆ తర్వాత రిషి ఫోటో పట్టుకొని మహేంద్ర ఎమోషనల్ అవుతుంటాడు. ఆ తర్వాత దేవయాని చేసిన యాక్టింగ్ గుర్తుకు చేసుకొని ధరణి బాధపడుతుంది. అప్పుడే శైలేంద్ర వచ్చి.. ఏం ఆలోచిస్తున్నావని అడుగుతాడు. మీరు ప్లీజ్ వసుధారని బాధపెట్టకండి.. తను చాలా మంచిదని ధరణి అంటుంది. నేను ఎండీ కావాలనే విషయంలో నువ్వు మాత్రం ఇన్వాల్వ్ కావొద్దు. నువ్వు ఏం చెప్తే అదే చేస్తాను. ప్లీజ్ అడ్డురాకని ధరణిని శైలేంద్ర రిక్వెస్ట్ చేస్తాడు. మరుసటిరోజు ఉదయం వసుధార కంగారుగా అనుపమ దగ్గరకి వచ్చి.. మేడమ్ మావయ్య గారు ఎక్కడ కన్పించడం లేదు. ఫోన్ కూడా లిఫ్ట్ చెయ్యడం లేదని వసుధార టెన్షన్ పడుతుంది. బయటకు వెళ్లారేమోనని అనుపమ అంటుంది. మావయ్య గారు ఎక్కడికి వెళ్లిన నాకు చెప్పే వెళ్తాడని వసుధార అంటుంది. నేను ట్రై చేస్తానని మహేంద్రకి అనుపమ ఫోన్ చేస్తుంది కానీ మహేంద్ర లిఫ్ట్ చెయ్యడు. మరొకవైపు రిషికి కర్మకాండ నిర్వహించడానికి శైలేంద్ర వాళ్ళు అన్ని ఏర్పాట్లు చేస్తారు. వసుధారకి తెలిస్తే బాధపడుతుంది వద్దని మహేంద్ర అంటాడు. కానీ తప్పదు చెయ్యాలి కదా అని ఫణీంద్ర అంటాడు. ఆ తర్వాత రిషి ఫోటో దగ్గర మహేంద్ర కర్మకాండ చేస్తుంటాడు.

మరొకవైపు వసుధార కాలేజీకి రెడీ అయి వెళ్తుంటే.. మను వచ్చి మేడమ్ మీరు నాతో రండి అని అంటాడు. నేను ఎందుకు నీతో రావాలని వసుధార ఆర్గుమెంట్ చేస్తుంది. ఆ తర్వాత మహేంద్ర చేస్తున్న కర్మకాండ వీడియోని వసుధారకి మను చూపించాగానే షాక్ అవుతుంది. ఆ తర్వాత మహేంద్ర వాళ్ళ దగ్గరికి వసుధార, మను వెళ్తారు. రిషి ఫోటో పక్కనే వసుధార ఫోటో కూడా పెడుతుంది. అది చూసి అందరు షాక్ అవుతారు. మావయ్య మీరు తప్పు చేస్తున్నారని వసుధార అనగానే.. ఏం తప్పు చేస్తున్నామని దేవయాని అంటుంది. మేడమ్ మీరు సైలెంట్ గా ఉండండి అని వసుధార కోప్పడుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Jayam serial : బాక్సింగ్ పోటీలో మిస్సెస్ గంగ రుద్ర ప్రతాప్.. పారు ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -160 లో..... గంగని ఎలాగైనా అకాడమీ సెలక్షన్ కి వెళ్లకుండా ఆపాలని ఇషిక, వీరు ట్రై చేస్తారు కానీ గంగ, రుద్ర ఇద్దరు కలిసి ఇంట్లో అన్ని పనులు పూర్తి చేసి అకాడమీకి వెళ్తారు. రుద్ర అకాడమీ బయటే ఉంటాడు. నాకు సంబంధించిన కేసు ఇంకా పెండింగ్ లో ఉంది అలా ఉండగా.. నేను లోపలకు రాకూడదని రుద్ర బయటే ఉండి గంగకి అంతా వివరిస్తాడు. నేను నీ పేరు మైక్ లో రావడం వినాలని రుద్ర అంటాడు. గంగ లోపలకు వెళ్తుంది. అక్కడ పారు ఇంకా తన ఫ్రెండ్స్ కలిసి గంగని చులకనగా మాట్లాడుతారు.

Brahmamudi : రుద్రాణిని రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన కనకం!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -922 లో.. ఒకతను వచ్చి రుద్రాణికి మళ్ళీ పసరు మందు ఇస్తాడు. ఆ పసరు మందు పని చేస్తుందా లేదా అని రుద్రాణి అతన్ని అడుగుతుంది. పని చేస్తుందని అతను చెప్తాడు. దాంతో రుద్రాణి పసరు మందు తీసుకొని లోపలికి వెళ్తుంటే అప్పుడే కనకం ఎదురుపడుతుంది. కనకాన్ని చూసి రుద్రాణి టెన్షన్ పడుతుంది. చేతిలో అదేంటీ అని కనకం అనగానే ఇదా.... నాకే పసరు మందు అజీర్తికి వాడమని చెప్పారని చెప్పి రుద్రాణి వెళ్ళిపోతుంది. అలా అయితే ఇంత రాత్రివేళ తీసుకొని వెళ్తుంది ఏంటని కనకంకి డౌట్ వస్తుంది.