English | Telugu

Guppedantha Manasu:రిషికి చేస్తున్న కర్మకాండలో తన ఫోటో కూడా పెట్టిన వసుధార!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -1011 లో... ఫణీంద్రకి ధరణి నిజం చెప్పబోతుంటే దేవయానక అడ్డుపడి డైవర్ట్ చేస్తుంది. నువ్వు ఏం చెప్పాలని అనుకుంటున్నావో నాకు తెలుసు. నేను రిషి గురించి పడే బాధ గురించి చెప్పాలని అనుకుంటున్నావు కదా అని అంటుంది. ఆ తర్వాత రిషిపై దేవయాని ప్రేమ ఉన్నట్లు నటిస్తుంటే ధరణికి చాలా కోపం వస్తుంది. శైలేంద్ర అయితే మా అమ్మ ఏం నటిస్తుంది మహానటి అనుకుంటాడు.

ఆ తర్వాత రిషి ఫోటో పట్టుకొని మహేంద్ర ఎమోషనల్ అవుతుంటాడు. ఆ తర్వాత దేవయాని చేసిన యాక్టింగ్ గుర్తుకు చేసుకొని ధరణి బాధపడుతుంది. అప్పుడే శైలేంద్ర వచ్చి.. ఏం ఆలోచిస్తున్నావని అడుగుతాడు. మీరు ప్లీజ్ వసుధారని బాధపెట్టకండి.. తను చాలా మంచిదని ధరణి అంటుంది. నేను ఎండీ కావాలనే విషయంలో నువ్వు మాత్రం ఇన్వాల్వ్ కావొద్దు. నువ్వు ఏం చెప్తే అదే చేస్తాను. ప్లీజ్ అడ్డురాకని ధరణిని శైలేంద్ర రిక్వెస్ట్ చేస్తాడు. మరుసటిరోజు ఉదయం వసుధార కంగారుగా అనుపమ దగ్గరకి వచ్చి.. మేడమ్ మావయ్య గారు ఎక్కడ కన్పించడం లేదు. ఫోన్ కూడా లిఫ్ట్ చెయ్యడం లేదని వసుధార టెన్షన్ పడుతుంది. బయటకు వెళ్లారేమోనని అనుపమ అంటుంది. మావయ్య గారు ఎక్కడికి వెళ్లిన నాకు చెప్పే వెళ్తాడని వసుధార అంటుంది. నేను ట్రై చేస్తానని మహేంద్రకి అనుపమ ఫోన్ చేస్తుంది కానీ మహేంద్ర లిఫ్ట్ చెయ్యడు. మరొకవైపు రిషికి కర్మకాండ నిర్వహించడానికి శైలేంద్ర వాళ్ళు అన్ని ఏర్పాట్లు చేస్తారు. వసుధారకి తెలిస్తే బాధపడుతుంది వద్దని మహేంద్ర అంటాడు. కానీ తప్పదు చెయ్యాలి కదా అని ఫణీంద్ర అంటాడు. ఆ తర్వాత రిషి ఫోటో దగ్గర మహేంద్ర కర్మకాండ చేస్తుంటాడు.

మరొకవైపు వసుధార కాలేజీకి రెడీ అయి వెళ్తుంటే.. మను వచ్చి మేడమ్ మీరు నాతో రండి అని అంటాడు. నేను ఎందుకు నీతో రావాలని వసుధార ఆర్గుమెంట్ చేస్తుంది. ఆ తర్వాత మహేంద్ర చేస్తున్న కర్మకాండ వీడియోని వసుధారకి మను చూపించాగానే షాక్ అవుతుంది. ఆ తర్వాత మహేంద్ర వాళ్ళ దగ్గరికి వసుధార, మను వెళ్తారు. రిషి ఫోటో పక్కనే వసుధార ఫోటో కూడా పెడుతుంది. అది చూసి అందరు షాక్ అవుతారు. మావయ్య మీరు తప్పు చేస్తున్నారని వసుధార అనగానే.. ఏం తప్పు చేస్తున్నామని దేవయాని అంటుంది. మేడమ్ మీరు సైలెంట్ గా ఉండండి అని వసుధార కోప్పడుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Jayam serial : గంగ, రుద్ర పూజలో కూర్చుంటారా.. పారు ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -164 లో..... రుద్ర ఏ విధంగా గంగకి హెల్ప్ చేసాడో అందరికి చెప్తాడు. పాపం పెద్దమ్మ హర్ట్ అయినట్లు ఉందని వంశీ అనగానే అయితే అవనివ్వులే గంగ సేఫ్ అయిందని పెద్దసారు అంటాడు. మరొకవైపు పారు ఫ్రెండ్స్ ని అకాడమీ మేడమ్ సస్పెండ్ చేస్తుంది. దాంతో నువ్వు సస్పెండ్ ఆపకపోతే నువ్వే ఇదంతా చేసావని మేడమ్ కి చెప్తానని పారు ఫ్రెండ్ పారుతో అంటుంది. దాంతో మేడమ్ ని సస్పెండ్ క్యాన్సిల్ చెయ్యమని రిక్వెస్ట్ చేస్తుంది పారు. తప్పు ఒప్పుకుంటున్నారు కదా ఈ ఒక్కసారి క్షమించండి అని మేడమ్ తో గంగ అనగానే తను సరే అని సస్పెన్షన్ క్యాన్సిల్ చేస్తుంది.

ఆ మీమ్ నన్ను చాలా డిస్టర్బ్ చేసింది...సావండి అంటున్న నైనికా అనసుర

నైనికా అనసురు బుల్లితెర మీద అందరికీ పరిచయమే. బిగ్ బాస్ సీజన్ 8 ద్వారా బాగా ఫేమస్ అయ్యింది. అలాగే ఢీ డాన్స్ షోలో డాన్స్ ద్వారా బాగా పాపులర్ అయ్యింది. ఇక ఇప్పుడు బిబి జోడి సీజన్ 2 లో అమరదీప్ కి జోడిగా చేస్తోంది. అలాంటి నైనికా రీసెంట్ గా తన ఇన్స్టాగ్రామ్ స్టేటస్ లో ఘాటుగా ఒక పోస్ట్ పెట్టింది. "ఎలాంటి పని లేకుండా జస్ట్ కూర్చుని అమ్మాయిల చిత్రాలను ఘోరంగా ఎడిట్ చేస్తూ వాళ్ళను హరాస్ చేసే ఒక స్టుపిడ్ మీమ్ పేజీలో పోస్ట్ చేసిన నా చిత్రాలు నన్ను చాలా డిస్టర్బ్ చేశాయి. మీకు పని లేదు బ్రో, మాకు మిమ్మల్ని పట్టించుకునేంత టైం లేదు. నువ్వు మా మీద పోస్ట్లు పెడుతున్నావ్ అంటే నువ్వు నీలోనే తోపు ఐనట్టే..మీ పేరెంట్స్ నిన్ను బాగా పెంచారు. మీలాంటి వాళ్ళే రేపు రేపిస్టుల్లా తయారవుతారు.