English | Telugu

'ఏ మాస్టర్ పీస్' మూవీలో కనిపించి అలరించబోతున్న గుప్పెడంత మనసు జగతి మేడం!

గుప్పెడంత మనసు సీరియల్ స్టార్ మాలో ఎంత ఫేమస్ అయిందో అందరికీ తెలిసిన విషయమే. కార్తీకదీపం సీరియల్ ఐపోయాక టాప్ - 1 రేటింగ్ ని సంపాదించుకుంది ఈ సీరియల్. ఇందులో పాత్రలు కూడా చాలా పద్దతిగా కనిపిస్తాయి. అందులో ఇంకా డబుల్ పద్దతిగా కనిపిస్తుంది జగతి క్యారెక్టర్. లెక్చరర్ హోదాలో హుందాగా పొందిగ్గా ఉంటుంది. మరి ఆ జగతి పాత్ర చేసిన ఆమె పేరే జ్యోతి రాయ్. ఇంత స్టైలిష్ గా, స్మార్ట్ ఉండే ఈ టీచరమ్మ ఇప్పుడు "ఏ మాస్టర్ పీస్" మూవీలో కనిపించబోతున్నారు.

ఇక ఈ మూవీకి సంబంధించిన ఫస్ట్ షెడ్యూల్ షూటింగ్ అరకు ఒరిస్సా బోర్డర్ లో పూర్తయినట్లు ఆమె తన లుక్ తో ఉన్న ఒక పోస్టర్ ని తన ఇన్స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేశారు. కార్తీకదీపంలో తల్లి పాత్రలో సౌందర్య ఎంత అందంగా అలరించి వెళ్లిపోయిందో ఇప్పుడు అలాగే జగతి కూడా అందమైన తల్లిగా మెప్పిస్తోంది. 1987 జూలై 4 న కర్ణాటకలో పుట్టిన జ్యోతి రాయ్ తన ఎడ్యుకేషన్ ని అక్కడే పూర్తి చేసింది. చిన్నప్పటినుంచి మూవీస్ మీద ఉన్న ఇంటరెస్ట్ తో యాక్టింగ్ వైపు అడుగులు వేసింది. కొన్ని కన్నడ సీరియల్స్, కన్నడ సినిమాల్లో నటించి మంచి గుర్తింపు సంపాదించుకుంది.

తెలుగులో నిరుపమ్ హీరోగా నటించిన 'కన్యాదానం' సీరియల్లో నటించింది. ఇక చాలా సంవత్సరాల తర్వాత తిరిగి 'గుప్పెడంత మనసు' సీరియల్ తో రిషికి తల్లిగా జగతి పాత్రలో అలరిస్తూ తెలుగు ప్రేక్షకులకు చేరువైంది. జ్యోతిరాయ్ పోజ్ కి నెటిజన్స్ అంతా పాజిటివ్ గా కామెంట్స్ చేస్తూ బెస్ట్ విషెస్ చెప్తున్నారు.

Jayam serial : గంగ, రుద్ర పూజలో కూర్చుంటారా.. పారు ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -164 లో..... రుద్ర ఏ విధంగా గంగకి హెల్ప్ చేసాడో అందరికి చెప్తాడు. పాపం పెద్దమ్మ హర్ట్ అయినట్లు ఉందని వంశీ అనగానే అయితే అవనివ్వులే గంగ సేఫ్ అయిందని పెద్దసారు అంటాడు. మరొకవైపు పారు ఫ్రెండ్స్ ని అకాడమీ మేడమ్ సస్పెండ్ చేస్తుంది. దాంతో నువ్వు సస్పెండ్ ఆపకపోతే నువ్వే ఇదంతా చేసావని మేడమ్ కి చెప్తానని పారు ఫ్రెండ్ పారుతో అంటుంది. దాంతో మేడమ్ ని సస్పెండ్ క్యాన్సిల్ చెయ్యమని రిక్వెస్ట్ చేస్తుంది పారు. తప్పు ఒప్పుకుంటున్నారు కదా ఈ ఒక్కసారి క్షమించండి అని మేడమ్ తో గంగ అనగానే తను సరే అని సస్పెన్షన్ క్యాన్సిల్ చేస్తుంది.

ఆ మీమ్ నన్ను చాలా డిస్టర్బ్ చేసింది...సావండి అంటున్న నైనికా అనసుర

నైనికా అనసురు బుల్లితెర మీద అందరికీ పరిచయమే. బిగ్ బాస్ సీజన్ 8 ద్వారా బాగా ఫేమస్ అయ్యింది. అలాగే ఢీ డాన్స్ షోలో డాన్స్ ద్వారా బాగా పాపులర్ అయ్యింది. ఇక ఇప్పుడు బిబి జోడి సీజన్ 2 లో అమరదీప్ కి జోడిగా చేస్తోంది. అలాంటి నైనికా రీసెంట్ గా తన ఇన్స్టాగ్రామ్ స్టేటస్ లో ఘాటుగా ఒక పోస్ట్ పెట్టింది. "ఎలాంటి పని లేకుండా జస్ట్ కూర్చుని అమ్మాయిల చిత్రాలను ఘోరంగా ఎడిట్ చేస్తూ వాళ్ళను హరాస్ చేసే ఒక స్టుపిడ్ మీమ్ పేజీలో పోస్ట్ చేసిన నా చిత్రాలు నన్ను చాలా డిస్టర్బ్ చేశాయి. మీకు పని లేదు బ్రో, మాకు మిమ్మల్ని పట్టించుకునేంత టైం లేదు. నువ్వు మా మీద పోస్ట్లు పెడుతున్నావ్ అంటే నువ్వు నీలోనే తోపు ఐనట్టే..మీ పేరెంట్స్ నిన్ను బాగా పెంచారు. మీలాంటి వాళ్ళే రేపు రేపిస్టుల్లా తయారవుతారు.