English | Telugu

Guppedantha Manasu : ముకుల్ చెప్పిన ఆ నిజం వసుధార నమ్మేనా..  అ కొత్త వ్యక్తి ఎవరు?

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -992 లో.. మహేంద్ర ఐడెంటిఫికేషన్ కోసం హాస్పిటల్ కి వెళ్ళాడని తెలిసి ఫణీంద్ర బాధపడుతుంటాడు. వాళ్ళింటికి వెళదాం అని ఫణీంద్ర అనగానే.. వాళ్ళే కాల్ చేస్తారులే అని దేవయాని అంటుంది. అలా అనగానే ఫణీంద్ర తనపై కోప్పడతాడు. కాసేపటికి అందరు మహేంద్ర ఇంటికి వెళ్తారు. ఆ తర్వాత మహేంద్ర కి ఫోన్ చేసి.. అక్కడ ఏం అన్నారో కనుక్కోమని చక్రపాణి అనగానే.. ఏం అంటారు అది రిషి సర్ బాడీ కాదు అని చెప్తారు. లాస్ట్ టైమ్ కూడ ఇలాగే జరిగిందని అనువసు అంటుంది.

ఆ తర్వాత రిషి సర్ కి ఏం కాదు కదా మేడమ్ అని అనుపమని వసుధార అడుగుతుంది. ఏం కాదు నువ్వు కంగారుపడకని అనుపమ దైర్యం చెప్తుంది. ఆ తర్వాత మహేంద్ర, ముకుల్ అక్కడికి వస్తారు. ఏమైంది మావయ్య అక్కడ రిషి సర్ కాదు కాదా అని అడుగుతుంది. లేదమ్మ అక్కడ రిషినే అంటూ మహేంద్ర ఏడుస్తాడు. అయిన వసుధార నమ్మకుండా మీరు చెప్తుంది అబద్ధమని అంటుంది. లేదు మేడమ్ నిజమని ముకుల్ చెప్పిన కూడా వసుధార నమ్మదు. అంతలోనే ఫణీంద్ర, దేవయాని, శైలేంద్ర అక్కడికి వస్తారు. ఏం జరిగింది మహేంద్ర అని ఫణీంద్ర అడగ్గానే.. రిషి లేడని చెప్తూ మహేంద్ర ఏడుస్తాడు. ఫణీంద్ర, ధరణి ఇద్దరు షాక్ అవుతారు. కానీ శైలేంద్ర, దేవయాని ఇద్దరు మాత్రం హ్యాపీగా ఫీల్ అవుతుంటారు. ఆ తర్వాత నువ్వే ఏదో చేసావ్? రిషి సర్ ఎక్కడ అంటు శైలేంద్ర కాలర్ పట్టుకొని వసుధార అడుగుతుంది. దేవయాని, ముకుల్ ఇద్దరు కలిసి వసుధారని ఆపుతారు. ఆ తర్వాత రిషి చనిపోయాడని అనడానికి సాక్ష్యం ఇదిగో అని ముకుల్ వసుధారకి ఫోన్ లో ఏదో చూపిస్తాడు.. అయిన నేను నమ్మను.. నేను తెలుసుకుంటాను అంటు వసుధార బయటకు వస్తుంది.

ఆ తర్వాత వసుధార ఒక చోటుకి వచ్చి.. రిషి లేడని మహేంద్ర చెప్పిన విషయాన్ని గుర్తుకుచేసుకొని ఏడుస్తుంది. అప్పుడే వసుధారకి ఎవరో వాటర్ ఇస్తారు. ఎవరని వసుధార చూసేసరికి.. అక్కడ ఉంది రాజీవ్. ఇద్దరికీ కాసేపు గొడవ అవుతుంది. రిషి లేడంట కదా.. ఇక నిన్ను పెళ్లి చేసుకుంటానని రాజీవ్ వసుధార చెయ్యి పట్టుకొని లాక్కొని వెళ్తుంటే.. అప్పుడే ఎక్స్ క్యూజ్ మి అంటూ ఒకతను వస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Podharillu : మహా, చక్రిలని వెతకడానికి రంగంలోకి దిగిన రౌడీలు.. ప్రతాప్ పట్టుకుంటాడా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -23 లో...మహా ఇంట్లో నుండి వెళ్లిపోతున్నట్లు లెటర్ రాసి బయటకు వచ్చి వాళ్ళ నాన్నని గుర్తుచేసుకొని ఏడుస్తుంది. ఎలాగోలా బయటకు వచ్చేస్తుంది మహా. ఆ తర్వాత చక్రి తీసుకొని వచ్చిన కార్ ఎక్కుతుంది. ముందు అ ఫోన్ నుండి సిమ్ తియ్యండి సిగ్నల్స్ ద్వారా ట్రేస్ చేస్తే ఎక్కడున్నామో తెలుస్తుందని చక్రి అనగానే అవునని సిమ్ తియ్యబోతుంటే భూషణ్ ఫోన్ చేస్తాడు. వీడికి బాకీ ఉన్న మాటలు బాగా ఉన్నాయని ఫోన్ లిఫ్ట్ చేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది. రేపు పెళ్లి పెట్టుకొని ఇలా మాట్లాడుతున్నావ్ ఏంటని భూషణ్ అంటాడు.

Jayam serial : గంగని టార్గెట్ చేసిన పారు.. రుద్ర గది నుండి బయటకు రాగలడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -162 లో... రుద్ర ఇంటికి రావడంతో శకుంతల కోప్పడుతుంది. ఆ గంగ అకాడమీలో స్టే చెయ్యడంతో ఈ ఇంటి పరువుపోతుంది వెంటనే తీసుకొని రమ్మని శకుంతల చెప్తుంది. రుద్ర తన నిర్ణయాన్ని పట్టించుకోడు. అ తర్వాత రుద్ర మళ్ళీ గంగ ఉన్న అకాడమీ దగ్గరున్న టీ షాప్ కి వెళ్లి కాసేపు ఆలోచిస్తాడు. ఇక గంగకి అకాడమీ వాళ్ళు ఏదైనా ఇబ్బంది పెడుతున్నారేమో అని ఆలోచించిన రుద్ర అక్కడ టీ షాప్ లో ఒక బుక్ తీసుకొని అకాడమీ కాంపౌండ్ దగ్గరికి వెళ్తాడు. గంగకి ఒక పేపర్ లో మెసేజ్ రాసి లోపలికి విసురుతాడు.

Illu illalu pillalu : అమూల్యకి పెళ్ళిచూపులు.. కామాక్షి ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -362 లో.. పెళ్లిచూపులకి ఇంకా రావడం లేదని రామరాజు వాళ్ళు ఎదురుచూస్తుంటే వాళ్ళు రారుగా అని శ్రీవల్లి మనసులో అనుకుంటుంది. అప్పుడే అబ్బాయి వాళ్ళు పెళ్లిచూపులకు ఎంట్రీ ఇస్తారు‌. దాంతో శ్రీవల్లి షాక్ అవుతుంది. భాగ్యం, ఆనందరావు కూడా వస్తారు. వాళ్ళు ఏం జరిగిందో శ్రీవల్లికి చెప్తారు. వాళ్ళు చెప్పాల్సింది మొత్తం అబ్బాయి వాళ్ల నాన్నకి చెప్తారు కానీ అతనికి చెవులు వినిపించవు.. వాళ్ల అమ్మ కి చెప్పేలోపు అటువైపు గా ప్రేమ, ధీరజ్ వెళ్లడం చూసి మళ్ళీ చెప్పలేకపోయామని శ్రీవల్లికి భాగ్యం చెప్తుంది.