English | Telugu

గీతకు ఫ్యాన్ ఇచ్చిన గిఫ్ట్ వేరే లెవెల్

తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 2 చక్కని కంటెస్టెంట్స్ తో మంచి సాంగ్ పెర్ఫార్మెన్సెస్ తో ప్రతీ వారం ఈ వారం కూడా అలరించింది. బెస్ట్ ఫ్యాన్ మూమెంట్స్ గురించి హేమచంద్ర అడిగేసరికి జడ్జి కార్తిక్ మాట్లాడుతూ "నేను, నా సాంగ్స్ అంటే ఎంతో ఇష్టపడే ఒక లేడీ ఫ్యాన్ కేవలం నా సాంగ్స్ పాడడం కోసమే ఆమె పియానో నేర్చుకున్నారు" అని చెప్పాడు. తర్వాత గీత మాధురి మాట్లాడబోతుండగా "గీత ఫ్యాన్ నే ఇక్కడున్నా" అని కోటి చెప్పడంతో గీత ఫుల్ ఎక్సయిట్ అయ్యింది.

"నా బర్త్డే ఆగష్టు 24 1989 . ఈ నంబర్స్ వచ్చేలా వన్ రూపీ, ఫైవ్ రూపీ ఇలా అన్ని రకాల నోట్స్ కలెక్ట్ చేసి నాకు పంపించాడు. ఆ అబ్బాయి దాని కోసం చాలా ఎఫర్ట్ పెట్టాడు. దాని కింద అతని పేరు కూడా రాసుకోలేదు. థ్యాంక్యూ గీతక్క..ప్రేమతో పవన్ కళ్యాణ్ అభిమాని" అని రాసి పంపించాడు అని చెప్పింది. ఇక థమన్ మాట్లాడుతూ "దాస్ అని నాకు ఒక అభిమాని ఉన్నాడు. ఆయన నా మీద అభిమానాన్ని చాటేందుకు మౌంట్ ఎవరెస్టు ఎక్కి అక్కడ నా ఫోటో పట్టుకుని నిలబడ్డాడు. అది చాలా ఫెంటాస్టిక్ మూమెంట్. మనమైతే ఏ కొండా ఎక్కలేము చాలా కష్టం. ఎవరెస్ట్ కన్నా హైట్ గా ఎదిగావ్ కదా..ఈ సందర్భంగా నా ఫ్యాన్ దాస్ కి థ్యాంక్యూ చెప్తున్నా..." అంటూ అతని ఫోటోను కూడా బ్యాక్ గ్రౌండ్ లో చూపించాడు. తర్వాత సింగర్ కార్తికేయకి కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ బాగా ఉంది ఆడియన్స్ లో అని చెప్పాడు హేమచంద్ర.

ఇక కార్తికేయ మాట్లాడుతూ "నేను, నా పేరెంట్స్ అసలు ఇంత ఫ్యాన్ ఫాలోయింగ్ ని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు..మా చెల్లి నన్ను బాగా టీజ్ చేస్తోంది" అని చెప్పాడు. ఇక కార్తికేయ "లంకేశ్వరుడు" మూవీ నుంచి "పదహారేళ్ళ వయసు" సాంగ్ ని ఇరగదీసి పాడి వినిపించాడు. ఆ కుర్రాడి పాటకు కోటి సీట్ లోంచి లేచి స్టేజి మీద వెళ్లారు. ఇక జడ్జెస్ అందరూ కార్తికేయ పెర్ఫార్మెన్స్ కి ఫిదా ఇపోయారు. కోటి - కార్తికేయ ఇద్దరూ కలిసి స్టేజి మీద గిటార్ తో జుగల్బందీ చేసి ఆకట్టుకున్నారు. కార్తికేయ వయసు 16 . ఇదే ఏజ్ లో తాను కెరీర్ స్టార్ట్ చేసినట్టు చెప్పారు కోటి.

Podharillu : మహా, చక్రిలని వెతకడానికి రంగంలోకి దిగిన రౌడీలు.. ప్రతాప్ పట్టుకుంటాడా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -23 లో...మహా ఇంట్లో నుండి వెళ్లిపోతున్నట్లు లెటర్ రాసి బయటకు వచ్చి వాళ్ళ నాన్నని గుర్తుచేసుకొని ఏడుస్తుంది. ఎలాగోలా బయటకు వచ్చేస్తుంది మహా. ఆ తర్వాత చక్రి తీసుకొని వచ్చిన కార్ ఎక్కుతుంది. ముందు అ ఫోన్ నుండి సిమ్ తియ్యండి సిగ్నల్స్ ద్వారా ట్రేస్ చేస్తే ఎక్కడున్నామో తెలుస్తుందని చక్రి అనగానే అవునని సిమ్ తియ్యబోతుంటే భూషణ్ ఫోన్ చేస్తాడు. వీడికి బాకీ ఉన్న మాటలు బాగా ఉన్నాయని ఫోన్ లిఫ్ట్ చేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది. రేపు పెళ్లి పెట్టుకొని ఇలా మాట్లాడుతున్నావ్ ఏంటని భూషణ్ అంటాడు.

Jayam serial : గంగని టార్గెట్ చేసిన పారు.. రుద్ర గది నుండి బయటకు రాగలడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -162 లో... రుద్ర ఇంటికి రావడంతో శకుంతల కోప్పడుతుంది. ఆ గంగ అకాడమీలో స్టే చెయ్యడంతో ఈ ఇంటి పరువుపోతుంది వెంటనే తీసుకొని రమ్మని శకుంతల చెప్తుంది. రుద్ర తన నిర్ణయాన్ని పట్టించుకోడు. అ తర్వాత రుద్ర మళ్ళీ గంగ ఉన్న అకాడమీ దగ్గరున్న టీ షాప్ కి వెళ్లి కాసేపు ఆలోచిస్తాడు. ఇక గంగకి అకాడమీ వాళ్ళు ఏదైనా ఇబ్బంది పెడుతున్నారేమో అని ఆలోచించిన రుద్ర అక్కడ టీ షాప్ లో ఒక బుక్ తీసుకొని అకాడమీ కాంపౌండ్ దగ్గరికి వెళ్తాడు. గంగకి ఒక పేపర్ లో మెసేజ్ రాసి లోపలికి విసురుతాడు.

Illu illalu pillalu : అమూల్యకి పెళ్ళిచూపులు.. కామాక్షి ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -362 లో.. పెళ్లిచూపులకి ఇంకా రావడం లేదని రామరాజు వాళ్ళు ఎదురుచూస్తుంటే వాళ్ళు రారుగా అని శ్రీవల్లి మనసులో అనుకుంటుంది. అప్పుడే అబ్బాయి వాళ్ళు పెళ్లిచూపులకు ఎంట్రీ ఇస్తారు‌. దాంతో శ్రీవల్లి షాక్ అవుతుంది. భాగ్యం, ఆనందరావు కూడా వస్తారు. వాళ్ళు ఏం జరిగిందో శ్రీవల్లికి చెప్తారు. వాళ్ళు చెప్పాల్సింది మొత్తం అబ్బాయి వాళ్ల నాన్నకి చెప్తారు కానీ అతనికి చెవులు వినిపించవు.. వాళ్ల అమ్మ కి చెప్పేలోపు అటువైపు గా ప్రేమ, ధీరజ్ వెళ్లడం చూసి మళ్ళీ చెప్పలేకపోయామని శ్రీవల్లికి భాగ్యం చెప్తుంది.