English | Telugu

30 రోజుల్లో యాంకరింగ్ నేర్చుకోవడం ఎలా ? 

ఫ్యామిలీ స్టార్ నెక్స్ట్ వీక్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఈ షోని సమ్మర్ హాలిడేస్ స్పెషల్ థీమ్ గా రాబోతోంది. ఇక పిల్లలందరూ కలిసి ఈ షోకి వచ్చారు. సుధీర్ అడిగిన ప్రశ్నలకు పిల్లలు కొంటెగా జవాబులు కూడా ఇచ్చి నవ్వించారు. ఇక పవిత్ర ఐతే టోటల్ గా జోకర్ గెటప్ లో వచ్చి డాన్సులు చేసి పిల్లలను, పెద్దలను అలరించింది. ఈ షోకి గెస్టులుగా "సారంగపాణి జాతకం" మూవీ టీమ్ నుంచి ప్రియదర్శి, రూప వచ్చారు. వాళ్ళు కూడా ఫుల్ గా ఈ షోని ఎంజాయ్ చేశారు. వాళ్ళతో లెమన్ అండ్ స్పూన్ ఆడించాడు హోస్ట్ సుధీర్. సుధీర్ మరదలి చేస్తున్న స్రవంతి కూడా చిన్నపిల్లలనే నటించింది. "బావా నెమలీకలు పిల్లల్ని పెట్టాయి..ఎం చెయ్యను" అని అడిగింది. "డైపర్లు వేసి స్కూల్ కి పంపించు" అంటూ ఇంకా కొంటెగా ఆన్సర్ ఇచ్చాడు సుధీర్.

ఇక లిటిల్ సింగర్ వాగ్దేవిని పిలిచి "అమ్మ వాగ్దేవి ఒక పక్షి తన గూట్లోని గుడ్ల మీద ఎందుకు కూర్చుంటుంది" అని అడిగేసరికి "వాటికి మనలా సోఫాలు ఉండవు కదా" అని చెప్పేసరికి మిగతా పిల్లలు చప్పట్లు కొట్టి అబ్బా ఎం చెప్పింది అంటూ పొగిడేశారు. ఆ తర్వాత జువేరియాని పిలిచాడు. ఈమె అలీ అన్న కూతురు అంటూ పరిచయం చేసాడు. ఆమె ఒక బుక్ తీసుకొచ్చి సుధీర్ చేతికి ఇచ్చింది. "నా కోసం ఒక గిఫ్ట్ తెచ్చింది" అంటూ గిఫ్ట్ ఓపెన్ చేసేసారికి షాకయ్యాడు "30 రోజుల్లో యాంకరింగ్ నేర్చుకోవడం ఎలా" అనే బుక్ చూసేసరికి షాకయ్యాడు. ఇదేంటమ్మా అని అడిగేసరికి "ఇంకో బుక్ ఉంది...నెక్స్ట్ ఇయర్ తెస్తాలే...60 రోజుల్లో ఆర్టిస్ట్ ఎలా అవ్వాలా" అనే బుక్ అని కౌంటర్ ఇచ్చింది. ఇక ప్రియదర్శితో కూడా పిల్లలతో పాటు లెమన్ అండ్ స్పూన్ ఆడిగాడు సుధీర్. పవిత్ర జోకర్ గెటప్ లో వచ్చేసరికి నెటిజన్స్ కూడా జోకర్ లా నవ్వించడం అంతా ఈజీ కాదు పవిత్ర బాగా చేసింది అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Podharillu : మహా, చక్రిలని వెతకడానికి రంగంలోకి దిగిన రౌడీలు.. ప్రతాప్ పట్టుకుంటాడా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -23 లో...మహా ఇంట్లో నుండి వెళ్లిపోతున్నట్లు లెటర్ రాసి బయటకు వచ్చి వాళ్ళ నాన్నని గుర్తుచేసుకొని ఏడుస్తుంది. ఎలాగోలా బయటకు వచ్చేస్తుంది మహా. ఆ తర్వాత చక్రి తీసుకొని వచ్చిన కార్ ఎక్కుతుంది. ముందు అ ఫోన్ నుండి సిమ్ తియ్యండి సిగ్నల్స్ ద్వారా ట్రేస్ చేస్తే ఎక్కడున్నామో తెలుస్తుందని చక్రి అనగానే అవునని సిమ్ తియ్యబోతుంటే భూషణ్ ఫోన్ చేస్తాడు. వీడికి బాకీ ఉన్న మాటలు బాగా ఉన్నాయని ఫోన్ లిఫ్ట్ చేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది. రేపు పెళ్లి పెట్టుకొని ఇలా మాట్లాడుతున్నావ్ ఏంటని భూషణ్ అంటాడు.

Jayam serial : గంగని టార్గెట్ చేసిన పారు.. రుద్ర గది నుండి బయటకు రాగలడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -162 లో... రుద్ర ఇంటికి రావడంతో శకుంతల కోప్పడుతుంది. ఆ గంగ అకాడమీలో స్టే చెయ్యడంతో ఈ ఇంటి పరువుపోతుంది వెంటనే తీసుకొని రమ్మని శకుంతల చెప్తుంది. రుద్ర తన నిర్ణయాన్ని పట్టించుకోడు. అ తర్వాత రుద్ర మళ్ళీ గంగ ఉన్న అకాడమీ దగ్గరున్న టీ షాప్ కి వెళ్లి కాసేపు ఆలోచిస్తాడు. ఇక గంగకి అకాడమీ వాళ్ళు ఏదైనా ఇబ్బంది పెడుతున్నారేమో అని ఆలోచించిన రుద్ర అక్కడ టీ షాప్ లో ఒక బుక్ తీసుకొని అకాడమీ కాంపౌండ్ దగ్గరికి వెళ్తాడు. గంగకి ఒక పేపర్ లో మెసేజ్ రాసి లోపలికి విసురుతాడు.

Illu illalu pillalu : అమూల్యకి పెళ్ళిచూపులు.. కామాక్షి ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -362 లో.. పెళ్లిచూపులకి ఇంకా రావడం లేదని రామరాజు వాళ్ళు ఎదురుచూస్తుంటే వాళ్ళు రారుగా అని శ్రీవల్లి మనసులో అనుకుంటుంది. అప్పుడే అబ్బాయి వాళ్ళు పెళ్లిచూపులకు ఎంట్రీ ఇస్తారు‌. దాంతో శ్రీవల్లి షాక్ అవుతుంది. భాగ్యం, ఆనందరావు కూడా వస్తారు. వాళ్ళు ఏం జరిగిందో శ్రీవల్లికి చెప్తారు. వాళ్ళు చెప్పాల్సింది మొత్తం అబ్బాయి వాళ్ల నాన్నకి చెప్తారు కానీ అతనికి చెవులు వినిపించవు.. వాళ్ల అమ్మ కి చెప్పేలోపు అటువైపు గా ప్రేమ, ధీరజ్ వెళ్లడం చూసి మళ్ళీ చెప్పలేకపోయామని శ్రీవల్లికి భాగ్యం చెప్తుంది.