English | Telugu

Illu illalu pillalu: శ్రీవల్లికి ఇచ్చిపడేసిన నర్మద.. గొడవని ఆపిన అత్త!


స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -169 లో... రామరాజుకి శ్రీవల్లి ఫొటోస్ చూపించడంతో సాగర్ , నర్మద రాగానే తిడతాడు. చెప్పిన పని చెయ్యకుండా భార్యతో కలిసి షికారు అంటూ తిరుగుతావా అని సాగర్ పై రామరాజు విరుచుకుపడతాడు. చిన్నోడికి బాధ్యత తెలియదు.. నీకు నా మాట అంటే విలువ లేదని సాగర్ ని రామరాజు తిడతాడు.

ప్రేమ గదిలోకి వచ్చేసరికి నర్మద ఉండదు.. కోపంతో ఎక్కడికైనా వెళ్ళిందేమోనని వేదవతితో ప్రేమ చెప్తుంది. ఎక్కడికి వెళ్ళదు.. నాకూ తెలుసు ఎక్కడికి వెళ్లి ఉంటుందో అని కిచెన్ లోకి తీసుకొని వెళ్తుంది వేదవతి. అక్కడ నర్మద కోపంతో అరిసెలు తింటుంది. అది చూసి ప్రేమ నవ్వుకుంటుంది. అసలు మావయ్య గారికి ఫోటోస్ ఎవరు చూపించారని నర్మద అడుగుతుంది. వేదవతి చెప్పకంటున్నా కూడా ప్రేమ వినకుండా శ్రీవల్లి పేరు చెప్పగానే ఆవేశంగా శ్రీవల్లి దగ్గరికి వెళ్తుంది నర్మద.

మావయ్య గారికి ఎందుకు ఫోటోస్ చూపించావని శ్రీవల్లిని నర్మద అడుగుతుంది. ప్రతీదాంట్లో ఎందుకు దూరతావని నర్మద అడుగుతుంది. నేను ఈ ఇంటికి పెద్దకోడలిని అని శ్రీవల్లి అంటుంది. ఇద్దరు గొడవ పెట్టుకుంటుంటే వేదవతి వచ్చి ఆపుతుంది. మీరు ఎందుకు ఇలా గొడవ పెట్టుకుంటున్నారని అడుగుతుంది. ఇంకొకసారి నా విషయంలో జోక్యం చేసుకోకని చెప్పండి అని వేదవతితో నర్మద చెప్తుంది. ఆ తర్వాత రాత్రివేళ ధీరజ్ ని ఆట పట్టిస్తుంది ప్రేమ. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Jayam serial : బాక్సింగ్ పోటీలో మిస్సెస్ గంగ రుద్ర ప్రతాప్.. పారు ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -160 లో..... గంగని ఎలాగైనా అకాడమీ సెలక్షన్ కి వెళ్లకుండా ఆపాలని ఇషిక, వీరు ట్రై చేస్తారు కానీ గంగ, రుద్ర ఇద్దరు కలిసి ఇంట్లో అన్ని పనులు పూర్తి చేసి అకాడమీకి వెళ్తారు. రుద్ర అకాడమీ బయటే ఉంటాడు. నాకు సంబంధించిన కేసు ఇంకా పెండింగ్ లో ఉంది అలా ఉండగా.. నేను లోపలకు రాకూడదని రుద్ర బయటే ఉండి గంగకి అంతా వివరిస్తాడు. నేను నీ పేరు మైక్ లో రావడం వినాలని రుద్ర అంటాడు. గంగ లోపలకు వెళ్తుంది. అక్కడ పారు ఇంకా తన ఫ్రెండ్స్ కలిసి గంగని చులకనగా మాట్లాడుతారు.

Brahmamudi : రుద్రాణిని రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన కనకం!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -922 లో.. ఒకతను వచ్చి రుద్రాణికి మళ్ళీ పసరు మందు ఇస్తాడు. ఆ పసరు మందు పని చేస్తుందా లేదా అని రుద్రాణి అతన్ని అడుగుతుంది. పని చేస్తుందని అతను చెప్తాడు. దాంతో రుద్రాణి పసరు మందు తీసుకొని లోపలికి వెళ్తుంటే అప్పుడే కనకం ఎదురుపడుతుంది. కనకాన్ని చూసి రుద్రాణి టెన్షన్ పడుతుంది. చేతిలో అదేంటీ అని కనకం అనగానే ఇదా.... నాకే పసరు మందు అజీర్తికి వాడమని చెప్పారని చెప్పి రుద్రాణి వెళ్ళిపోతుంది. అలా అయితే ఇంత రాత్రివేళ తీసుకొని వెళ్తుంది ఏంటని కనకంకి డౌట్ వస్తుంది.