English | Telugu

తేజు బిగ్ బాస్ కి వెళ్తోందా? డివోర్స్ అన్నప్పుడు డాడీ ఉంటే బాగుండు అనిపించింది

కాకమ్మ కథలు న్యూ ప్రోమో రిలీజ్ ఐపోయింది. ఈ న్యూ ఎపిసోడ్ కి యాంకర్ రవి, తేజస్విని గౌడ వచ్చారు. ఇక ఈ షోలో తేజస్విని గౌడ డివోర్స్ విషయం మీద కొన్ని విషయాలు నడిచాయి. "తేజు బిగ్ బాస్ కి వెళ్తోందా" అని హోస్ట్ అడిగేసరికి ఒక్కసారి ఊపిరి బిగబట్టి కూర్చుంది తేజు. "మీరు అమర్ తో డివోర్స్ తీసుకుంటున్నారా" అని మళ్ళీ హోస్ట్ అడిగింది. "రీసెంట్ టైమ్స్ లో కొన్ని సిట్యువేషన్స్ ఫేస్ చేసినప్పుడు అనిపించింది ఈ సందర్భంలో డాడీ ఉండి ఉంటే..అదొక్కటే నేను డాడీని నా లైఫ్ లో మిస్ ఐన టైం అంతే" అనే ఎమోషనల్ అయ్యేసరికి హోస్ట్ వెళ్లి ఆమెను ఓదార్చింది. తరువాత యాంకర్ రవిని అడిగింది హోస్ట్ " మీరు కెరీర్ లో తీసుకున్న ఒక రాంగ్ డెసిషన్ ఏమిటి" అనేసరికి "కొంతమంది చెప్పారు ఎంత చెప్పినా నాకు ఎక్కలేదు. దాంతో కొన్ని రాంగ్ షోస్ చేసాను. ఐతే తేజస్విని గౌడ విషయంలో ఇష్మార్ట్ జోడిలో అమరదీప్ తేజు డివోర్స్ విషయం మీద కొన్ని విషయాలు తెలిసాక సోషల్ మీడియాలో బాగా ట్రోలింగ్ కూడా జరిగింది.

కానీ ప్రతీ ఒక్కరి మ్యారీడ్ లైఫ్ ఇలాంటి కొన్ని పరిస్థితులు వస్తాయి కానీ దానికే డివోర్స్ తీసుకోవాలా...కాదు సర్దుకుపోవాలి అని కూడా చెప్పింది. తర్వాత హోస్ట్ ఒక ప్రశ్న వేసింది "యాంకరింగ్ తక్కువ యాక్టింగ్ ఎక్కువ అని ఎవరిని చూస్తే అనిపిస్తుంది" అని అడిగేసరికి "తేజు" అని ఆన్సర్ ఇచ్చాడు రవి. తేజస్విని మడివాడ యాంకరింగ్ కంటే యాక్టింగ్ అలాగే ఫన్ ఎక్కువగా క్రియేట్ చేస్తూ ఉంటుంది. ఇక ఇందులో కొన్ని పదాలు ఇచ్చి వాటితో స్టోరీ అల్లమని చెప్పింది..అందులో మంచు అనే పదం వచ్చేసరికి "ఇప్పుడు మంచు లక్ష్మి అక్క వస్తుంది ఓకే నా" అని అడిగాడు. "ప్లీజ్ కథ మధ్యలోకి అక్కను తీసుకురావద్దు" అని తెగ పగలబడి నవ్వుతూ చెప్పింది హోస్ట్ తేజు. ఇక తేజస్విని-అమరదీప్ ప్రతీ షోలో కనిపిస్తూ ఉంటారు. వీళ్ళు కనిపించని షో అంటూ ఏదీ ఉండదు.

Podharillu : మహా, చక్రిలని వెతకడానికి రంగంలోకి దిగిన రౌడీలు.. ప్రతాప్ పట్టుకుంటాడా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -23 లో...మహా ఇంట్లో నుండి వెళ్లిపోతున్నట్లు లెటర్ రాసి బయటకు వచ్చి వాళ్ళ నాన్నని గుర్తుచేసుకొని ఏడుస్తుంది. ఎలాగోలా బయటకు వచ్చేస్తుంది మహా. ఆ తర్వాత చక్రి తీసుకొని వచ్చిన కార్ ఎక్కుతుంది. ముందు అ ఫోన్ నుండి సిమ్ తియ్యండి సిగ్నల్స్ ద్వారా ట్రేస్ చేస్తే ఎక్కడున్నామో తెలుస్తుందని చక్రి అనగానే అవునని సిమ్ తియ్యబోతుంటే భూషణ్ ఫోన్ చేస్తాడు. వీడికి బాకీ ఉన్న మాటలు బాగా ఉన్నాయని ఫోన్ లిఫ్ట్ చేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది. రేపు పెళ్లి పెట్టుకొని ఇలా మాట్లాడుతున్నావ్ ఏంటని భూషణ్ అంటాడు.

Jayam serial : గంగని టార్గెట్ చేసిన పారు.. రుద్ర గది నుండి బయటకు రాగలడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -162 లో... రుద్ర ఇంటికి రావడంతో శకుంతల కోప్పడుతుంది. ఆ గంగ అకాడమీలో స్టే చెయ్యడంతో ఈ ఇంటి పరువుపోతుంది వెంటనే తీసుకొని రమ్మని శకుంతల చెప్తుంది. రుద్ర తన నిర్ణయాన్ని పట్టించుకోడు. అ తర్వాత రుద్ర మళ్ళీ గంగ ఉన్న అకాడమీ దగ్గరున్న టీ షాప్ కి వెళ్లి కాసేపు ఆలోచిస్తాడు. ఇక గంగకి అకాడమీ వాళ్ళు ఏదైనా ఇబ్బంది పెడుతున్నారేమో అని ఆలోచించిన రుద్ర అక్కడ టీ షాప్ లో ఒక బుక్ తీసుకొని అకాడమీ కాంపౌండ్ దగ్గరికి వెళ్తాడు. గంగకి ఒక పేపర్ లో మెసేజ్ రాసి లోపలికి విసురుతాడు.