English | Telugu

హరి నువ్వు రాసుకుంటేనే నీకు పంచులు వస్తాయి

కూకు విత్ జాతిరత్నాలు షో ప్రోమో రిలీజ్ అయ్యింది. ఐతే అది ఫుల్ ఎంటర్టైనింగ్ గా ఉంది. ఇక ఈ షోకి హరి, ఇమ్మానుయేల్, బాబా భాస్కర్, సుహాసిని, రీతూ వచ్చారు. హరి మెడలో ఉన్న విజిల్ చూసిన ప్రదీప్ "ఏంటి నువ్వు మెడలో విజిల్ వేసుకొచ్చావ్" అని అడిగాడు. దానికి ఇమ్ము ఆన్సర్ ఇచ్చాడు. "పొద్దున్నే మనోడు ఇదే పనికి వెళ్తూ ఉంటాడు. విజిల్ వేయగానే తడి చెత్త, పొడి చెత్త తీసుకొస్తారు" అని కౌంటర్ వేసాడు ఇమ్ము. ఇక ఈ షోకి తమ్ముడు మూవీ నుంచి ఎవర్ గ్రీన్ యాక్ట్రెస్ లయ కూడా ఈ షోకి వచ్చింది. అలాగే దిల్ రాజు కూడా వచ్చారు. "దిల్ రాజు గారు మీరు ఏ ఫుడ్ ఇష్టం" అంటూ రాధ అడిగారు. "ఫేవరేట్ ఫుడ్ అంటే నాకు డెజర్ట్స్ అంటే చాలా ఇష్టం" అని చెప్పారు.

దానికి ఇమ్ము రియాక్ట్ అయ్యాడు. "రాజు గారికి స్వీట్ ఇష్టం కాబట్టి కాకరకాయతో కూర కాకుండా స్వీట్ చేస్తాం" అని చెప్పాడు. దాంతో దిల్ రాజు షాకై కాకరకాయతో స్వీట్ ఏంట్రా అంటూ కౌంటర్ వేశారు. తర్వాత మళ్ళీ "చిన్నప్పుడు ఆయా నా మీద అరుస్తూ ఉంటే ఆయా ఆయా అని పిలిచేవాడిని కాదు లయా లయా అని పిలిచేవాడిని" అని చెప్పేసరికి లయ, దిల్ రాజు నవ్వేశారు. ఇక హరి ఏదో డైలాగ్ చెప్పబోయాడు కానీ పాపం చెప్పలేకపోయాడు. దాంతో రాధ హరి పరువు తీసేసారు. "నీకు స్పాంటేనియస్ గా రావు పంచులు నువ్వు రాసుకుంటేనే వస్తాయి" అనేసరికి హరి షాక్ అయ్యాడు.

Jayam serial: వీరూ ప్లాన్ ని కనిపెట్టిన గంగ.. రుద్ర తెలుసుకుంటాడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -146 లో.... రుద్రకి ఎదురుగా గంగ వెళ్తుంది కానీ రుద్ర ఫోన్ మాట్లాడుతూ వెళ్ళిపోతాడు. కొంచెం దూరం వెళ్ళగానే రుద్రకి రింగ్ కనిపిస్తుంది. అది తీసుకొని చూస్తాడు. అప్పుడే ప్రమీల, ప్రీతీ వస్తారు. అన్నయ్య ఆ రింగ్ గంగ వదినది అని ప్రీతీ అంటుంది. ఈ రింగ్ ప్రపంచంలో ఆవిడకి ఒక్కదానికే ఉందా ఏంటని రుద్ర అంటాడు. ఆ తర్వాత అటుగా వెళ్తున్న గంగని రుద్ర పిలుస్తాడు. గంగ ముసుగులో ఉంటుంది. రుద్ర పిల్వగానే వస్తుంది. ఈ రింగ్ మీదేనా అని అడుగుతాడు. గంగ నాదేనని తీసుకుంటుంది..