English | Telugu

అత్యధిక ఫాలోయింగ్ తో నెంబర్ వన్ స్థానంలో కామన్ మ్యాన్

బిగ్ బాస్ సీజన్-7 లో మొత్తం పద్నాలుగు మంది కంటెస్టెంట్స్ ఉండగా అత్యధిక ఫాలోయింగ్ ఉన్న కంటెస్టెంట్ పల్లవి ప్రశాంత్. వ్యవసాయం వ్యవసాయాధారిత కుటుంబంలో పుట్టి బిగ్ బాస్ కి వెళ్ళాలనే కోరికతో దొరికిన ప్రతీ అవకాశాన్ని ఒడిసిపట్టుకొని బిగ్ బాస్ లోకి అడుగుపెట్టాడు పల్లవి ప్రశాంత్. ఒకనొక దశలో చనిపోవడానికి సిద్ధమైన పల్లవి ప్రశాంత్.. వాళ్ళ నాన్న చెప్పిన కొన్ని మాటలతో బ్రతికాడని, ఇక చచ్చేం సాధిస్తాం, ఉన్నప్పుడే అనుకున్నది సాధించాలనే తపనతో బిగ్ బాస్ హౌజ్ లోకి అడుగుపెట్టాడు పల్లవి ప్రశాంత్.

బిగ్ బాస్ సీజన్-7 ఉల్టా పల్టా తో మొదలైన సంగతి అందరికి తెలిసిందే. అయితే పవరస్త్రని ఎవరైతే దక్కించుకుంటారో వారే హౌజ్ లో ఉండటానికి అర్హులని అప్పటిదాకా కంటెస్టెంట్స్ మాత్రమే అని హోస్ట్ నాగార్జున చెప్పగా.‌ దానికి తగ్గట్టుగానే పల్లవి ప్రశాంత్ కష్టపడుతున్నాడు. అయితే బిగ్ బాస్ హౌజ్ లో అందరూ దాదాపు సీరియల్స్, సినిమాలలో నటించి ఎంతో కొంత గుర్తింపు తెచ్చుకున్నవాళ్ళే.. దాంతో అందరు కామన్ మ్యాన్ పల్లవి ప్రశాంత్ ని టార్గెట్ చేసినట్టుగా తెలుస్తుంది. రైస్ బ్యాగ్, వాళ్ళ ఊరిలోని మట్టితో హౌజ్ లోకి అడుగుపెట్టిన పల్లవి ప్రశాంత్.. నాగార్జున ప్రశంసలు దక్కుంచుకున్నాడు. హౌజ్ లోకి వెళ్ళినప్పటి నుండి అందరితో కలిసి పోవాలనుకుంటున్న పల్లవి ప్రశాంత్ ని కావాలని కార్నర్ చేయాలని ప్రియాంక జైన్ నామినేషన్ చేసింది. దీంతో ప్రియాంక జైన్ మీద ఇప్పటికే ట్రోల్స్ మొదలుపెట్టారు నెటిజన్లు.

నామినేషన్ల ప్రక్రియ మొదలవగానే అందరూ పల్లవి ప్రశాంత్ పేరు చెప్తున్నారు. ఎందుకంటే అతనైతే గట్టిగా అనలేడనేమో, కమ్యూనికేషన్ ప్రాబ్లమ్ అంటు ఒకరు నామినేట్ చేయగా, మాటతీరు బాగాలేదని మరొకరు, కలవట్లేదని మరొకరు ఇలా ఒక్కొక్కరు ఒక్కో కారణంతో అందరు అతడినే టార్గెట్ చేస్తున్నారు. ఇక విరిగిపోయిన పల్లవి ప్రశాంత్ తనది తప్పు కాదని, తనకి కనిపించింది చెప్తుంటే అతనని అవహేళన చేస్తూ వెక్కిలి నవ్వులు నవ్వుకుంటున్నారు ప్రియాంక జైన్, అమర్ దీప్, కిరణ్ రాథోర్, షకీల.. ఇలా అందరూ కలిసి పల్లవి ప్రశాంత్ ని టార్గెట్ చేసినట్టుగా ‌బిగ్ బాస్ చూసే ప్రేక్షకులకు తెలిసిపోతుంది. అయితే పల్లవి ప్రశాంత్ మాత్రం గొడవలకు, వాదనలకు వెళ్ళకుండా తను చెప్పాలనుకున్నది చెప్పేశాడు ప్రశాంత్. అయితే బయట పద్నాలుగు మంది కంటెస్టెంట్స్ యొక్క సోషల్ మీడియా ఫాలోయింగ్ చూస్తే అత్యధికంగా అయిదు లక్షల పైచిలుకు ఫాలోవర్స్ తో పల్లవి ప్రశాంత్ టాప్ లో ఉండగా, అమర్ దీప్, ప్రియాంక జైన్ నాలుగు లక్షల పైచిలుకు ఫాలోవర్స్ తో రెండు మూడు స్థానాలలో ఉన్నారు.

Podharillu : మహా, చక్రిలని వెతకడానికి రంగంలోకి దిగిన రౌడీలు.. ప్రతాప్ పట్టుకుంటాడా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -23 లో...మహా ఇంట్లో నుండి వెళ్లిపోతున్నట్లు లెటర్ రాసి బయటకు వచ్చి వాళ్ళ నాన్నని గుర్తుచేసుకొని ఏడుస్తుంది. ఎలాగోలా బయటకు వచ్చేస్తుంది మహా. ఆ తర్వాత చక్రి తీసుకొని వచ్చిన కార్ ఎక్కుతుంది. ముందు అ ఫోన్ నుండి సిమ్ తియ్యండి సిగ్నల్స్ ద్వారా ట్రేస్ చేస్తే ఎక్కడున్నామో తెలుస్తుందని చక్రి అనగానే అవునని సిమ్ తియ్యబోతుంటే భూషణ్ ఫోన్ చేస్తాడు. వీడికి బాకీ ఉన్న మాటలు బాగా ఉన్నాయని ఫోన్ లిఫ్ట్ చేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది. రేపు పెళ్లి పెట్టుకొని ఇలా మాట్లాడుతున్నావ్ ఏంటని భూషణ్ అంటాడు.

Jayam serial : గంగని టార్గెట్ చేసిన పారు.. రుద్ర గది నుండి బయటకు రాగలడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -162 లో... రుద్ర ఇంటికి రావడంతో శకుంతల కోప్పడుతుంది. ఆ గంగ అకాడమీలో స్టే చెయ్యడంతో ఈ ఇంటి పరువుపోతుంది వెంటనే తీసుకొని రమ్మని శకుంతల చెప్తుంది. రుద్ర తన నిర్ణయాన్ని పట్టించుకోడు. అ తర్వాత రుద్ర మళ్ళీ గంగ ఉన్న అకాడమీ దగ్గరున్న టీ షాప్ కి వెళ్లి కాసేపు ఆలోచిస్తాడు. ఇక గంగకి అకాడమీ వాళ్ళు ఏదైనా ఇబ్బంది పెడుతున్నారేమో అని ఆలోచించిన రుద్ర అక్కడ టీ షాప్ లో ఒక బుక్ తీసుకొని అకాడమీ కాంపౌండ్ దగ్గరికి వెళ్తాడు. గంగకి ఒక పేపర్ లో మెసేజ్ రాసి లోపలికి విసురుతాడు.

Illu illalu pillalu : అమూల్యకి పెళ్ళిచూపులు.. కామాక్షి ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -362 లో.. పెళ్లిచూపులకి ఇంకా రావడం లేదని రామరాజు వాళ్ళు ఎదురుచూస్తుంటే వాళ్ళు రారుగా అని శ్రీవల్లి మనసులో అనుకుంటుంది. అప్పుడే అబ్బాయి వాళ్ళు పెళ్లిచూపులకు ఎంట్రీ ఇస్తారు‌. దాంతో శ్రీవల్లి షాక్ అవుతుంది. భాగ్యం, ఆనందరావు కూడా వస్తారు. వాళ్ళు ఏం జరిగిందో శ్రీవల్లికి చెప్తారు. వాళ్ళు చెప్పాల్సింది మొత్తం అబ్బాయి వాళ్ల నాన్నకి చెప్తారు కానీ అతనికి చెవులు వినిపించవు.. వాళ్ల అమ్మ కి చెప్పేలోపు అటువైపు గా ప్రేమ, ధీరజ్ వెళ్లడం చూసి మళ్ళీ చెప్పలేకపోయామని శ్రీవల్లికి భాగ్యం చెప్తుంది.