English | Telugu
నవంబర్ 20 నుంచి చెఫ్ మంత్ర ప్రాజెక్ట్ కే - సీజన్ 5
Updated : Nov 12, 2025
ఆహా ఓటిటిలో ఇండియన్ ఐడల్ షో పూర్తయిపోయింది. ఇక ఇప్పుడు చెఫ్ మంత్ర ప్రాజెక్ట్ కే - సీజన్ 5 త్వరలో ప్రారంభం కాబోతోంది. ఇప్పటి వరకు నాలుగు సీజన్స్ పూర్తి చేసుకున్న ఈ షో ఇప్పుడు కొత్త సీజన్ తో నవంబర్ 20 వ తేదీ రాత్రి 7 గంటల నుంచి ప్రసారం కాబోతోంది. దీనికి సంబంధించి ఒక చిన్న టీజర్ రిలీజ్ చేశారు. ఐతే అది కాస్తా బ్లర్ చేసి వేశారు. ఐతే అందులో ఎవరు ఉన్నారు అనే విషయం లైట్ కనిపిస్తూ ఉంది కానీ అసలు అందులో పార్టిసిపంట్స్ ఎవరన్నది ఇంకా పూర్తిగా తెలీదు. ఐతే మానస్, అఖిల్ సార్ధక, యాదమ్మ రాజు, కావ్యశ్రీ, ప్రేరణ, టేస్టీ తేజ, పంచ్ ప్రసాద్, యాష్మి ఉన్నట్టు కనిపిస్తోంది. ఆహా ఇన్స్టాగ్రామ్ లో ఈ పోస్ట్ పెట్టింది.
ఇక నెటిజన్స్ అంతా కూడా కావ్య - ప్రేరణ కాంబో సూపర్ గా ఉంటుంది, యాష్మి కోసం వెయిటింగ్ ఇక్కడా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇకపోతే హోస్ట్ ఎవరు అన్నది మాత్రం తెలియడం లేదు. అఖిల్ సార్థక్, మానస్ జోడి ఈ ప్రోగ్రాంని హోస్ట్ చేస్తారని నెటిజన్స్ కామెంట్స్ బట్టి తెలుస్తోంది. ఐతే గత సీజన్ చూసుకుంటే సుమ హోస్ట్ చేయగా నటుడు, చెఫ్ ఐన జీవన్ కుమార్ వంటలు టేస్ట్ చూసి మార్క్స్ ఇచ్చారు. ఇక జోడీస్ గా అమర్ దీప్ - అంబటి అర్జున్, యాదమ్మ రాజు - సుప్రీతా, దీపికా రంగరాజు - సమీరా భరద్వాజ్, ప్రష్షు బేబీ - ధరణి, ప్రసాద్ బెహరా - విరాజిత వీళ్లంతా కంటెస్టెంట్స్ గా ఉన్నారు. ఈ సీజన్ టైటిల్ విన్నర్ గా అమర్ దీప్ - అంబటి అర్జున్ జోడి నిలిచింది.