English | Telugu

Brahmamudi: అప్పుకి డౌట్.. రేఖ, రాహుల్, రుద్రాణి కుట్ర ఫలిస్తుందా?

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -918 లో... రేఖకి రాజ్ పాస్తా ఆర్డర్ చేసి ఇవ్వడం కావ్య చూసి కోపంగా లోపలికి వెళ్తుంది. ఆ విషయం ఇందిరాదేవికి చెప్పగానే రాజ్ ఎలాంటి వాడో తెలుసు కదా అని ఇందిరాదేవి అంటుంది. తెలుసు కానీ అతన్ని ఆటపట్టిస్తానని కావ్య చెప్తుంది.

మరొకవైపు సాండి డబ్బున్న సూట్ కేసుని రాహుల్ కి ఇస్తాడు. ఇది ఎలాగైనా రాజ్ కార్ లో పెట్టాలని అనుకుంటాడు. ఆ తర్వాత కావ్యకి రాజ్ భోజనం తీసుకొని వచ్చి తినమంటాడు. వద్దని తను అలుగుతుంది. వెళ్లి మీ రేఖకి తినిపించండి అని కావ్య అలుగుతుంటే బుజ్జగించి భోజనం తినిపిస్తాడు రాజ్. అదంతా రేఖ చూస్తుంది.

ఆ తర్వాత రాహుల్ సూట్ కేసు పట్టుకొని రాజ్ కార్ దగ్గరికి వస్తాడు. అప్పుడే అప్పు వచ్చి.. ఏంటి రాహుల్ అలా రాజ్ కార్ వంక చూస్తున్నావని అడుగుతుంది. ఏం లేదని రాహుల్ కంగారుపడతాడు. ఆ సూట్ కేసు ఏంటి.. నీకు ఎందుకు చెమటలు పడుతున్నాయని అప్పు అడుగుతుంది. అప్పుడ్ స్వప్న వచ్చి ఏంటి నా భర్త ఏమైనా క్రిమినల్ అనుకుంటున్నావా.. ఎందుకు అలా క్వశ్చన్ చేస్తున్నావని అంటుంది. అదేం లేదు అక్క అని అప్పు అంటుంది. నా ఫ్రెండ్ ఫారెన్ వెళ్తూ సూట్ కేసు ఇంట్లో ఇమ్మన్నాడు. నేను ప్రొద్దున ఇద్దామని ఇంటికి తీసుకొని వచ్చానని రాహుల్ చెప్తాడు. కానీ రాహుల్ పై అప్పుకి డౌట్ వస్తుంది.

ఆ తర్వాత కత్తితో రేఖ చేయి కోసుకోబోతుంటే రాజ్ వచ్చి వద్దని ప్రేమగా మాట్లాడతాడు. మరొకవైపు నాకు రాహుల్ పై డౌట్ ఉందని కళ్యాణ్ తో అప్పు చెప్తుంది. అదంతా ఏం పట్టించుకోకు రాహుల్ మారిపోయాడని కళ్యాణ్ చెప్తాడు.

ఆ తర్వాత రుద్రాణి దగ్గరికి రేఖ వెళ్లి.. అసలు నాకేం కావాలో పట్టించుకోవడం లేదని కోప్పడుతుంది. సరే చెప్పు నీకు ఏం కావాలోనని రుద్రాణి అనగానే నాకు బావ కావాలి.. తన ప్రేమ కావాలి అని రేఖ అనగానే రుద్రాణి షాక్ అవుతుంది. అది జరగదని రుద్రాణి అనగానే ఎందుకు జరగదు.. జరుగుతుందని రాహుల్ ఎంట్రీ ఇస్తాడు. ఇప్పుడు కావ్య కడుపు లో బిడ్డ లేకుండా చేస్తే మరొక బిడ్డని కనడానికి కావ్యకి ఎలాగు ఛాన్స్ లేదని డాక్టర్ చెప్పారు. సో ఇప్పుడు ఆ బిడ్డని లేకుండా చేస్తే ఇంటికి వారసత్వం కావాలి కాబట్టి రాజ్ కి కావ్య దగ్గరుండి మరి మళ్ళీ పెళ్లి చేస్తుందని రాహుల్ చెప్తాడు. దాంతో రేఖ, రుద్రాణి సరే అంటారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Jayam serial : బాక్సింగ్ పోటీలో మిస్సెస్ గంగ రుద్ర ప్రతాప్.. పారు ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -160 లో..... గంగని ఎలాగైనా అకాడమీ సెలక్షన్ కి వెళ్లకుండా ఆపాలని ఇషిక, వీరు ట్రై చేస్తారు కానీ గంగ, రుద్ర ఇద్దరు కలిసి ఇంట్లో అన్ని పనులు పూర్తి చేసి అకాడమీకి వెళ్తారు. రుద్ర అకాడమీ బయటే ఉంటాడు. నాకు సంబంధించిన కేసు ఇంకా పెండింగ్ లో ఉంది అలా ఉండగా.. నేను లోపలకు రాకూడదని రుద్ర బయటే ఉండి గంగకి అంతా వివరిస్తాడు. నేను నీ పేరు మైక్ లో రావడం వినాలని రుద్ర అంటాడు. గంగ లోపలకు వెళ్తుంది. అక్కడ పారు ఇంకా తన ఫ్రెండ్స్ కలిసి గంగని చులకనగా మాట్లాడుతారు.

Brahmamudi : రుద్రాణిని రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన కనకం!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -922 లో.. ఒకతను వచ్చి రుద్రాణికి మళ్ళీ పసరు మందు ఇస్తాడు. ఆ పసరు మందు పని చేస్తుందా లేదా అని రుద్రాణి అతన్ని అడుగుతుంది. పని చేస్తుందని అతను చెప్తాడు. దాంతో రుద్రాణి పసరు మందు తీసుకొని లోపలికి వెళ్తుంటే అప్పుడే కనకం ఎదురుపడుతుంది. కనకాన్ని చూసి రుద్రాణి టెన్షన్ పడుతుంది. చేతిలో అదేంటీ అని కనకం అనగానే ఇదా.... నాకే పసరు మందు అజీర్తికి వాడమని చెప్పారని చెప్పి రుద్రాణి వెళ్ళిపోతుంది. అలా అయితే ఇంత రాత్రివేళ తీసుకొని వెళ్తుంది ఏంటని కనకంకి డౌట్ వస్తుంది.