English | Telugu

Karthika Deepam 2: జ్యోత్స్నకి కార్తీక్ వార్నింగ్.. కాశీ కోసం పారిజాతం తపన!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2' (Karthika Deepam 2). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -555 లో... కార్తీక్, జ్యోత్స్న స్టేషన్ కి బయల్దేరతారు. కార్తీక్ మధ్యలో కార్ ఆపుతాడు. జ్యోత్స్నని దిగమని చెప్తాడు. ఏంటి బావ ఇక్కడ అపావని జ్యోత్స్న అడుగుతుంది. దీనంతంటికి కారణం జ్యోత్స్ననే అని కార్తీక్ ఇండైరెక్ట్ గా మాట్లాడుతాడు. నువ్వు ఏం అంటున్నావో నాకు అర్థం అయింది బావ కానీ శివన్నారాయణకి ఏకైక వారసురాలిని నేను.. ఇలా నా రెస్టారెంట్ గురించి ఎందుకు చేసుకుంటానని జ్యోత్స్న అంటుంది.

నువ్వు అని ఎవరు చెప్పారని కార్తీక్ అనగానే జ్యోత్స్న ఒక్కసారిగా టెన్షన్ పడుతుంది. అంటే నువ్వు అలా ఫీల్ అవ్వడం లేదుగా అని కార్తీక్ అంటాడు. నేను అనుకోకపోవడం ఏంటని జ్యోత్స్న అంటుంది. నాకు కాశీ అంత చెప్పాడు.. వైరా, కాశీ ఫోన్ రికార్డింగ్ చూస్తే నీ పరిస్థితి ఏంటి మళ్ళీ అత్తకి లేనిపోని టెన్షన్ ఎందుకని వదిలేస్తున్న ఇక మీదుట అసలు ఊరుకోనని జ్యోత్స్నకి కార్తీక్ వార్నింగ్ ఇస్తాడు.

ఆ తర్వాత ఇద్దరు స్టేషన్ కి వెళ్తారు. శ్రీధర్ ని స్టేషన్ నుండి వదిలేస్తారు. వైరా, కాశీని సెల్లో వేస్తారు. నిన్ను నా కొడుకు అనుకుని దగ్గర ఉంచుకుని అన్నీ నేర్పించి నీ చేత సొంతంగా రెస్టారెంట్ పెట్టిద్దామనుకున్న కానీ ఇలా వెన్నుపోటు పొడుస్తావనుకోలేదని కాశీతో శ్రీధర్ చెప్తూ ఎమోషనల్ అవుతాడు.

ఆ తర్వాత శివన్నారాయణ దగ్గరికి శ్రీధర్ వెళ్లి మావయ్య గారు నన్ను క్షమించండి అని అంటాడు. నువ్వు ఏం తప్పు చెయ్యలేదు మన సంస్థని కాపాడడానికి కార్తీక్ ఉన్నాడుగా అని శివన్నారాయణ మురిసిపోతాడు. కాశీని తీసుకొని రాలేదని పారిజాతం కోప్పడుతుంది. మీకు ఒక్కరికే తనపై బాధ్యత ఉన్నట్లు మాట్లాడకండి అని పారిజాతంపై దీప కోప్పడుతుంది. అనవసరంగా కాశీనీ ఇందులో లాగింది ఈ జ్యోత్స్ననే.. దీని సంగతి చెప్తానని పారిజాతం అనుకుంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Podharillu : మహా, చక్రిలని వెతకడానికి రంగంలోకి దిగిన రౌడీలు.. ప్రతాప్ పట్టుకుంటాడా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -23 లో...మహా ఇంట్లో నుండి వెళ్లిపోతున్నట్లు లెటర్ రాసి బయటకు వచ్చి వాళ్ళ నాన్నని గుర్తుచేసుకొని ఏడుస్తుంది. ఎలాగోలా బయటకు వచ్చేస్తుంది మహా. ఆ తర్వాత చక్రి తీసుకొని వచ్చిన కార్ ఎక్కుతుంది. ముందు అ ఫోన్ నుండి సిమ్ తియ్యండి సిగ్నల్స్ ద్వారా ట్రేస్ చేస్తే ఎక్కడున్నామో తెలుస్తుందని చక్రి అనగానే అవునని సిమ్ తియ్యబోతుంటే భూషణ్ ఫోన్ చేస్తాడు. వీడికి బాకీ ఉన్న మాటలు బాగా ఉన్నాయని ఫోన్ లిఫ్ట్ చేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది. రేపు పెళ్లి పెట్టుకొని ఇలా మాట్లాడుతున్నావ్ ఏంటని భూషణ్ అంటాడు.

Jayam serial : గంగని టార్గెట్ చేసిన పారు.. రుద్ర గది నుండి బయటకు రాగలడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -162 లో... రుద్ర ఇంటికి రావడంతో శకుంతల కోప్పడుతుంది. ఆ గంగ అకాడమీలో స్టే చెయ్యడంతో ఈ ఇంటి పరువుపోతుంది వెంటనే తీసుకొని రమ్మని శకుంతల చెప్తుంది. రుద్ర తన నిర్ణయాన్ని పట్టించుకోడు. అ తర్వాత రుద్ర మళ్ళీ గంగ ఉన్న అకాడమీ దగ్గరున్న టీ షాప్ కి వెళ్లి కాసేపు ఆలోచిస్తాడు. ఇక గంగకి అకాడమీ వాళ్ళు ఏదైనా ఇబ్బంది పెడుతున్నారేమో అని ఆలోచించిన రుద్ర అక్కడ టీ షాప్ లో ఒక బుక్ తీసుకొని అకాడమీ కాంపౌండ్ దగ్గరికి వెళ్తాడు. గంగకి ఒక పేపర్ లో మెసేజ్ రాసి లోపలికి విసురుతాడు.

Illu illalu pillalu : అమూల్యకి పెళ్ళిచూపులు.. కామాక్షి ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -362 లో.. పెళ్లిచూపులకి ఇంకా రావడం లేదని రామరాజు వాళ్ళు ఎదురుచూస్తుంటే వాళ్ళు రారుగా అని శ్రీవల్లి మనసులో అనుకుంటుంది. అప్పుడే అబ్బాయి వాళ్ళు పెళ్లిచూపులకు ఎంట్రీ ఇస్తారు‌. దాంతో శ్రీవల్లి షాక్ అవుతుంది. భాగ్యం, ఆనందరావు కూడా వస్తారు. వాళ్ళు ఏం జరిగిందో శ్రీవల్లికి చెప్తారు. వాళ్ళు చెప్పాల్సింది మొత్తం అబ్బాయి వాళ్ల నాన్నకి చెప్తారు కానీ అతనికి చెవులు వినిపించవు.. వాళ్ల అమ్మ కి చెప్పేలోపు అటువైపు గా ప్రేమ, ధీరజ్ వెళ్లడం చూసి మళ్ళీ చెప్పలేకపోయామని శ్రీవల్లికి భాగ్యం చెప్తుంది.