English | Telugu

Brahmamudi:డిజైనర్ గా కావ్య కొత్త జాబ్.. మరి రాజ్ పరిస్థితేంటి?

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -318 లో...‌ అప్పుకి తన ఫ్రెండ్ డెలివరీ బాయ్ గా చెయ్యడానికి జాబ్ ఇప్పిస్తుంది. ఆ తర్వాత కళ్యాణ్ విషయంలో నువ్వు ఫెయిల్ అయ్యావ్.. మంచి ఛాన్స్ మిస్ అయ్యావ్.. కళ్యాణ్ కి భార్య అయి ఉంటే నువ్వు ఆ ఇంటికి మహారాణి అయ్యేదని చివరి నిమిషంలో నువ్వు అనుకున్నది జరగలేదంటూ ఎగతాళి చేసినట్టుగా మాట్లాడేసరికి అప్పుకి కోపం వస్తుంది. నువ్వు జాబ్ ఇప్పించావ్ కాబట్టి నిన్నేం అనట్లేదు లేదంటే వేరెలా ఉండేది.. డబ్బులు చూసి ఆస్తులు చూసి ఆశపడేదాన్ని కాదు తన ఫ్రెండ్ కి స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తుంది అప్పు.

మరొకవైపు కావ్య చేసిన టిఫిన్ తినకుండా ధాన్యలక్ష్మి బ్రెడ్ ని మాడ్చి తీసుకొని వచ్చి ప్రకాష్ కి అనామికకి పెడుతుంది. అది చూసి నేను తిననని కావ్య చేసిన టిఫిన్ పెట్టమని చెప్తాడు. ఆ తర్వాత కావ్య ఆఫీస్ కి వెళ్తానని పెద్దమ్మకి చెప్పు అని కళ్యాణ్ సైగ చేస్తాడు. దాంతో కావ్య అత్తయ్య గారు మీరు అనుమతి ఇస్తే ఈ రోజు నుండి మన ఆఫీస్ లో డిజైనర్ గా జాయిన్ అవుదామని అనుకుంటున్నానని కావ్య అనగానే.. అవసరం లేదు ఇంట్లో అందరికి టైమ్ కి భోజనం పెడితే చాలు.. అదే నీకు కరెక్ట్. అయిన మా అక్క ఇది వరకే వద్దని చెప్పింది కాదా అని ధాన్యలక్ష్మి అంటుంది. నా కోడలు ఎక్కడ ఉండాలో చెప్పడానికి నువ్వెవరని ధాన్యలక్ష్మికి అపర్ణ ఘాటుగా సమాధానమిస్తుంది. నువ్వు నీ కోడలు ఎప్పుడైన ఇంటి ముందు ముగ్గు అయిన వేసారా.. నా కొడలు వేసిన డిజైన్స్ వల్లనే ఫారెన్ కాంటాక్ట్ వచ్చిందని కావ్య గురించి అపర్ణ గొప్పగా చెప్తుంది. ఆ తర్వాత కావ్య నువ్వు రేపటి నుండి ఆఫీస్ కి వెళ్ళు అని అపర్ణ చెప్పగానే అందరు హ్యాపీగా ఫీల్ అవుతుంటే ధాన్యలక్ష్మి, అనామిక మాత్రం మొహం మాడుస్తారు.

ఆ తర్వాత రాజ్ దగ్గరికి కావ్య వెళ్లి.. ఆఫీస్ కి వస్తున్నా అని ఇండైరెక్ట్ గా చెప్తుంది. నన్ను అత్తయ్య గారే వెళ్లామన్నారని కావ్య చెప్తుంది. నువ్వు ఏమైనా కల కన్నావా అంటు.. కావ్య చెప్పింది నమ్మకుండా ఆఫీస్ కి రెడీ అయి కిందకి వస్తాడు. అది చూసి నువ్వు ఒక్కడివే వస్తున్నావ్? కావ్య ఎక్కడ అని అపర్ణ అడుగుతుంది. వెంటనే.. వస్తున్నానని కావ్య వస్తుంది. నువ్వు ఒప్పుకోవడమేంటి అమ్మ అని అపర్ణని రాజ్ అడుగుతాడు. ఒప్పుకోవాలిసి వచ్చిందని అపర్ణ చెప్తుంది. ఆ తర్వాత రాజ్ , కావ్య బయటకు వస్తారు. కావ్య ఆఫీస్ కి వస్తుందని తెలిసిన రాజ్ చిరాకుగా ఉంటాడు. కావ్యని వదిలేసి రాజ్ ఒక్కడే కార్ లో వెళ్ళిపోతాడు. నేను ఎప్పుడు వస్తానన్న వద్దు అనేవారు కాదు.. ఇప్పుడు ఇలా చేస్తున్నారని కావ్య అనుకుంటుంది. తరువాయి భాగంలో క్యాబ్ కోసం వెయిటింగ్ అని అపర్ణకి కావ్య చెప్తుంది. నువ్వు క్యాబ్ లో వెళ్లడమేంటి? ఈ ఇంటికి పెద్ద కోడలివి నా కార్ లో వెళ్ళని అపర్ణ చెప్తుంది. ఆ తర్వాత కావ్యకి వెల్ కమ్ చెప్పాడానికి ఆఫీస్ లోని ఎంప్లాయిస్ రెడీగా ఉంటారు. రాజ్ వాళ్లని చూసి ఆశ్చర్యపోతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Podharillu : మహా, చక్రిలని వెతకడానికి రంగంలోకి దిగిన రౌడీలు.. ప్రతాప్ పట్టుకుంటాడా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -23 లో...మహా ఇంట్లో నుండి వెళ్లిపోతున్నట్లు లెటర్ రాసి బయటకు వచ్చి వాళ్ళ నాన్నని గుర్తుచేసుకొని ఏడుస్తుంది. ఎలాగోలా బయటకు వచ్చేస్తుంది మహా. ఆ తర్వాత చక్రి తీసుకొని వచ్చిన కార్ ఎక్కుతుంది. ముందు అ ఫోన్ నుండి సిమ్ తియ్యండి సిగ్నల్స్ ద్వారా ట్రేస్ చేస్తే ఎక్కడున్నామో తెలుస్తుందని చక్రి అనగానే అవునని సిమ్ తియ్యబోతుంటే భూషణ్ ఫోన్ చేస్తాడు. వీడికి బాకీ ఉన్న మాటలు బాగా ఉన్నాయని ఫోన్ లిఫ్ట్ చేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది. రేపు పెళ్లి పెట్టుకొని ఇలా మాట్లాడుతున్నావ్ ఏంటని భూషణ్ అంటాడు.

Jayam serial : గంగని టార్గెట్ చేసిన పారు.. రుద్ర గది నుండి బయటకు రాగలడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -162 లో... రుద్ర ఇంటికి రావడంతో శకుంతల కోప్పడుతుంది. ఆ గంగ అకాడమీలో స్టే చెయ్యడంతో ఈ ఇంటి పరువుపోతుంది వెంటనే తీసుకొని రమ్మని శకుంతల చెప్తుంది. రుద్ర తన నిర్ణయాన్ని పట్టించుకోడు. అ తర్వాత రుద్ర మళ్ళీ గంగ ఉన్న అకాడమీ దగ్గరున్న టీ షాప్ కి వెళ్లి కాసేపు ఆలోచిస్తాడు. ఇక గంగకి అకాడమీ వాళ్ళు ఏదైనా ఇబ్బంది పెడుతున్నారేమో అని ఆలోచించిన రుద్ర అక్కడ టీ షాప్ లో ఒక బుక్ తీసుకొని అకాడమీ కాంపౌండ్ దగ్గరికి వెళ్తాడు. గంగకి ఒక పేపర్ లో మెసేజ్ రాసి లోపలికి విసురుతాడు.

Illu illalu pillalu : అమూల్యకి పెళ్ళిచూపులు.. కామాక్షి ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -362 లో.. పెళ్లిచూపులకి ఇంకా రావడం లేదని రామరాజు వాళ్ళు ఎదురుచూస్తుంటే వాళ్ళు రారుగా అని శ్రీవల్లి మనసులో అనుకుంటుంది. అప్పుడే అబ్బాయి వాళ్ళు పెళ్లిచూపులకు ఎంట్రీ ఇస్తారు‌. దాంతో శ్రీవల్లి షాక్ అవుతుంది. భాగ్యం, ఆనందరావు కూడా వస్తారు. వాళ్ళు ఏం జరిగిందో శ్రీవల్లికి చెప్తారు. వాళ్ళు చెప్పాల్సింది మొత్తం అబ్బాయి వాళ్ల నాన్నకి చెప్తారు కానీ అతనికి చెవులు వినిపించవు.. వాళ్ల అమ్మ కి చెప్పేలోపు అటువైపు గా ప్రేమ, ధీరజ్ వెళ్లడం చూసి మళ్ళీ చెప్పలేకపోయామని శ్రీవల్లికి భాగ్యం చెప్తుంది.