English | Telugu

ప్రెగ్నెంట్ గా ఉన్న స్వప్నకి ఆ ట్యాబ్లెట్స్ ఎందుకని రుద్రాణి అనుమానం!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ గురువారం నటి ఎపిసోడ్ -165 లో.. కళ్యాణ్ కి వచ్చిన కొరియర్ ఇవ్వనని కావ్య కళ్యాణ్ ని ఆటపట్టిస్తుంది. అందరూ ఆ లెటర్ లో ఏం ఉందో చదవమని కావ్యకి చెప్తారు. వద్దు వదిన ప్లీజ్ అని కళ్యాణ్ అంటాడు. ఆ తర్వాత కళ్యాణ్ కి కావ్య ఆ కొరియర్ ఇస్తుంది. కళ్యాణ్ ఆ కొరియర్ తీసుకొని వెళ్లి తన గదిలో కూర్చొని తన అభిమాన పాఠకూరాలు రాసిన లెటర్ ని చదువుతాడు. ఆ లెటర్ రాసింది ఎవరో కళ్యాణ్ కి అర్థం కాదు.

మరొకవైపు స్వప్న కడుపునొప్పితో ఇబ్బంది పడుతుటుంది. ఈ విషయం ఇంట్లో వాళ్ళకి చెప్తే నాకు కడుపు లేదని తెలుస్తుంది. స్వప్న టాబ్లెట్స్ ఆన్లైన్ లో ఆర్డర్ చేస్తుంది. మరొకవైపు కనకం అప్పు ఇద్దరు కలిసి చీటి వేసే రంగమ్మ దగ్గరికి వెళ్తారు. చీటీ వేస్తాను ముందు డబ్బులు తీసుకుంటానని కనకం చెప్పగానే.. రంగమ్మ వాళ్ళని అవమానిస్తుంది. మీకు తిండికే గతి లేదు చీటీ డబ్బులు ఎలా ఇస్తావంటూ అవమానిస్తుంది. అప్పుడే రంగమ్మ భర్త వస్తాడు. ఇతనెవరు మొన్న సినిమాకి వెళ్లింది ఎవరితో అని అప్పు అంటుంది. అలా అని రంగమ్మకి వాళ్ళ భర్తకి మధ్య గొడవ పెట్టిస్తుంది అప్పు. మరొకవైపు స్వప్న ఆర్డర్ చేసిన టాబ్లెట్స్ వస్తాయి. కాగా అవి టెన్షన్ పడుతూ వెళ్లి తీసుకుంటుంది. ఏంటవి స్వప్న అంత రహస్యంగా టెన్షన్ పడుతూ తీసుకొని వెళ్తుందని రుద్రాణి చూస్తుంది. స్వప్న లోపలికి వెళ్లి టాబ్లెట్స్ వేసుకొని మిగతావి కబోడ్ లో పెడుతుంది. మరొక వైపు కావ్య డబ్బులు తీసుకొని వాళ్ళ పుట్టింటికి వెళ్ళడానికి రెడీ అవుతుంది. ఒక మాట రాజ్ కి చెప్పాలని మెసేజ్ చేస్తుంది. ఈ డబ్బులు మా నాన్నకి ఇస్తున్న అని రాజ్ కి కావ్య మెసేజ్ చేస్తుంది. నీ డబ్బులు నీకు నచ్చినట్టు వాడుకో.. నాకు ఎందుకు చెప్తున్నావని రాజ్ అంటాడు.

మరొక వైపు స్వప్న రహస్యంగా తీసుకొని వచ్చిందేంటని రుద్రాణి అనుకొని, స్వప్న గదిలోకి వెళ్లి కబోడ్ లో ఉన్న టాబ్లెట్స్ చూసి ఇవి పీరియడ్స్ వస్తే వేసుకునే టాబ్లెట్స్ కదా ఇవి స్వప్నకి ఎందుకు? అంటే స్వప్న ప్రెగ్నెంట్ కాదా అని అనుకొని బయటకు వస్తుంటే.. రాహుల్ ఎదురుపడుతాడు. ట్యాబ్లెట్స్ చూసిన రాహుల్.. ఏంటవని అడుగుతాడు. అప్పుడు రుద్రాణి టాబ్లెట్స్ విషయం చెప్తుంది. అంటే ఆ స్వప్న మనల్ని మోసం చేసి పెళ్లి చేసుకుందని రాహుల్ అంటాడు. అప్పుడే స్వప్న వస్తుంది. ఏంటి ఈ టాబ్లెట్స్ ఎందుకు? మమ్మల్ని ఎందుకు మోసం చేసావంటూ స్వప్నని నిలదీస్తుంది రుద్రాణి. దాంతో స్వప్న టెన్షన్ పడుతుంది. అప్పుడే కావ్య ఏమైందని అక్కడికి వస్తుంది. చూడే అంతా నీ వల్లే నీకు కడుపు నొప్పి అంటూ టాబ్లెట్స్ ఆర్డర్ చెయ్యమన్నావ్.. ఇప్పుడు వీళ్ళు ఇవి చూసి నేనేదో తప్పు చేసినట్లు చూస్తున్నారని స్వప్న అంటుంది. కావ్య ఆశ్చర్యంగా చూస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.



Podharillu : మహా, చక్రిలని వెతకడానికి రంగంలోకి దిగిన రౌడీలు.. ప్రతాప్ పట్టుకుంటాడా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -23 లో...మహా ఇంట్లో నుండి వెళ్లిపోతున్నట్లు లెటర్ రాసి బయటకు వచ్చి వాళ్ళ నాన్నని గుర్తుచేసుకొని ఏడుస్తుంది. ఎలాగోలా బయటకు వచ్చేస్తుంది మహా. ఆ తర్వాత చక్రి తీసుకొని వచ్చిన కార్ ఎక్కుతుంది. ముందు అ ఫోన్ నుండి సిమ్ తియ్యండి సిగ్నల్స్ ద్వారా ట్రేస్ చేస్తే ఎక్కడున్నామో తెలుస్తుందని చక్రి అనగానే అవునని సిమ్ తియ్యబోతుంటే భూషణ్ ఫోన్ చేస్తాడు. వీడికి బాకీ ఉన్న మాటలు బాగా ఉన్నాయని ఫోన్ లిఫ్ట్ చేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది. రేపు పెళ్లి పెట్టుకొని ఇలా మాట్లాడుతున్నావ్ ఏంటని భూషణ్ అంటాడు.

Jayam serial : గంగని టార్గెట్ చేసిన పారు.. రుద్ర గది నుండి బయటకు రాగలడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -162 లో... రుద్ర ఇంటికి రావడంతో శకుంతల కోప్పడుతుంది. ఆ గంగ అకాడమీలో స్టే చెయ్యడంతో ఈ ఇంటి పరువుపోతుంది వెంటనే తీసుకొని రమ్మని శకుంతల చెప్తుంది. రుద్ర తన నిర్ణయాన్ని పట్టించుకోడు. అ తర్వాత రుద్ర మళ్ళీ గంగ ఉన్న అకాడమీ దగ్గరున్న టీ షాప్ కి వెళ్లి కాసేపు ఆలోచిస్తాడు. ఇక గంగకి అకాడమీ వాళ్ళు ఏదైనా ఇబ్బంది పెడుతున్నారేమో అని ఆలోచించిన రుద్ర అక్కడ టీ షాప్ లో ఒక బుక్ తీసుకొని అకాడమీ కాంపౌండ్ దగ్గరికి వెళ్తాడు. గంగకి ఒక పేపర్ లో మెసేజ్ రాసి లోపలికి విసురుతాడు.

Illu illalu pillalu : అమూల్యకి పెళ్ళిచూపులు.. కామాక్షి ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -362 లో.. పెళ్లిచూపులకి ఇంకా రావడం లేదని రామరాజు వాళ్ళు ఎదురుచూస్తుంటే వాళ్ళు రారుగా అని శ్రీవల్లి మనసులో అనుకుంటుంది. అప్పుడే అబ్బాయి వాళ్ళు పెళ్లిచూపులకు ఎంట్రీ ఇస్తారు‌. దాంతో శ్రీవల్లి షాక్ అవుతుంది. భాగ్యం, ఆనందరావు కూడా వస్తారు. వాళ్ళు ఏం జరిగిందో శ్రీవల్లికి చెప్తారు. వాళ్ళు చెప్పాల్సింది మొత్తం అబ్బాయి వాళ్ల నాన్నకి చెప్తారు కానీ అతనికి చెవులు వినిపించవు.. వాళ్ల అమ్మ కి చెప్పేలోపు అటువైపు గా ప్రేమ, ధీరజ్ వెళ్లడం చూసి మళ్ళీ చెప్పలేకపోయామని శ్రీవల్లికి భాగ్యం చెప్తుంది.