English | Telugu

Brahmamudi : రాజ్, కావ్య కలుస్తారా.. ఒకే హాస్పిటల్ కి ఇద్దరు!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -674 లో.....రాజ్ విషయంలో ఛాన్స్ తీసుకోను.. డాడీ గతంని గుర్తు చేసే ప్రయత్నం చేస్తాను కానీ ఆ గతంలో నేను మాత్రమే ఉన్నానని క్రియేట్ చేస్తాను.. అప్పుడే రాజ్ నాతో క్లోజ్ గా ఉండడం స్టార్ట్ చేస్తాడని తన పేరెంట్స్ తో యామిని అంటుంది. అప్పుడే రాజ్ వచ్చి ఏం డిస్కస్ చేసుకుంటున్నారని అడుగుతాడు. ఏం లేదు రామ్.. రేపు నువ్వు హాస్పిటల్ కి వెళ్ళాలి కదా దాని గురించి అని యామిని కవర్ చేస్తుంది.

ఆ అమ్మాయిని కూడా అదే హాస్పిటల్ కి తీసుకొని వెళ్ళాను కదా.. అక్కడికి వెళ్తే తన గురించి ఏమైనా తెలిసే ఛాన్స్ ఉంటుంది. ఎందుకు ఆ అమ్మాయి నాకూ పదేపదే గుర్తుకుస్తుంది తెలుసుకోవాలని రాజ్ అనుకుంటాడు. మరోకవైపు కావ్య పరిస్థితి చూసి ఇందిరాదేవి, అపర్ణ ఇద్దరు బాధపడతారు. రోజు, రోజు కి ఇలా ప్రవర్తిస్తుందని అనుకుంటారు. కావ్య దగ్గరికి స్వప్న, అప్పు ఇద్దరు వెళ్తారు. ఇంట్లో వాళ్ళు నిన్ను అలా అంటున్న ఏం పట్టించుకోవా అని స్వప్న అడుగుతుంది. ఏం అంటారు పిచ్చి పట్టింది అంటారు అంతేగా అని కావ్య అంటుంది. పిచ్చి మాటలు ఎందుకు మాట్లాడుతున్నావని స్వప్న అనగానే నువ్వు కూడా అలాగే అంటున్నావని కావ్య అంటుంది. అక్క అంత అంటున్నప్పుడు బావ ఉన్నాడని ఎందుకు అనుకోకూడదు.. బావ గురించి మళ్ళీ ఇన్వెస్టిగేషన్ చేస్తానని అప్పు అంటుంది. అప్పు ఇన్వెస్టిగేషన్ చేసేలోపు మా ఆయనని ఇంటికి తీసుకొని వస్తానని కావ్య అంటుంది.

రాహుల్, రుద్రాణి ఇద్దరు కంపెనీని సొంతం చేసుకోవాలని అందుకు అడ్డుగా ఉన్న కావ్యని తొలగించాలని ప్లాన్ చేస్తారు. రుద్రాణి, రాహుల్ కలిసి రాజ్ ఫోటో దగ్గరికి వెళ్లి దీపం పెట్టాలని చూస్తుంటే కావ్య పరిస్థితి గురించి తెలిసే ఇలా చేస్తున్నావా అంటూ ఇందిరాదేవి కోప్పడుతుంది. అయినా వినకుండా రుద్రాణి దీపం పెడుతుంటే.. అప్పుడే కావ్య వచ్చి రుద్రాణి చెయ్ ఆపుతుంది. మీకు చెప్తే వినపడడం లేదా అంటూ రుద్రాణి గొంతు పట్టుకుంటుంది కావ్య. తరువాయి భాగంలో హాస్పిటల్ లో అడ్మిట్ చేసిన అమ్మాయి డీటెయిల్స్ అంటూ రాజ్ హాస్పిటల్ కి వెళ్లి అడుగుతాడు. అదే హాస్పిటల్ కి కావ్య వెళ్లి నన్ను అడ్మిట్ చేసిన అతని డీటెయిల్స్ అంటూ కావ్య అడుగుతుంది అతను ఇక్కడే ఉన్నాడని రిసెప్షన్ లో చెప్పగా.... డాక్టర్ తో మాట్లాడుతున్న రాజ్ ని కావ్య చూస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Jayam serial : గంగ, రుద్ర పూజలో కూర్చుంటారా.. పారు ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -164 లో..... రుద్ర ఏ విధంగా గంగకి హెల్ప్ చేసాడో అందరికి చెప్తాడు. పాపం పెద్దమ్మ హర్ట్ అయినట్లు ఉందని వంశీ అనగానే అయితే అవనివ్వులే గంగ సేఫ్ అయిందని పెద్దసారు అంటాడు. మరొకవైపు పారు ఫ్రెండ్స్ ని అకాడమీ మేడమ్ సస్పెండ్ చేస్తుంది. దాంతో నువ్వు సస్పెండ్ ఆపకపోతే నువ్వే ఇదంతా చేసావని మేడమ్ కి చెప్తానని పారు ఫ్రెండ్ పారుతో అంటుంది. దాంతో మేడమ్ ని సస్పెండ్ క్యాన్సిల్ చెయ్యమని రిక్వెస్ట్ చేస్తుంది పారు. తప్పు ఒప్పుకుంటున్నారు కదా ఈ ఒక్కసారి క్షమించండి అని మేడమ్ తో గంగ అనగానే తను సరే అని సస్పెన్షన్ క్యాన్సిల్ చేస్తుంది.

ఆ మీమ్ నన్ను చాలా డిస్టర్బ్ చేసింది...సావండి అంటున్న నైనికా అనసుర

నైనికా అనసురు బుల్లితెర మీద అందరికీ పరిచయమే. బిగ్ బాస్ సీజన్ 8 ద్వారా బాగా ఫేమస్ అయ్యింది. అలాగే ఢీ డాన్స్ షోలో డాన్స్ ద్వారా బాగా పాపులర్ అయ్యింది. ఇక ఇప్పుడు బిబి జోడి సీజన్ 2 లో అమరదీప్ కి జోడిగా చేస్తోంది. అలాంటి నైనికా రీసెంట్ గా తన ఇన్స్టాగ్రామ్ స్టేటస్ లో ఘాటుగా ఒక పోస్ట్ పెట్టింది. "ఎలాంటి పని లేకుండా జస్ట్ కూర్చుని అమ్మాయిల చిత్రాలను ఘోరంగా ఎడిట్ చేస్తూ వాళ్ళను హరాస్ చేసే ఒక స్టుపిడ్ మీమ్ పేజీలో పోస్ట్ చేసిన నా చిత్రాలు నన్ను చాలా డిస్టర్బ్ చేశాయి. మీకు పని లేదు బ్రో, మాకు మిమ్మల్ని పట్టించుకునేంత టైం లేదు. నువ్వు మా మీద పోస్ట్లు పెడుతున్నావ్ అంటే నువ్వు నీలోనే తోపు ఐనట్టే..మీ పేరెంట్స్ నిన్ను బాగా పెంచారు. మీలాంటి వాళ్ళే రేపు రేపిస్టుల్లా తయారవుతారు.