English | Telugu

బ్యాటరీ ఈజ్ ఫుల్ ఛార్జ్, కంటెస్టెంట్స్ ఇన్ ఫుల్ జోష్!


ముప్పై తొమ్మిదవ రోజు బిగ్ బాస్ సరికొత్తగా ఆరంభమైంది. 'బ్యాటరీ ఛార్జ్' టాస్క్ లో భాగంగా ఒక్కొక్కరు తమ ఫ్యామిలితో సరదగా మట్లాడుతూ ఎమోషన్స్ ని పంచుకొన్నారు. ఈ టాస్క్ తో హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ అందరు ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యారు.

"ఈ రోజు టాస్క్ లో భాగంగా, ఫోన్ రింగ్ అవ్వగానే ఎవరు ఫస్ట్ లిఫ్ట్ చేస్తారో వారికే ఫ్యామిలితో మాట్లాడే అవకాశం లభిస్తుంది" అని బిగ్ బాస్, కంటెస్టెంట్స్ కి వివరించాడు. కాసేపటికి ఫోన్ రింగ్ రాగానే సూర్య కాల్ లిఫ్ట్ చేసాడు. అతడికి రెండు ఆప్షన్స్ ఇవ్వగా, అందులో తన అమ్మ రాసిన ఉత్తరం కావాలనే ఆప్షన్ ని ఎంచుకొన్నాడు. తర్వాత ఆ లెటర్ రాగానే‌ దాన్ని చదువుకుంటు, చాలా ఏడ్చేసాడు. బాధలో ఉన్న సూర్యని చూసి హౌస్‌ మేట్స్ ఓదార్చారు. ఆ తర్వాత కాల్ రేవంత్ ఆన్సర్ చేసాడు. రేవంత్ కి ఇచ్చిన రెండు ఆప్షన్స్ లో తన భార్య ఫోటో కావాలనే ఆప్షన్ ని ఎంచుకొన్నాడు. కాగా ఆ ఫోటో రాగానే చూసుకొంటు ఏడ్చేసాడు.

ఆ తర్వాత వసంతి కాల్ అన్సర్ చేసింది. తన మేనకోడలు ఫోటోని కోరగా, కాసేపటికి అది వచ్చింది. ఆ ఫోటో చూస్తూ ఏడ్చేసింది వసంతి. ఆ తర్వాత రాజ్ కి అవకాశం లభించింది. రాజ్ వాళ్ళ అమ్మతో మాట్లాడే ఆప్షన్ ని ఎన్నుకొన్నాడు. కాసేపటికి ఇంటి దగ్గర నుండి వాళ్ళ అమ్మ కాల్ చేసి మాట్లాడుతూ, "నీ ఆట ఇంకా మెరుగుపరుచుకోవాలి. ఆ రోజు గీతుతో ఎలా మట్లాడినావో, అందరితో అలాగే మాట్లాడు, గట్టిగా మట్లాడు. నీ తప్పు లేనప్పుడు భయపడకుండా గట్టిగ మాట్లాడాలే " అని రాజ్ తో చెప్పుకొచ్చింది.

బ్యాటరీ ఛార్జ్ పూర్తిగా అయిపోవడంతో టాస్క్ పూర్తి అయ్యింది. హౌస్ మేట్స్ బాగా పర్ఫామెన్స్ చేయడంతో, ఈ వారం అందరికి పోటీదారులు అవ్వడానికి అందరికి సమాన అవకాశాలు కల్పించాడు. ఆ తర్వాత 'బాల్ త్రో బాస్కెట్' టాస్క్ కి ఎన్నుకోబడ్డారు ‌. అయితే ఆ టాస్క్ లో రేవంత్ వసంతి, ఆదిరెడ్డి, సూర్య, శ్రీసత్య, రాజ్ ,అర్జున్, రోహిత్ కెప్టెన్సీ పోటీదారులుగా రెండవ టాస్క్ ఆడటానికి ఎంపికయ్యారు.

Podharillu: మహా పెళ్ళికి అంతా ఫిక్స్.. చక్రిని ఆమె అర్థం చేసుకుందా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -12 లో.....మహా తన డ్రీమ్ గురించి భూషణ్ కి చెప్తుంది. డ్రీం లేదు ఏం లేదు ఫ్యామిలీ ని చూసుకుంటే సరిపోతుంది. నాకు నచ్చింది వండి పెడుతూ వెళ్ళేటప్పుడు బై చెప్పి వచ్చేటప్పుటికీ అందంగా రెడీ అయి ఉంటే చాలని చెప్పగానే వీడితో అనవసరంగా నా డ్రీమ్ గురించి చెప్పానని మహా అనుకుంటుంది. అదంతా చక్రి వింటాడు. మరొకవైపు మాధవ దగ్గరికి గాయత్రి వచ్చి.. ఈ పెళ్లి కూడా క్యాన్సిల్ అయ్యిందంట కదా అని చెప్పగానే అందరు షాక్ అవుతారు. ఏ సైలెంట్ గా ఉండు.. ఈ విషయం కన్నాకి తెలియదని మాధవ అంటాడు.

Brahmamudi: రాజ్ తీసిన యాడ్ సక్సెస్.. ధాన్యలక్ష్మి ఇచ్చిన బిగ్ ట్విస్ట్ అదే!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi).ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -911 లో..... అప్పు ఇన్వెస్టిగేషన్ చేస్తుంటే ఒకావిడని రౌడీలు వెంబడిస్తారు. అప్పుని చూసి ఆవిడ దగ్గరికి వచ్చి.. మేడం కాపాడండి అంటుంది. రౌడీలు పోలీసులని చూసి పారిపోతారు. మేడమ్ వాళ్ళు నా నగలు దొంగతనం చెయ్యాలని వెంబడిస్తున్నారని చెప్తుంది. దాంతో వాళ్ళని పట్టుకోమని కానిస్టేబుల్ కి చెప్తుంది అప్పు. చాలా థాంక్స్ మేడమ్ అని ఆవిడ చెప్తుంది. మీరు ఎక్కడికి వెళ్ళాలి నేను డ్రాప్ చేస్తానని అప్పు అంటుంది. ఆవిడ ఇంటిముందు దింపుతుంది...

Illu illalu pillalu : ఇంగ్లీష్ టీచర్ గా సెలెక్ట్ అయిన శ్రీవల్లి బయటపడుతుందా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -349 లో..... ప్రేమ, నర్మద కలిసి డుప్లికేట్ డాక్టర్ ని తీసుకొని వచ్చి శ్రీవల్లిని భయపెడతారు. నీకు జ్వరం తగ్గింది కదా అక్క ఇక ఇంటర్వ్యూకి వెళదామని ఇద్దరు దగ్గరుండి మరి ఇంటర్వ్యూ కోసం స్కూల్ కి తీసుకొని వెళ్తారు. శ్రీవల్లి ప్రిన్సిపల్ దగ్గరికి వెళ్లి తన సర్టిఫికెట్లు ఇస్తుంది. టెల్ మీ యువర్ సెల్ఫ్ అని ప్రిన్సిపల్ అనగానే శ్రీవల్లికి ఏం చెయ్యాలో అర్థం కాదు. అసలు మీకు ఇంగ్లీష్ వచ్చా రాదా అని ప్రిన్సిపల్ అడుగుతాడు.