English | Telugu

ఆఫర్ కోసం ట్రోఫీని వదిలేసుకున్న శ్రీహాన్..విన్నర్ ఐన సింగర్ రేవంత్!

బీబీ హౌస్ లో రేవంత్, రోహిత్, కీర్తి, ఆదిరెడ్డి, శ్రీహాన్ టాప్ 5 గా నిలిచారు. ఐతే వీరిలో ముందుగా రోహిత్, తర్వాత ఆదిరెడ్డి, కీర్తి ఎలిమినేట్ అయ్యారు. చివరకి రేవంత్, శ్రీహాన్ మాత్రమే మిగిలారు. వీరిద్దరిలో ఎవరు విన్నర్ అనే ఉత్కంఠ చాలా సేపు కొనసాగింది. ఐతే నాగార్జున వీరి ముందు డబ్బును పెట్టి బేరాలు మొదలుపెట్టారు.

25 లక్షల నుంచి బేరం మొదలు కాగా.. రేవంత్, శ్రీహన్ ఎక్కడా టెంప్ట్ కాలేదు. వారంతట వారే పోటీ నుంచి తప్పుకుంటే 30 లక్షల ఆఫర్ అని ప్రకటించారు. ఐనా రేవంత్, శ్రీహాన్ అంగీకరించలేదు. కానీ నాగార్జున ఒక్కసారిగా 40 లక్షల ఆఫర్ ప్రకటించేసరికి ఇద్దరూ ఆలోచించడం మొదలు పెట్టారు. చెప్పాలంటే విన్నర్ కి 50 లక్షల ప్రైజ్ మనీ ఇస్తారు. దానితో పోల్చుకుంటే 40 లక్షలు ఏమంత చిన్నఅమౌంట్ కాదు.

ఇక అప్పుడు శ్రీహాన్ 40 లక్షల ఆఫర్ కి ఒప్పుకున్నాడు. దీంతో రేవంత్ విన్నర్ అయ్యాడు. ఐతే ఇక్కడ కథ వేరేలా ఉంది. అదేంటంటే రేవంత్ కంటే శ్రీహన్ కే ఎక్కువ ఓట్లు వచ్చాయి. ఐతే శ్రీహన్ తొందరపడి 40 లక్షలకు టెంప్ట్ కాకపోయి ఉంటే విన్నర్ అయ్యేవాడు. కానీ 40 లక్షలు తీసుకుని తప్పుకోవడంతో రేవంత్ కి ఆ విజయం దక్కింది. అంటే రేవంత్ ని విన్నర్ గా శ్రీహన్ చేసినట్లే లెక్క. ఏదేమైనా డబ్బు పరంగా ఇద్దరికీ పెద్ద తేడా లేదు.

Jayam serial : బాక్సింగ్ పోటీలో మిస్సెస్ గంగ రుద్ర ప్రతాప్.. పారు ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -160 లో..... గంగని ఎలాగైనా అకాడమీ సెలక్షన్ కి వెళ్లకుండా ఆపాలని ఇషిక, వీరు ట్రై చేస్తారు కానీ గంగ, రుద్ర ఇద్దరు కలిసి ఇంట్లో అన్ని పనులు పూర్తి చేసి అకాడమీకి వెళ్తారు. రుద్ర అకాడమీ బయటే ఉంటాడు. నాకు సంబంధించిన కేసు ఇంకా పెండింగ్ లో ఉంది అలా ఉండగా.. నేను లోపలకు రాకూడదని రుద్ర బయటే ఉండి గంగకి అంతా వివరిస్తాడు. నేను నీ పేరు మైక్ లో రావడం వినాలని రుద్ర అంటాడు. గంగ లోపలకు వెళ్తుంది. అక్కడ పారు ఇంకా తన ఫ్రెండ్స్ కలిసి గంగని చులకనగా మాట్లాడుతారు.

Brahmamudi : రుద్రాణిని రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన కనకం!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -922 లో.. ఒకతను వచ్చి రుద్రాణికి మళ్ళీ పసరు మందు ఇస్తాడు. ఆ పసరు మందు పని చేస్తుందా లేదా అని రుద్రాణి అతన్ని అడుగుతుంది. పని చేస్తుందని అతను చెప్తాడు. దాంతో రుద్రాణి పసరు మందు తీసుకొని లోపలికి వెళ్తుంటే అప్పుడే కనకం ఎదురుపడుతుంది. కనకాన్ని చూసి రుద్రాణి టెన్షన్ పడుతుంది. చేతిలో అదేంటీ అని కనకం అనగానే ఇదా.... నాకే పసరు మందు అజీర్తికి వాడమని చెప్పారని చెప్పి రుద్రాణి వెళ్ళిపోతుంది. అలా అయితే ఇంత రాత్రివేళ తీసుకొని వెళ్తుంది ఏంటని కనకంకి డౌట్ వస్తుంది.