English | Telugu

Gowtham Elimination : అంబటి అర్జున్ కన్నింగ్ ప్లాన్ అదేనా.. ఈ వారం గౌతమ్ ఎలిమినేషన్ ఫిక్స్!


బిగ్ బాస్ హౌస్ లో పన్నెండవ వారం నామినేషన్ ప్రక్రియ వాడి వేడిగా సాగింది‌. ప్రియాంక కెప్టెన్ కాబట్టి తనని ఎవరు నామినేట్ చేయకూడదని బిగ్ బాస్ చెప్పాడు. ఇక అమర్ దీప్ నామినేషన్ ప్రక్రియని మొదలెట్టాడు‌‌. తన మొదటి నామినేషన్ యావర్ ని చేశాడు. బాల్స్ బ్యాలెన్స్ చేసే టాస్క్ లో నువ్వు కాళ్ళు కింద పెట్టావని అని అమర్ దీప్ అనగా.. అది తెలియకుండా చేశాను‌‌ తెలిసి తప్పు చేయనని యావర్ అన్నాడు. ఆ తర్వాత రతికని అమర్ దీప్ నామినేట్ చేశాడు.

అయితే అసలు కథ ఇప్పుడే మొదలైంది. అంబటి అర్జున్ మరియు గౌతమ్ కృష్ణ ఇద్దరు కలిసి శివాజీ, ప్రశాంత్, యావర్ లని టార్గెట్ చేశారు.‌ వీరిద్దరు కలిసి కావాలని నామినేట్ చేసినట్టుగా అభిమానులకి స్పష్టంగా తెలిసింది.‌ అసలు నామినేషన్ పాయింట్ లేకుండా చెత్త రీజన్ తో పల్లవి ప్రశాంత్ ని గౌతమ్ నామినేట్ చేశాడు. ఒకప్పుడు నామినేషన్స్ అంటే పల్లవి ప్రశాంత్‌లో అపరిచితుడు దూరిపోయేవాడు. అసలు ఎదురుగా ఉన్నవాళ్లని మాట్లాడనిచ్చేవాడే కాదు. కానీ ఈ వారం నామినేషన్స్‌లో మాత్రం చాలా కూల్‌గా కామెడీ చేస్తూ ఇచ్చిపడేశాడు ప్రశాంత్. పన్నెండవ వారం నామినేషన్ లో గౌతమ్ చేసిన సిల్లీ రీజన్స్ వెనుక అంబటి అర్జున్ ఉన్నాడని అందరికి తెలిసిందే.

యావర్, శివాజీలని అంబటి అర్జున్ నామినేట్ చేశాడు. తెలిసి చేసిన తెలియక చేసిన తప్పు తప్పే .. ఆ రోజు టాస్క్ లో నువ్వు కాలు కింద పెట్టావ్‌ అలా ఇంకోసారి చేయకూడదని నామినేట్ చేస్తున్నానని యావర్ తో అంబటి అర్జున్ అన్నాడు‌. ఆ తర్వాత శివాజీని నామినేట్ చేశాడు. " ప్రశాంత్ అరిచాడని మీకు డిస్టబెన్స్ అవుతుందని అన్నారు‌. అదే మీరు గేమ్ అయిపోయాక ప్రశాంత్ పై గట్టిగా అరిచారు‌. అప్పటికి యావర్ గేమ్ ఆడుతున్నాడు.

మీకు డిస్టబ్ అయినట్టు అతనికి కూడా డిస్టబ్ అవుతుంది కదా" అని శివాజీతో అంబటి అర్జున్ అన్నాడు. ఇక్కడ సంచాలకులు శోభాశెట్టి, ప్రశాంత్ కానీ వీరిద్దరిని నామినేట్ చేయకుండా శివాజీని నామినేట్ చేయడమేంటని, నామినేషన్ కి ముందు అంబటి అర్జున్, గౌతమ్ కృష్ణ ఇద్దరు అనుకొని నామినేట్ చేయడం కరెక్ట్ కాదని నెటిజన్లు భావిస్తున్నారు. అయితే ఈ వారం డబుల్ ఎలిమినేషన్ కాబట్టి అంబటి అర్జున్, గౌతమ్ కృష్ణ ఎలిమినేట్ అయ్యే అవకాశాలు చాలా ఉన్నాయి.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.

Karthika Deepam2 : దాస్ ని నిజం చెప్పకుండా ఆపిన కార్తీక్.. దీప ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(karthika Deepam2).ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -566 లో.. జ్యోత్స్న గురించి శివన్నారాయణకి దాస్ నిజం చెప్పాలని అనుకుంటాడు. జ్యోత్స్న, పారిజాతం టెన్షన్ పడుతారు. దాస్ ని జ్యోత్స్న  కొట్టిన విషయం చెప్తాడు కావచ్చని దశరథ్ అనుకుంటాడు. జ్యోత్స్న గురించి ఇప్పుడే నిజం తెలియొద్దని దాస్ ని ఆపాలని కార్తీక్ ట్రై చేస్తాడు.. దాస్ నిజం చెప్పబోతుంటే ఒకవైపు దశరథ్.. ఒకవైపు కార్తీక్.. ఒకేసారి దాస్ ని ఆగమంటారు. దాస్ ఏదో ..చెప్పడానికి ఇబ్బంది పడుతున్నావ్ పక్కకిరా.. నాతో చెప్పమని దశరథ్ అంటాడు.

Podharillu : పోలీస్ స్టేషన్లో చక్రి, మహా.. భూషణ్ ఏం చేయనున్నాడు!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -26 లో..... చక్రి, మహా ఇద్దరు కార్లో వెళ్తుంటే వాళ్ళని ఫాలో చేస్తూ మహా వాళ్ళ నాన్న ప్రతాప్ అతడి కొడుకు ఆది వెళ్తారు. వారితో పాటుగా మహాని పెళ్ళి చేసుకోవాలనుకునే భూషణ్ మరోచైపు ఫాలో చేస్తుంటారు. అయితే ఒక దగ్గర చక్రి , మహా వాళ్ళు దొరికిపోతారు. ఇక మహా వాళ్ళ నాన్న ప్రతాప్.. మహాని రమ్మని చెప్పగా.. ఆ జుట్టోడితో నా పెళ్ళి వద్దు అందుకే పారిపోతున్నానని మహా అంటుంది. చక్రిని చంపేసి నా కూతురిని తీసుకురమ్మని ప్రతాప్ అంటాడు. అప్పుడే వారి మధ్యలోకి బాలు కారులో వేగంగా వచ్చి ఆగుతాడు.