English | Telugu

సదా మీద ఫైర్ ఐన ఆరియానా...వాళ్ళ మీద ఈగ కూడా వాలనివ్వరు

నీతోనే డాన్స్ 2 .0 లో కొత్త కొత్త విషయాలు జరుగుతున్నాయి. ప్రతీ వారం లాగే ఈ వారం ఎపిసోడ్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఇందులో అరియనా-అవినాష్ ఎంట్రీ ఇచ్చారు. అలాగే మానస్- సుబ్బు జోడీలో సుబ్బుకి హెల్త్ బాలేని కారణంగా మానస్ ఒక్కడే షోకి వచ్చాడు. ఐతే మరి జోడీ ఎవరు నీకు అని శ్రీముఖి అనేలోపు వెనక నుంచి భానుశ్రీ ఎంట్రీ ఇచ్చింది. "అబ్బాయి అబ్బాయి డాన్స్ చేయకూడదు..అబ్బాయి అమ్మాయి డాన్స్ చేయాలి" అని శ్రీముఖి అనేసరికి అందరూ నవ్వేశారు. అలాగే అమరదీప్ - తేజస్విని గౌడ ఇద్దరూ ఈ షోలో కనిపించారు. ఐతే ఈ వారం ఎపిసోడ్ లో రెండు జంటల మధ్య గట్టిగా యుద్ధం జరగబోతోందన్న విషయం ప్రోమో ద్వారా తెలుస్తోంది. అదే అవినాష్ - అరియానా, విశ్వా-నయని పావని జంటల మధ్య మార్కుల యుద్ధం జరిగింది.

ఒకరికి పోటీ మరొకరు తక్కువ మార్క్స్ ఇచ్చుకుని అరుచుకున్నారు. అలాగే నితిన్- అక్షితే హారర్ పెర్ఫార్మెన్స్ కి ఇచ్చిన మార్క్స్ విషయంలో అమరదీప్ - తేజు అండ్ బ్రిట్టో - సంధ్య జోడీలు మధ్య బాగా యుద్ధం జరిగింది. ఇక విశ్వా - నయని పావని డాన్స్ కి ఆరియానా చాలా తక్కువ మార్క్స్ ఇచ్చేసరికి సదా మధ్యలో వచ్చి ఆరియానా మీద అరిచేసింది. ఆరియానా కూడా జడ్జెస్ అలా అరవకూడదంటూ రివర్స్ కౌంటర్లు వేసింది. ఐతే జడ్జి సదాకి ఈ డాన్స్ షోలో బ్రిట్టో, విశ్వా, నేహా చౌదరి, యావర్ అంటే విపరీతమైన ఇష్టం..వాళ్ళ మీద ఈగ కూడా వాలనివ్వరు.. ఇక అరియనా గట్టిగా అన్న మాటలకు సదా అహం దెబ్బతిని షోలోంచి లేచి వెళ్ళిపోయింది. ఇక సదా ఎక్స్ప్రెషన్స్ మీద అఖిల్ కూడా రీసెంట్ గా ఒక పోస్ట్ పెట్టాడు.

Podharillu : మహా, చక్రిలని వెతకడానికి రంగంలోకి దిగిన రౌడీలు.. ప్రతాప్ పట్టుకుంటాడా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -23 లో...మహా ఇంట్లో నుండి వెళ్లిపోతున్నట్లు లెటర్ రాసి బయటకు వచ్చి వాళ్ళ నాన్నని గుర్తుచేసుకొని ఏడుస్తుంది. ఎలాగోలా బయటకు వచ్చేస్తుంది మహా. ఆ తర్వాత చక్రి తీసుకొని వచ్చిన కార్ ఎక్కుతుంది. ముందు అ ఫోన్ నుండి సిమ్ తియ్యండి సిగ్నల్స్ ద్వారా ట్రేస్ చేస్తే ఎక్కడున్నామో తెలుస్తుందని చక్రి అనగానే అవునని సిమ్ తియ్యబోతుంటే భూషణ్ ఫోన్ చేస్తాడు. వీడికి బాకీ ఉన్న మాటలు బాగా ఉన్నాయని ఫోన్ లిఫ్ట్ చేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది. రేపు పెళ్లి పెట్టుకొని ఇలా మాట్లాడుతున్నావ్ ఏంటని భూషణ్ అంటాడు.

Jayam serial : గంగని టార్గెట్ చేసిన పారు.. రుద్ర గది నుండి బయటకు రాగలడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -162 లో... రుద్ర ఇంటికి రావడంతో శకుంతల కోప్పడుతుంది. ఆ గంగ అకాడమీలో స్టే చెయ్యడంతో ఈ ఇంటి పరువుపోతుంది వెంటనే తీసుకొని రమ్మని శకుంతల చెప్తుంది. రుద్ర తన నిర్ణయాన్ని పట్టించుకోడు. అ తర్వాత రుద్ర మళ్ళీ గంగ ఉన్న అకాడమీ దగ్గరున్న టీ షాప్ కి వెళ్లి కాసేపు ఆలోచిస్తాడు. ఇక గంగకి అకాడమీ వాళ్ళు ఏదైనా ఇబ్బంది పెడుతున్నారేమో అని ఆలోచించిన రుద్ర అక్కడ టీ షాప్ లో ఒక బుక్ తీసుకొని అకాడమీ కాంపౌండ్ దగ్గరికి వెళ్తాడు. గంగకి ఒక పేపర్ లో మెసేజ్ రాసి లోపలికి విసురుతాడు.

Illu illalu pillalu : అమూల్యకి పెళ్ళిచూపులు.. కామాక్షి ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -362 లో.. పెళ్లిచూపులకి ఇంకా రావడం లేదని రామరాజు వాళ్ళు ఎదురుచూస్తుంటే వాళ్ళు రారుగా అని శ్రీవల్లి మనసులో అనుకుంటుంది. అప్పుడే అబ్బాయి వాళ్ళు పెళ్లిచూపులకు ఎంట్రీ ఇస్తారు‌. దాంతో శ్రీవల్లి షాక్ అవుతుంది. భాగ్యం, ఆనందరావు కూడా వస్తారు. వాళ్ళు ఏం జరిగిందో శ్రీవల్లికి చెప్తారు. వాళ్ళు చెప్పాల్సింది మొత్తం అబ్బాయి వాళ్ల నాన్నకి చెప్తారు కానీ అతనికి చెవులు వినిపించవు.. వాళ్ల అమ్మ కి చెప్పేలోపు అటువైపు గా ప్రేమ, ధీరజ్ వెళ్లడం చూసి మళ్ళీ చెప్పలేకపోయామని శ్రీవల్లికి భాగ్యం చెప్తుంది.